Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. ఇప్పటి వరకూ గంజాయి రవాణా, పట్టుబడటం, తప్పించుకోవడం మాత్రమే చూశాం. కానీ ఇప్పుడు మాఫియా నేరుగా హత్యలకు తెగబడటం చూస్తున్నాం. పెంచలయ్య హత్య వెనుక ఉన్న నిజమైన డాన్‌లు, రాజకీయ అండదండలు బయటపడాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని మాదకద్రవ్యాల మాఫియాపై సమగ్ర యుద్ధం ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా చాపకింద నీరులా సాగుతోంది. ఏపీ పక్క రాష్ట్రం ఒడిశా సరిహద్దు సహా, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది విస్తృతంగా పండుతోంది. ఒడిశా, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి మారేడుమిల్లి, రంపచోడవరం మార్గాలుగా జగ్గంపేటకు, అక్కడి నుంచి పలు జిల్లాలకు భారీ ఎత్తున రవాణా జరుగుతోంది.

అల్లూరి సీతారామరాజు ఏజెన్సీలో 11,000 ఎకరాల్లో గంజాయి సాగు జరిగేది. ఈ ఏడాది 93 ఎకరాలకు సాగు తగ్గింది. డ్రోన్లు, శాటిలైట్‌ ద్వారా గంజాయి సాగును గుర్తిస్తున్నారు. వేలాది ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్ళిస్తున్నారు. ‘గత ఏడాది ఒక్క ఏపీలోనే 867 గంజాయి కేసులను నమోదు చేసి 20,467 మందిని అరెస్టు చేశారు. 65 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. 500 వాహనాలను సీజ్‌ చేశారు. సంకల్పం పేరిట గంజాయికు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు 12 లక్షల మంది విద్యార్థులు, యువత, మహిళా సంఘాలకు అవగాహన కల్పించామని పోలీసులు వివరిస్తున్నారు. అయినప్పటికీ గత వంద రోజుల్లో 93 కేసులు నమోదు చేసి 6,782 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 247 మందిని అరెస్ట్ చేశాశారు. ఎంత అదుపు చేసినా, మళ్లీ మళ్లీ అదే నేరం చేస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉండటం ఆందోళనకరంగా ఉంది.

తెలంగాణలో కూడా ఈగిల్‌ టీమ్‌ తరచుగా దాడులు చేస్తున్నా, పట్టుబడేది మొత్తం రవాణాలో అతి తక్కువ శాతం మాత్రమే. మిగతావన్నీ గుట్టుచప్పుడు కాకుండా నగరాలు, పట్టణాలకు చేరుతున్నాయి. హైదరాబాద్ లో గంజాయి డాన్ నీతూబాయి ఏడాదిగా పరారీలోనే ఉంది. అయినా గంజాయి స్మగ్లింగ్ మాత్రం ఆగడంలేదు. ప్రతినిత్యం ఏదో ఓ ప్రాంతం నుంచి గంజాయి పట్టుపడుతున్న సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

యూత్ ను, ముఖ్యంగా ఇంజనీరింగ్‌, డిగ్రీ కాలేజీల విద్యార్థులు లక్ష్యంగా గంజాయిని చిన్నపొట్లాలు, లిక్విడ్‌, చాక్లెట్‌ రూపంలో విక్రయిస్తున్నారు. నగరాల్లో యువత, విద్యార్థులు ప్రధాన టార్గెట్‌ కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

పోలీసులు నిఘా కట్టు దిట్టం చేసినా రవాణా ఆగట్లేదన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని రాజకీయ నేతల అండదండలతో మాఫియా నిర్భయంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న పెంచలయ్యను కక్షపూరితంగా హత్య చేయడం దీనికి నిదర్శనం. నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి ప్రాంతంలో ప్రధాన నిందితుడు జేమ్స్‌ కుటుంబం గంజాయి, మాదకద్రవ్యాల వ్యాపారానికి యువకులను ప్రోత్సహిస్తోందని స్థానికులు చెబుతున్నారు. కామాక్షి అనే మహిళ కాలనీలో అక్రమాలు ఎక్కువ చేస్తున్నందుకు స్థానికులు ఆమెను బహిష్కరించగా, కక్షతో పెంచలయ్యను హత్య చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్రమైన ఆగ్రహం ఉప్పొంగి జేమ్స్‌ ఇంటిని దహనం చేశారు.

ప్రభుత్వాలు కేవలం సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు, ఉచిత బియ్యం పంపిణీలపై మాత్రమే దృష్టి పెట్టకుండా మాఫియాలను అరికట్టేందుకు నిధులు, బలగాలు వినియోగించాల్సి ఉంది. హెలికాప్టర్లల్లో తిరగడానికి వందల కోట్లు ఖర్చు చేయడం కంటే, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

ఏజెన్సీల్లో పండుతున్న గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేయాలి. రవాణా మార్గాలపై కఠిన నిఘా పెట్టాలి. ఈగిల్‌ టీమ్‌లకు మరింత బలగాలు, సాంకేతిక వనరులు అందించాలి. యువతను విషం చేస్తున్న మాదకద్రవ్యాలను తక్షణమే అరికట్టకపోతే సమాజం దారి తప్పిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. పెంచలయ్య హత్య మాఫియాల దుశ్చర్యలకు నిదర్శనం మాత్రమే కాదు, ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉన్నదనే హెచ్చరిక!

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News