Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

ఓట్ చోర్ ఎవరు? పార్టీలా!? ప్రజలా!?|EDITORIAL

‘ఓట్ చోరీ’తో ఇండియా కూటమికి సంబంధం లేదని ఆ కూటమిలో భాగస్వామి నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలనం చేశారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ఢిల్లీలో ‘ఓట్ చోర్ గద్దీ చోడ్’ బహిరంగసభ నిర్వహించిన తెల్లారే ఆయన స్పందించిడం గమనార్హం. ‘ప్రతి పార్టీకి తన సొంత ఎజెండాను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. ఓట్ చోరీ, సర్ లను తమ ప్రధాన పోరాటంగా కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఏం చేయలో మనం వాళ్ళకు చెప్పలేం కదా?’ అన్నారు. అంతకుముందు ఇండియా కూటమి పరిస్థితి వెంటిలేటర్ పై ఉన్నట్లుందని కూడా వ్యాఖ్యానించారు. ఒమర్ వ్యాఖ్యలను బట్టి, ఓట్ చోరీ జరుగుతోందా? జరిగితే ఎవరా ఓట్ చోర్ లు? పార్టీలా? ప్రజలా?

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజలుఆశలకు, ఆశయాలకు సంకేతాంగా నిలుస్తుంది. అయితే, భారత రాజకీయాల్లో తరచూ వినిపించే మాట.‘ఓట్ల దొంగతనం’, ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’, ‘అధికార పార్టీయే ఓట్ల దొంగ’. ఈ ఆరోపణలు అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలపైనా ఉన్నాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, నిజంగా ఓట్ల దొంగ ఎవరు?
‘ఓట్ చోరీ’ అంటే కేవలం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడమే కాదు. డబ్బు, మద్యం, కులం, మతం, అధికార దుర్వినియోగం, మీడియా ప్రభావం, అలవికాని హామీలన్నీ ఓటు స్వేచ్ఛను దెబ్బతీసే పద్ధతులే. ఓట్ చోరీ సాంకేతిక సమస్య మాత్రమే కాక, నైతిక వైఫల్యం కూడా.

దేశంలో కాంగ్రెస్ దీర్ఘకాలంగా అధికారంలో ఉంది. అది వ్యవస్థలను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య హక్కుల్ని అణచివేయడం, అధికార యంత్రాంగాన్ని తమ పార్టీ ప్రయోజనాలకు వాడుకోవడం వంటి విమర్శలు కాంగ్రెస్‌పై బలంగా ఉన్నాయి. రాష్ట్రాల్లో డబ్బు రాజకీయాలు, కుటుంబ పాలన, స్థానిక నాయకుల అక్రమాలు కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఇవి పరోక్ష “ఓట్ చోర్” పద్ధతులే.

బీజేపీపై కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మత విద్వేషాలు, జాతీయత పేరుతో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం, మీడియా మీద ప్రభావం, ప్రభుత్వ సంస్థల స్వతంత్రతను తగ్గించడం వంటి అంశాలు బీజేపీని విమర్శలకు గురిచేశాయి. ప్రతిపక్ష పార్టీలను, నేతలను విచారణ సంస్థల ద్వారా భయపెట్టడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్యలు. ఇవన్నీ ప్రత్యక్ష ఓట్ చోరీ కాకపోయినా, ప్రజల స్వేచ్ఛాయుత నిర్ణయాలని ప్రభావితం చేసే పద్ధతులే.

ప్రాంతీయ పార్టీలు కూడా ఈ జాబితాలేకే వస్తాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, సమాజ్‌వాది, బీఎస్పీ వంటి పార్టీలు కూడా డబ్బు, కులం, మతం, ప్రాంతీయ, ప్రలోభాల భావోద్వేగాలపై రాజకీయాలను నెరుపుతున్నవే. “మనోడే గెలవాలి” అనే భావన ప్రజాస్వామ్యాన్ని కుటుంబ లేదా కుల రాజకీయం వైపు నడిపింది. ఇక్కడ ఓటు ప్రజల స్వేచ్ఛా అభిప్రాయానికి కాకుండా సామాజిక రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నది.

ప్రత్యక్ష, పరోక్ష ‘ఓట్ చోరీ’లో రాజకీయ పార్టీలతో పాటు ఓటరు పాత్రను విస్మరించలేం. డబ్బు తీసుకుని ఓటేయడం, కులం లేదా మతం పేరుతో ఓటేయడం, భవిష్యత్ అభివృద్ధి కంటే తక్షణ స్వలాభాలకే ప్రాధాన్యం ఇవ్వడం, ప్రలోభాలకు లోనవడం ద్వారా ఓటరే తన ఓటును తానే అమ్ముకుంటున్నాడు.
మీడియా కూడా ఈ పాపంలో భాగమే. పార్టీకో పత్రిక, పత్రికకో పార్టీ ఉండటం, ఒక పార్టీకి అనుకూలంగా, మరో పార్టీని నిరంతరం దూషించడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తోంది. ఇది కనిపించని ఓట్ చోరీ. సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు, అసత్యాలు ప్రచారమై ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఓట్ చోరీ ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవస్థీక్రుతంగా విస్తరించిన విషం. పార్టీలను, ప్రజలను కూడా దోషులుగా పరగణించాల్సందే. ఇది మన రాజకీయ సంస్కృతిలో ఉన్న లోపం. ఆ లోపాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలతోపాటు, ప్రతి పౌరుడిది కూడా. ఓటరు చైతన్యం, స్వతంత్ర సంస్థల బలోపేతం, పారదర్శక ఎన్నికల ప్రక్రియ, బాధ్యతాయుత మీడియా కలిసి పనిచేసినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం నిలుస్తుంది.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News