Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

యమపాశంగా ఆయిల్ గ్యాస్ బ్లోఅవుట్లు!|EDITORIAL

గోదావరి పరవళ్లు, పచ్చటి ప్రకృతి అందాలతో విరాజిల్లే కోనసీమ గత కొన్ని దశాబ్దాలుగా చమురు, సహజవాయు అన్వేషణలతో నిత్య భయాల మధ్య జీవిస్తోంది. ఓఎన్‌జీసీ అడుగుపెట్టిన నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి కన్నా ప్రమాదాలనే ఎక్కువగా చూశారు. పొలాల్లో, ఇళ్ల మధ్య, కాళ్ల కింద ఎప్పుడు పేలుతాయో తెలియని ఆయిల్‌, గ్యాస్‌ పైపులైన్లు, కోనసీమ ప్రజల జీవితంలో శాశ్వత ఆందోళనగా మారాయి. 30ఏళ్ళ క్రితం పాశర్లపూడి బ్లోఅవుట్‌ గానీ, తాజా ఇసుమండ బ్లోఅవుట్‌ గానీ, నేర్పుతున్న పాఠం ఒక్కటే. అభివృద్ధి ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే, ఆ మంటలు తరతరాల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆయిల్, గ్యాస్, అభివృద్ధి ఏదైనా మానవ మనుగడకే తప్ప, మానవ హననానికి కాదని గుర్తుంచుకోవాలి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

గోదావరి పరవళ్లు, పచ్చటి ప్రకృతి అందాలతో విరాజిల్లే కోనసీమ ప్రాంతం గత కొన్ని దశాబ్దాలుగా చమురు, సహజవాయు అన్వేషణలతో నిత్య భయాల మధ్య జీవిస్తోంది. దేశ ఇంధన అవసరాల కోసం ఓఎన్‌జీసీ అడుగుపెట్టిన నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి కన్నా ప్రమాదాలనే ఎక్కువగా చూశారు. పొలాల్లో, ఇళ్ల మధ్య, కాళ్ల కింద ఎప్పుడు పేలుతాయో తెలియని ఆయిల్‌, గ్యాస్‌ పైపులైన్లు, కోనసీమ ప్రజల జీవితంలో శాశ్వత ఆందోళనగా మారాయి.

1995 జనవరి 8న పాశర్లపూడిలో సంభవించిన బ్లోఅవుట్‌ ఈ ప్రాంత చరిత్రలో చెరగని విషాద ఘట్టం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బ్లోఅవుట్‌గా నమోదైన ఈ ఘటనను అదుపు చేయడానికి 65 రోజులు పట్టింది. ఆరు వేల కుటుంబాలు శిబిరాలకు తరలిపోవాల్సి వచ్చింది. పంటలు నాశనమై, పర్యావరణానికి తీరని నష్టం జరిగింది. ఆ మంటల వేడి, ఆకాశాన్ని చీల్చిన శబ్దం ఇప్పటికీ కోనసీమ వాసుల జ్ఞాపకాలలో భయానకంగా నిలిచిపోయాయి.

పాశర్లపూడి బ్లోఅవుట్‌ ఒక్కసారిగా జరిగిన ప్రమాదమేమీ కాదు. 1993లో కొమరాడ, 1997లో దేవరపల్లి, 2020లో ఉప్పూడి, ఇలా బ్లోఅవుట్‌లు తరచూ జరుగుతూనే ఉన్నాయి. 2014లో మామిడికుదురు మండలం నగరంలో గెయిల్‌ పైప్‌లైన్‌ పేలి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కాలం చెల్లిన పైప్‌లైన్లు, నిర్వహణ లోపాలు, ప్రైవేటు సంస్థల నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
తాజాగా మలికిపురం మండలం ఇసుమండలో ఓఎన్‌జీసీ బావిలో సంభవించిన బ్లోఅవుట్‌ కోనసీమను మరోసారి కలవరపాటుకు గురిచేసింది. ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చినా, మూడు రోజులైనా మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వందలాది కొబ్బరి చెట్లు, వరి నారుమళ్లు, పంటలు నాశనం కావడం ఈ ప్రమాద తీవ్రతను స్పష్టం చేస్తోంది. బ్లోఅవుట్‌ భయంతో మూడు గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది.
ఇన్ని సంఘటనలు జరుగుతున్నా పాఠాలు ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? 1993లో డ్రిల్లింగ్‌ చేసిన బావిని, అధిక పీడనం ఉందని అప్పట్లోనే నిలిపివేసిన ప్రాంతాన్ని, మళ్లీ ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ఎంతవరకు సమంజసం? ప్రమాదానికి గల అసలు కారణాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం పాలనా వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే హడావుడి పడటం కాదు. ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడమే చమురు సంస్థలు, నిర్వాహకులు, ప్రభుత్వాల బాధ్యత. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ఓఎన్‌జీసీ వంటి సంస్థలు ప్రజల ప్రాణాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కాలం చెల్లిన పరికరాలు తొలగించడం, కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేయడం, ప్రైవేటు సంస్థలపై కఠిన నియంత్రణ పెట్టడం అత్యవసరం. బాధితులకు తక్షణమే సముచిత నష్టపరిహారం చెల్లించడం ఇంకా అవసరం.

పాశర్లపూడి బ్లోఅవుట్‌ జరిగి మూడు దశాబ్దాలు గడిచాయి. కానీ కోనసీమ ప్రజల భయాలు ఏమాత్రం తగ్గలేదు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, మానవ నిర్లక్ష్యం ఉంటే ప్రమాదాలు తప్పవు. పాశర్లపూడి నుంచి నేటిదాకా కోనసీమ నేర్పుతున్న పాఠం ఇదే. అభివృద్ధి ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే, ఆ మంటలు తరతరాల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆయిల్ గ్యాస్ అయినా, అభివృద్ధి అయినా మానవ మనుగడకే తప్ప, మానవ హననానికి కాదని గుర్తుంచుకోవాలి.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News