Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

ఇక పల్లెల ప్రగతి పరుగులు పెట్టాలి|EDITORIAL

పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక పల్లెలు ప్రగతి రథ చక్రాలపై పరుగులు పెట్టాలి. ఇకిప్పుడు గ్రామ రాజకీయాల దిశ మారాలి. ఎన్నికల సమయంలో సహజంగా ఏర్పడిన పోటీ, విమర్శలు, విభేదాలు, శత్రుభావాలు అక్కడితోనే ముగించాలి. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఇప్పుడు పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు సంయమనంతో, సమన్వయంతో సముచితంగా సాగినప్పుడే నిజమైన గ్రామ ప్రగతి సాధ్యమవుతుంది.

గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యానికి పునాదులు. గ్రామ స్థాయిలో తీసుకునే నిర్ణయాలు ప్రజల దైనందిన జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. రెండేళ్ళుగా గ్రామ పరిపాలకులు లేక, అధికారుల పాలనలో కునారిల్లిన పంచాయతీల్లో పలు సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. పైగా బకాయిలు పేరుకుపోయాయి. మంచినీరు, పారిశుద్ధ్యం, మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, వీధిలైట్లు, మరమ్మతులు, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలన్నీ పంచాయతీ స్థాయిలోనే పరిష్కరించాల్సి ఉంటుంది. వీటికి సరిపడా నిధుల అవసరం ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు కీలకం. పంచాయతీలకు పన్నుల ద్వారా వచ్చే నిధులు వాటి నిర్వహణకే సరిపోవు. పైగా కరెంటు బిల్లులు, పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది కొరత, వారి జీతభత్యాలు, అద్దె భవనాల్లో కార్యాలయాలు, వాటి నిర్వహణ వంటి అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించే దిశగా పనులు జరగాలి. ఎన్నికల అనంతరం కూడా రాజకీయ విభేదాలు కొనసాగితే అభివృద్ధి పనులు నిలిచిపోతాయి. దీనివల్ల నష్టపోయేది రాజకీయ నాయకులు కాదు, సామాన్య ప్రజలే.

అయితే, గతంలోలా నిధులు వచ్చే అవకాశాలు తక్కువ. ఉపాధి హామీ నిధులు పంచాయతీలకు వరంగా ఉండేవి. కరువు పనిదినాలు, శ్రమకు తగ్గ మెటీరియల్ కాంపౌండ్, పనులు పూర్తి చేసిన కొద్దీ పెరిగే అపరిమిత నిధులను విపరీతంగా వినియోగించడం ద్వారా ప్రస్తుతం ప్రగతి జరిగింది. కానీ, కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని పేరుతోపాటు, విధి విధానాలను మార్చేసింది. 60%-40% కేంద్ర-రాష్ట్రాల వాటాగా నిర్ణయించింది. ఇది ఆశనిపాతం కాగా, ప్రభుత్వం దగ్గర నిధుల కొరత వెక్కిరిస్తోంది. ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ రెండేళ్ళుగా పంచాయతీలకు ఇవ్వాల్సిన 3వేల కోట్ల నిధులే పెద్ద దిక్కుగా కనిపిస్తున్నాయి. దీనికి రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ మరో 3వేల కోట్లు కలిపితే, 6వేల కోట్లు అవుతాయి. ప్రభుత్వం విడుదల చేసే ఈ నిధులు సమర్థవంతంగా వినియోగించబడాలంటే గ్రామ స్థాయిలో ఐక్యత అవసరం. సర్పంచ్‌, వార్డు సభ్యులు, అధికారులు పరస్పరం సహకరించుకొని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. ఏ గ్రామానికి ఏ అవసరం ఎక్కువగా ఉందో గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలి. కేవలం రాజకీయ లాభనష్టాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా, ప్రజల అవసరాలే కేంద్రంగా నిర్ణయాలు తీసుకోవాలి.
అలాగే ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా ఎంతో కీలకం. తమ వాగ్దానాలను మరిచిపోకుండా అమలు చేయాలి. ఓడిన వర్గాలను కూడా కలుపుకొని గ్రామాభివృద్ధిలో భాగస్వాముల్ని చేయాలి. అప్పుడే గ్రామంలో సామరస్యం పెరుగుతుంది. ప్రజలు కూడా కేవలం విమర్శకులు, ప్రేక్షకులుగా కాకుండా, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలి. గ్రామ సభలు, సమావేశాల ద్వారా తమ సమస్యలను స్పష్టంగా తెలియజేయాలి.

ఇక అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలి. నిధుల కేటాయింపు, పనుల అమలులో పారదర్శకత ఉండాలి. అభివృద్ధి పనులపై సామాజిక పర్యవేక్షణ పెరిగితే అవినీతికి అవకాశం తగ్గుతుంది. ఇది గ్రామాభివృద్ధికి మరింత బలాన్నిస్తుంది.

ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం మాత్రమే. కానీ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఎన్నికల తర్వాత కూడా విభేదాలను కొనసాగిస్తే గ్రామాలు వెనుకబడిపోతాయి. పార్టీలకతీతంగా ఆలోచించి, నిధులు–విధులు–ప్రగతి ప్రణాళికలను సమర్థంగా అమలు చేస్తేనే పల్లెలు నిజంగా ప్రగతి పట్టాలెక్కుతాయి. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేసినప్పుడే బలమైన, స్వావలంబన గల గ్రామ సమాజం నిర్మించగలుగుతాం.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News