Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

పేదరికం తగ్గుతోందా? పెరుగుతోందా!?|EDITORIAL

భారతదేశంలో పేదరిక నిర్మూలన నిరర్ధక ప్రయాసగా మారింది. శాస్త్రీయ ప్రమాణాలులేని కాకిలెక్కలుగా మిగిలిపోయింది. పేదరికం, పేదలు రాజకీయాలకు ఇరుసు, ఇంధనంగా నాయకులు గ్రహించారు. పేదల పేరుతో పథకాలు ప్రకటించడం, వాటి అమలు పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచేయడం, తద్వారా ఓట్లుగా మలచుకోవడం రాజకీయ క్రీడగా నిరంతరం కొనసాగుతూనే ఉంది.

ఇటీవల ఉపాధి హామీ పథకం పేరు మార్పు చుట్టూ జరిగిన రాజకీయ రచ్చ తెలిసిందే. ఆ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగింపుపై అన్ని పార్టీలు ఆందోళనకు దిగాయి. అసలు సమస్య పథకం పేరులో ఉందా? లేక దాని అమలులో ఉందా? అన్న విచక్షణ లేకుండా రాజకీయాలు చేయడం గమనార్హం. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో నిజమైన నిర్మాణాత్మక పనులే జరిగాయా? అంటే దాదాపుగా లేదు. మట్టి ఎత్తిపోసే పనులు తప్ప, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే పనులు కనిపించలేదు. వేల కోట్లు మట్టిపాలైనా, వ్యవసాయ పనులకు కూలీల కొరత పెరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఇదే పథకంతో కేంద్ర ప్రభుత్వం కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని, కోట్ల కుటుంబాలకు ఇళ్లు నిర్మించామని గొప్పగా ప్రకటిస్తోంది. నిజంగా అలా జరిగి ఉంటే, ఉచిత బియ్యం, ఉచిత ఇళ్లు, ఉచిత విద్యుత్‌, ఉచిత గ్యాస్‌ వంటి పథకాలెందుకు? ఒకవైపు పేదరికం తగ్గిపోయిందని చెబుతూనే, మరోవైపు పేదల పేరుతో పథకాలు సాగిస్తుండటం పాలకుల ద్వంద్వ వైఖరికి పరాకాష్ట.

ప్రపంచ బ్యాంక్‌ లెక్కల ప్రకారం భారత్‌లో పేదలు కేవలం 5.25 శాతం మాత్రమే! రోజుకు తలసరి ఖర్చు రూ.62 కంటే తక్కువగా ఉన్నవారే పేదలని ఆ సంస్థ నిర్ణయించింది. అలాగే, నీతి ఆయోగ్‌ కూడా 2022–23 నాటికి దేశంలో నిరుపేదలు 5 శాతం మాత్రమే ఉన్నారని ప్రకటించింది. గ్రామాల్లో రోజుకు రూ.57, పట్టణాల్లో రూ.69 ఆదాయం ఉంటే పేదలు కాదన్నదే వారి ప్రమాణం. ఈ లెక్కన చూస్తే ఆ ఆదాయంతో ఆహారం, వైద్యం, దుస్తులు, రవాణా, అద్దె వంటి అవసరాలు తీర్చుకోవడం అసాధ్యం. ఈ ప్రమాణాల ప్రకారం జీవించగలిగేవారు ఇల్లు లేని బిచ్చగాళ్లే కావాల్సి వస్తుంది.

ఇలాంటి తప్పుడు లెక్కల తక్కెడ ఆధారంగా మరో ఏడాదిలో దేశంలో పేదలేరని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాస్తవంలో పెరుగుతున్న విద్య, వైద్య ఖర్చులు కోట్లాదిమందిని పేదరికంలోకి నెడుతున్నాయి. కనీస పౌష్టికాహారం కూడా అందని పరిస్థితుల్లో ప్రజలు జీవచ్ఛవాలుగా మారుతున్నారు. పౌష్టికాహార ప్రమాణాలను ఆధారంగా తీసుకుని పేదరిక స్థాయిని నిర్ణయిస్తే, ప్రభుత్వం నిర్ణయించిన స్థాయికి మూడింతలు ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. ఆ స్థాయికి దిగువన ప్రస్తుతం దాదాపు 65 శాతం ప్రజలు ఉన్నారన్న అంచనాలు ఉన్నాయి.

ప్రపంచ బ్యాంక్‌ రోజుకు 3 డాలర్లు పేదరిక స్థాయిగా నిర్ణయించినా, వాస్తవ మారకపు విలువ ప్రకారం లెక్కించకుండా, అధికారిక లెక్కలకు దగ్గరగా ఉండేలా సవరణలు చేస్తోంది. ఈ విధానం అనేక దేశాల్లో పేదరికాన్ని కృత్రిమంగా తగ్గించి చూపించడానికి ఉపయోగపడుతోంది. ఇలాంటి లెక్కలతో ప్రజల జీవన వాస్తవాలను అవహేళన చేయడమే జరుగుతోంది.

పేదరిక నిర్మూలన అంటే కేవలం కూడు, గూడు, గుడ్డ అందించడమే కాదు. బతకడానికి పని ఉండాలి, ఆ పని ద్వారా కుటుంబాన్ని పోషించగలిగే ఆదాయం రావాలి. కానీ ఈ అంశాలు ఏ లెక్కల్లోనూ చోటు దక్కించుకోవడం లేదు. కాలానుగుణంగా మారుతున్న కనీస అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా పాత ప్రమాణాలతోనే పేదరికాన్ని కొలవడం అర్థరహితం. ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో అందిన విద్య, వైద్యం ఇప్పుడు ప్రైవేటు రంగానికి వెళ్లిపోయాయి. వాటి ఖర్చులు సామాన్యుడికి భరించలేనివిగా మారాయి.
జాతీయ శాంపిల్‌ సర్వే గణాంకాల ప్రకారం గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా తలసరి పౌష్టికాహార లభ్యత వేగంగా తగ్గుతోంది. ఈ వాస్తవాన్ని విస్మరించి పేదరికం తగ్గిందని చెప్పుకోవడం ఆత్మవంచనతో సమానం. నిజమైన పేదరిక నిర్మూలన కోసం దుర్భర దారిద్యంలో ఉన్న కుటుంబాలను గుర్తించి, వారికి స్థిరమైన ఉపాధి, నాణ్యమైన విద్య, చౌకైన వైద్యం అందించే స్పష్టమైన విధానాలు అవసరం. లెక్కల మాయాజాలంతో పేదరికం అంతరించిందని చెప్పుకోవడం దేశానికి మేలు కంటే కీడే చేస్తుంది.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News