Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ, అమిత్ షా ఎత్తుల ముందు చిత్తవుతోందా? నాయకత్వ లోపమా? సమన్వయ శాపమా? మేధోమథనం లేకపోవడమా? అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ కు ఏమైంది? ఇవి ఆ పార్టీ నాయకత్వంపై ఆ పార్టీ శ్రేణులే సంధిస్తున్న ప్రశ్నలు. ఆ పార్టీ శ్రేణులే సంధిస్తున్న ప్రశ్నలు. అంతర్మథనాలు.

కాంగ్రెస్ వరుస వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజా సమస్యలను ఎజెండా చేయడంలో, వాటిపై పోరాటడంలో, అధికార పార్టీని, ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆ పార్టీ బాగా వెనుకబడిపోతోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ చేపట్టిన బాధ్యతల్లో ఈ స్పష్టమైన ఫలితాలు కనిపించలేదు. దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై, ప్రభుత్వాల వైఫల్యాలపై, అధికారాన్ని సాక్షాత్కారం చేసే సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన లేదన్న విమర్శలు నిరంతరాయంగా వినిపిస్తునే ఉన్నాయి. మోదీ లాంటి ఉద్ధండ నేతను, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని నిలదీయాలంటే స్పష్టమైన ఎజెండా అవసరం. కానీ రాహుల్‌ చేతిలో అలాంటి దిశా నిర్దేశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. పార్లమెంట్‌లో గడువు లేకుండా రచ్చ చేయడం, నినాదాలతో రాజకీయాలు నడపడం, వంశపారంపర్య నాయకత్వంపై ఆధారపడటం వంటి చర్యలు కాంగ్రెస్‌ను మరింత బలహీన స్థితికి నెడుతున్నాయి.
గత పుష్కరకాల యూపీఏ పాలనలో జరిగిన పొరబాట్లను ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ పాదయాత్రలు చేసినా, రాజ్యాంగ ప్రతిని ఎత్తిచూపినా, ‘సర్’ని ఎత్తుకున్నా, మహా గఠ్ బంధన్ కూటములు కట్టినా పార్టీకి పెద్దగా కలిసిరాలేదు. మేలు జరగలేదు. ప్రధానంగా పార్టీకి కేంద్ర స్థాయిలో నాయకత్వ సంక్షోభం, నిర్ణయాత్మక, స్పష్టమైన రాజకీయ దిశానిర్దేశం లేకపోవడం వల్ల ప్రజల్లో పార్టీపై నమ్మకం తగ్గింది. తీవ్రమైన అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య సమన్వయం లోపించడం, ఎన్నికల వ్యూహాల్లో వైఫల్యాలు వంటివన్నీ పార్టీ ప్రభావాన్ని నీరుగారుస్తున్నాయి. ప్రధానంగా 2014, 2019, 2024 సాధారణ ఎన్నికలలో పార్టీ సాధించిన బలహీన ఫలితాలు, ఆ పార్టీని జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టలేకపోయాయి. అదనంగా, యువ ఓటర్లను ఆకర్షించడంలో విఫలమవడం ఆ పార్టీని మరింత దిగజారుస్తున్నాయి.

కర్నాటకలో సీఎం పదవి విషయంలో సిద్దరామయ్య–డీకే శివకుమార్‌ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడంలో కూడా హైకమాండ్‌ బలహీనంగా మారింది. ఖర్గే అధ్యక్షుడైనా, రాహుల్‌ మార్గనిర్దేశం ఉన్నా స్పష్టమైన నిర్ణయాలను సమర్థంగా తీసుకునే వేగం, ధైర్యం కనిపించడం లేదు. గతంలో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తాజాగా బీహార్‌ ఎన్నికల్లోనూ అంతర్గత కలహాలే కాంగ్రెస్‌, కాంగ్రెస్ కూటముల ఓటములకు కారణమయ్యాయి.

పార్టీ కార్యకలాపాలను నాయకత్వం స్వయంగా పర్యవేక్షించడం తగ్గిపోయింది. నిర్ణయాలు విధేయుల చేతుల్లోకి వెళ్లాయి. కేసీ వేణుగోపాల్‌ వంటి నేతల సూచనలతో ముఖ్యమైన పరిణామాలు జరుగుతుండటం, పెద్ద నేతల మధ్య సమస్యలను పరిష్కరించలేకపోవడం పార్టీ నాయకత్వ బలహీనతను బహిర్గతం చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో రాహుల్‌ నిజమైన నాయకుడిగా ఎదగాలనుకుంటే ప్రజా సమస్యలపై దీర్ఘకాల పోరాటం చేయాలి. నినాదాలకంటే విధానాలు, పదవుల కేటాయింపులకంటే నైతిక నిర్ణయాలు ముఖ్యం.
కాంగ్రెస్‌కు మరో అవకాశం దక్కాలంటే ముందుగా పార్టీ అంతర్గత వ్యవస్థను బలపరచాలి. కేంద్రంలో, రాష్ట్రాల్లో పార్టీలోని అంతర్గత విభేదాలను సమర్థంగా సమసేట్లు చేయాలి. ప్రజలతో, ప్రజా సమస్యలతో, ప్రజల భాగస్వామ్యంతో నడిచే రాజకీయాలు చేయాలి. అధికారంలో లేకపోయినా పటిష్టమైన వ్యూహాలతో ముందుకు సాగగలిగితేనే కాంగ్రెస్‌ తిరిగి ప్రజల్లో నమ్మకం పొందగలదు.

కానీ, ఇప్పుడు ఆ పార్టీకి కావాల్సింది, దృఢమైన నాయకత్వం, సమర్థవంతమైన వ్యూహం, ప్రజలతో సన్నిహిత సంబంధాల పరురుద్ధరణ. ప్రస్తుతం కనిపిస్తున్న నాయకత్వ బలహీనతలతో మాత్రం కాంగ్రెస్ పార్టీకి పునరుద్ధరణ, పూర్వవైభవం దూరమైన స్వప్నంగానే మిగిలిపోతుంది.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News