Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

అసెంబ్లీలో నదీజల రాజకీయాలు!|EDITORIAL

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నదీ జలాలు ఎజెండాగా కొనసాగనున్నాయి. కృష్ణా, గోదావరి జలాలపై ఆంధ్రప్రదేశ్ విధి విధానాలు, కేంద్రం వైఖరిపై కంటే, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ల తీరుతెన్నులపైనే ప్రధానంగా చర్చ జరుగనుంది. ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది ప్రతిపక్షం వ్యూహం. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణకు జరిగిన జల అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం తలపోస్తోంది. అసెంబ్లీ వేదికగా మరోసారి ‘నీటి మంటలు’ చెలరేగే పరిస్థితి నెలకొంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నదీ జలాలు ఎజెండాగా కొనసాగనున్నాయి. కృష్ణా, గోదావరి జలాలపై ఆంధ్రప్రదేశ్ విధి విధానాలు, కేంద్రం వైఖరిపై కంటే, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ల తీరుతెన్నులపైనే ప్రధానంగా చర్చ జరుగనుంది. ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది ప్రతిపక్షం వ్యూహం. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణకు జరిగిన జల అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం తలపోస్తోంది. అసెంబ్లీ వేదికగా మరోసారి ‘నీటి మంటలు’ చెలరేగే పరిస్థితి నెలకొంది.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో నదీజలాలను సమర్థంగా వినియోగించుకుంటాయన్న ఆశలు నెరవేరలేదు. పైగా జలవివాదాలు మరింత ముదిరాయి. వృథా అవుతున్న నీటిని నిల్వ చేసుకోవడం, సమగ్ర జలవిధానాలు రూపొందించుకోవడం వంటి అంశాలను పాలకులు విస్మరించారు. దూరదృష్టి లేని నిర్ణయాలు, రాజకీయ లాభాలకే పరిమితమైన ప్రాజెక్టులు ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా మారాయి.

ఏపీలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం పదేళ్లు గడిచినా పూర్తికాలేదు. జగన్‌ పాలనలో బటన్‌ నొక్కుడు కార్యక్రమాలు, మాఫియాల ఆరోపణలు, రాజధాని గందరగోళం మధ్య పోలవరం వెనుకబడింది. ఇప్పుడు చంద్రబాబు కూడా వైఖరిలోనూ పోలవరం పూర్తి చేయడంపై కంటే బనకచర్ల, ఇతర లింక్‌ ప్రాజెక్టుల పేరుతో ప్రాంతీయ విభేదాలను పెంచే ప్రయత్నాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తెలంగాణలోనూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది. కేసీఆర్‌ హయాంలో కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు తెలంగాణకు వరంగా ప్రచారం జరిగినా, నిర్మాణ లోపాలు, నిర్వహణ వైఫల్యాలు బయటపడ్డాయి. బ్యారేజీల కుంగుబాటు, లక్షల కోట్ల ప్రజా ధనం వృథా అనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇతర మధ్యతరహా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కూడా నిర్లక్ష్యానికి గురైంది. ఫలితంగా జల భద్రత కంటే రాజకీయ ప్రతిష్ఠే ప్రధానంగా మారింది.

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ప్రధానంగా లేవనెత్తుతున్న అంశం పోలవరం–నల్లమల (పీఎన్‌ లింక్‌) ప్రాజెక్టు. ఈ లింక్‌ ద్వారా కేవలం గోదావరి మిగులు జలాలే కాకుండా కృష్ణా జలాలను కూడా మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నది బీఆర్‌ఎస్‌ వాదన. ఏపీ ప్రభుత్వం పీఎన్‌ లింక్‌ ద్వారా సుమారు 200 టీఎంసీల నీటిని తరలించాలన్న ప్రతిపాదనలతో డీపీఆర్‌ తయారీకి టెండర్లు పిలవడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ లింక్‌లో భాగంగా పోలవరం కుడికాలువ నుంచి ప్రకాశం బరాజ్‌, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రణాళిక ఉంది. ఈ మార్గంలో నాగార్జునసాగర్‌ కుడి కాలువను దాటాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ అనుసంధానాలను ఉపయోగించి సాగర్‌ నుంచే కృష్ణా జలాలను బొల్లాపల్లికి మళ్లించే అవకాశముందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ప్రస్తుతం 173 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న బొల్లాపల్లి రిజర్వాయర్‌ను భవిష్యత్తులో 400 టీఎంసీల వరకు విస్తరించవచ్చన్న వాదన ఈ భయాలను మరింత పెంచుతోంది.

ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఏపీ కేటాయింపులకు మించి కృష్ణా జలాలను వినియోగిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీశైలం నుంచే జలదోపిడీ జరుగుతుండగా, సాగర్‌ నుంచీ అదే ప్రక్రియ మొదలైతే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. చెన్నై తాగునీటి కోసం కృష్ణా బేసిన్‌ రాష్ట్రాలు 15 టీఎంసీలు ఇవ్వాలన్న ఒప్పందం కూడా కాలక్రమేణా జలదోపిడీకి మారిందన్న విమర్శలు ఉన్నాయి.

ఈ మొత్తం పరిణామాల్లో అత్యంత ఆందోళన కలిగించే అంశం, ప్రభుత్వాలకు నీటి వనరుల నిర్వహణపై సమగ్ర దృక్పథం లేకపోవడం. వృథా, మిగులు జలాలను నిల్వ చేసుకునే ప్రాజెక్టులు, రాష్ట్రాల మధ్య విశ్వాసంతో కూడిన ఒప్పందాలు, పారదర్శక సంఖ్యా వివరాలు, పంపకం వంటివేవీ రాజకీయ ప్రాధాన్యత పొందడం లేదు. ఫలితంగా, నీరు అత్యంత ఆవశ్యమైన వనరుగా కాకుండా, ఒక రాజకీయ ఆయుధంగా మారింది.

అసెంబ్లీలో ఈ అంశాలపై తీవ్ర వాగ్వాదం అనివార్యంగా మారింది. అయితే ఈ చర్చలు రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా, శాస్త్రీయంగా, సాంకేతిక సంఖ్యల ఆధారంగా, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దిశగా సాగితేనే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. లేదంటే, గతంలాగే నదీజలాలు రాజకీయ మంటల్లో కాలిపోతూనే ఉంటాయి.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News