Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

పర్యావరణ ప్రతీకలు పులులు!|EDITORIAL

పులుల జన సంచారం ఒక హెచ్చరిక. ఇది ప్రకృతి మనకు ఇస్తున్న చివరి సంకేతం. ఇప్పటికైనా మేల్కొని అడవులను కాపాడితేనే పర్యావరణ సమతుల్యత నిలుస్తుంది. లేదంటే అభివృద్ధి పేరుతో మనమే మన భవిష్యత్తును నాశనం చేసుకున్న వారమవుతాం. అడవులను రక్షించడం అంటే కేవలం పులులను మాత్రమే కాదు, మనల్ని మనం రక్షించుకోవడమే.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

పర్యావరణ సమతౌల్యానికి పులులు ప్రతీకలు! జీవ వైవిధ్యానికే జీవం పులులు!! అడవుల్లో పులి ఉందంటే, అక్కడ జీవవైవిధ్యం సరిగ్గా ఉందని అర్థం. అందుకే 1973కు ముందు జాతీయ జంతువుగా ఉన్న సింహాన్ని కాదని పులిని ప్రకటించారు. ఇది దయ, బలం, చురుకుదనం, శక్తికి ప్రతీక. వన్యప్రాణి సంరక్షణకు చిహ్నం. అటువంటి కీలకమైన వన్యప్రాణి నేడు అడవులను విడిచి గ్రామాలు, పట్టణాల అంచులలో సంచరిడానికి కారణం మానవులే. మనమే. అడవులను నిర్దాక్షిణ్యంగా నరికివేయడం, కొండలను విధ్వంసం చేయడం, సహజ వనరులను లూటీ చేయడమే ఈ సంక్షోభానికి మూలం.
అడవులు జంతుజాలానికి ఆవాసాలు. ఆవాసాలే నశించి, వాటి మనుగడ ప్రమాదంలో పడుతుంటే, అవి ఎక్కడికెళ్ళాలి? అడవులు పచ్చగా ఉన్నంతకాలం పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు అడవుల్లోనే ప్రశాంతంగా జీవించాయి. కానీ, అభివృద్ధి పేరుతో సాగుతున్న అడవుల విధ్వంసం వన్యప్రాణులను బలవంతంగా మనుషుల మధ్యకు నెట్టేస్తోంది. దీంతో పులులు గ్రామాల్లోకి రావడం, ప్రజల్లో భయాందోళనలు చెలరేగడం సహజంగా మారింది.

ఏపీ, తెలంగాణాల్లో ఇటీవల పులుల సంచారం పెరగడం ఇదే చేదు నిజానికి నిదర్శనం. నల్లమల, తిరుమల కొండలు, అమ్రాబాద్‌, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి వంటి అటవీ ప్రాంతాల్లో పులుల కదలికలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని తాడోబా టైగర్‌ రిజర్వ్ లో పులుల సంఖ్య పెరగడంతో అక్కడ స్థలం సరిపోక, కొత్త ఆవాసాల కోసం అవి తెలంగాణ వైపు కదులుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులను ఈదుకుంటూ పులులు ప్రయాణిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చేసుకోవచ్చు.
అడవుల విస్తీర్ణం తగ్గడం, అటవీ కారిడార్లు ఛిన్నాభిన్నం కావడం వల్ల పులులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సురక్షితంగా కదలలేకపోతున్నాయి. దీంతో అవి వ్యవసాయ పొలాలు, గ్రామాల మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. ఇది మనుషులకు మాత్రమే కాదు, పులులకు కూడా ప్రమాదకరం. ఒకవైపు పంట నష్టం, ఆస్తి విధ్వంసం జరుగుతుండగా, మరోవైపు వేటగాళ్ల ఉచ్చులు, రోడ్డు ప్రమాదాల్లో పులులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్రకాశం జిల్లాలో వాహనం ఢీకొని ఓ పులి మృతి చెందడం మన నిర్లక్ష్యానికి నిదర్శణం.

ఇప్పటికే గ్రామాల్లో కోతులు విచ్చలవిడిగా విహరిస్తున్నాయి. పులులు, చిరుతలు కూడా అదే బాటలో వస్తే పరిస్థితి ఎంత భయానకంగా మారుతుందో ఊహించుకోవడం కష్టం కాదు. సమస్యను మూలంలోనే పరిష్కరించకుండా, వన్యప్రాణులను తరిమికొట్టే చర్యలతో సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉంది. అడవులను కాపాడకపోతే, రేపు మనుషులే తమతోపాటు తమ నివాసాలను వాటి బారి నుండి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు, ట్రాకర్లు, ప్రత్యేక గస్తీ బృందాలతో పులుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. కానీ వాటిని నియంత్రించలేరు. ఈ సమస్యకు అసలైన పరిష్కారం అడవుల సంరక్షణలోనే ఉంది. అటవీ కారిడార్లను పునరుద్ధరించడం, అక్రమ నరికివేతను అరికట్టడం, కొండలను సంరక్షించడం అత్యవసరం. అభివృద్ధి ప్రణాళికలలో పర్యావరణ ప్రభావ అంచనాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

ఇంకా పులులు సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యం. పులిని శత్రువుగా కాకుండా పర్యావరణ రక్షకుడిగా చూడగల దృష్టి రావాలి. సమాచారాన్ని వెంటనే అటవీశాఖకు అందించడం, వేటగాళ్లను నిరోధించడం ప్రజల బాధ్యత. ఎందుకంటే అడవులు ఉంటేనే మనం ఉంటాం. పులులు ఉంటేనే అడవులు ఉంటాయి.

పులుల జన సంచారం ఒక హెచ్చరిక. ఇది ప్రకృతి మనకు ఇస్తున్న చివరి సంకేతం. ఇప్పటికైనా మేల్కొని అడవులను కాపాడితేనే పర్యావరణ సమతుల్యత నిలుస్తుంది. లేదంటే అభివృద్ధి పేరుతో మనమే మన భవిష్యత్తును నాశనం చేసుకున్న వారమవుతాం. అడవులను రక్షించడం అంటే కేవలం పులులను మాత్రమే కాదు, మనల్ని మనం రక్షించుకోవడమే.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News