Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

సీఎం గారూ..! ముందున్న మూడేళ్ళే అసలైన పరీక్ష!!|EDITORIAL

విజయోత్సాహం పాలనలో అలసత్వానికి దారితీయకూడదు. స్థానిక సంస్థల ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా బలాన్నిచ్చినా, అదే సమయంలో ప్రజల అంచనాలు కూడా పెంచాయి. ఆ అంచనాలకు అనుగుణంగా పరిపాలన సాగితేనే భవిష్యత్ ఎన్నికల్లోనూ విజయం సాధ్యమవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా అసలైన బలం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచాయి. ఎంపీ, ఉప ఎన్నికలు, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల వరుస ఫలితాలు ఆయనకు రాజకీయంగా తిరుగులేని బలాన్నిచ్చాయి. పార్టీ ఢిల్లీ అధిష్ఠానం నుంచి ప్రశంసలు అందుకోవడం కూడా ఆయన స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది.

ప్రభుత్వం విఫలమైందని ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి కొంతకాలంగా ప్రచారం చేస్తోంది. తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిన నేపథ్యంలో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగిందనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. కానీ స్థానిక ఎన్నికల ఫలితాలు ఆ అంచనాలకు విరుద్ధంగా వచ్చాయి. ఇది ప్రతిపక్షానికి హెచ్చరిక అయితే, అధికార పక్షానికి మరింత బాధ్యతగా వ్యవహరించడానికి, ఆత్మపరిశీలనకు అవకాశం.

ఎన్నికల విజయాలు నాయకత్వ నైపుణ్యాన్ని సూచిస్తాయి. ముఖ్యమంత్రి జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేయడం, పార్టీలో సీనియర్లను ఏకతాటిపై నడిపించడం వంటి వ్యూహాలు మంచి ఫలితాల్నిచ్చాయి. కాంగ్రెస్‌లో సహజంగా కనిపించే అంతర్గత అసమ్మతిలను అధిగమిస్తూ రేవంత్ తన స్థానాన్ని బలపరుచుకున్నారు. పదిలపరుచుకున్నారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంది. మంచినీరు, సాగునీటి సమస్యలు అనేక ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల నుంచి ధాన్యం సేకరణ, గిట్టుబాటు ధరల కల్పనలో స్పష్టత అవసరం. నిరుద్యోగ సమస్య ఇంకా యువతను వేధిస్తోంది. ఏసీబీ దాడులు ఎన్ని జరిగినా, ప్రభుత్వ యంత్రాంగంలో ఇంకా అవినీతి పెరుగుతూనే ఉన్నది. రోజుకో చోట లంచం కేసులు వెలుగులోకి రావడం ఆందోళనకరం. విద్యుత్ శాఖలో ఉద్యోగుల సస్పెన్షన్లు జరిగినా, వ్యవస్థాపక సంస్కరణలు లేకపోతే సమస్య సమూలంగా పరిష్కారం కాదు.

మంత్రులపై ‘పర్సంటేజీల’ ఆరోపణలు ఉన్నాయి. వారి అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఇలాంటివి ప్రభుత్వ ప్రతిష్ఠకు దెబ్బతీస్తున్నాయి. పాలనలో సమన్వయం, జవాబుదారీతనం ఇంకా పెరగాలి. ప్రజలకు చేరువైన పారదర్శక వ్యవస్థ అవసరం. అవినీతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే స్థానిక ఎన్నికల్లో వచ్చిన విజయాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతే, అవసరాలను తీర్చకపోతే అసంతృప్తి పెరగక మానదు.

స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా స్థానిక అంశాలతోనే ప్రభావితమవుతాయి. అధికార పార్టీవైపు ప్రజలు మొగ్గడం సహజం. సార్వత్రిక ఎన్నికలు మాత్రం రాష్ట్ర స్థాయి పాలన, సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రైతు సంక్షేమం వంటి విస్తృత అంశాలపై ఆధారపడతాయి. స్థానిక విజయాలు భవిష్యత్ సార్వత్రిక గెలుపునకు ఒక సానుకూలాంశమే తప్ప, అవే అసలైన విజయాలుగా ముందే భావించలేం.

2029లో జమిలి ఎన్నికలపై చర్చలు సాగుతున్నాయి. అదే నిజమైతే రాజకీయ సమీకరణాలు మారవచ్చు. వచ్చే మూడేళ్ళు అధికార పార్టీకి అత్యంత కీలక కాలం. ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా పాలనలో గుణాత్మక మార్పులు తీసుకురావాలి. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వ్యవసాయ రంగానికి స్థిరమైన మద్దతు, పరిశ్రమల ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ అవసరం.

నిరంతరం ప్రజల మనసు గెలుచుకోవాలంటే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. విజయోత్సాహం పాలనలో అలసత్వానికి దారితీయకూడదు. స్థానిక సంస్థల ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా బలాన్నిచ్చినా, అదే సమయంలో ప్రజల అంచనాలు కూడా పెంచాయి. ఆ అంచనాలకు అనుగుణంగా పరిపాలన సాగితేనే భవిష్యత్ ఎన్నికల్లోనూ విజయం సాధ్యమవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా అసలైన బలం.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News