Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

పరిశ్రమలు సరే, మరి పర్యావరణం సంగతేంటి?|EDITORIAL

ప్రభుత్వాలకు పరిశ్రమల పరివ్యాప్తిపై ఉన్న యావ, పర్యావరణంపై ఉండటం లేదు. పెట్టుబడుల కోసం పట్టువిడుపులు లేకుండా ప్రపంచమంతా తిరిగి వస్తున్నారు. కనబడ్డ ప్రతి కంపెనీని నిస్సిగ్గుగా బిచ్చమెత్తుకుంటున్నారు. పెట్టుబడులు పెడితే, మీక్కావల్సిన వన్నీ ఇచ్చేస్తా మంటున్నారు. ఇందుకు పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలు అనుసరిస్తున్నారు. మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

ప్రభుత్వాలకు పరిశ్రమల పరివ్యాప్తిపై ఉన్న యావ, పర్యావరణంపై ఉండటం లేదు. పెట్టుబడుల కోసం పట్టువిడుపులు లేకుండా ప్రపంచమంతా తిరిగి వస్తున్నారు. కనబడ్డ ప్రతి కంపెనీని బిచ్చమెత్తుకుంటున్నారు. పెట్టుబడులు పెట్టండి. మీక్కావల్సినవన్నీ ఇచ్చేస్తామంటున్నారు. ఇందుకు పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలు అనుసరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మూడు కీలక పారిశ్రామిక విధానాలను అమలులోకి తెచ్చింది. ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ పాలసీ 4.0, ఎంఎస్ఎంఇ ఎంట్రప్రిన్యూరీ డెవలప్ మెంట్ పాలసీ 4.0, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 విధానాలకు మార్గదర్శకాలను వెలువరించింది. అదేవిధంగా, రాష్ట్రంలో 45వేల ఎకరాల పారిశ్రమల కోసం సిద్ధంగా ఉంచింది. ఈ విధానాల ద్వారా ఉద్యోగాల కల్పన, పెట్టుబడి ఆకర్షణ వంటివి వీటి లక్ష్యాలు.

తెలంగాణలో కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ల కొరకు రూ. 45 వేల కోట్లు పెట్టుబడి అంచనాతో ఉంది. ఇందుకవసరమైన భూ సేకరణకు కూడా చేపడుతున్నది. ఇప్పటికే తెలంగాణలోని 2,180 పరిశ్రమలలో 2,179కి ఈ ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ పరిశ్రమల వ్యర్థాలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
పరిశ్రమల చుట్టుముట్టు ప్రాంతాల్లో పీల్చే గాలి, తాగే నీరు ప్రమాదకరంగా మారాయి. ప్రాణాంతక వ్యాధులకు అవి కేంద్రంగా వున్నాయి. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను అటు ప్రభుత్వమూ, ఇటు పరిశ్రమాధిపతులు పూర్తిగా వదిలేశారు. కోట్ల విలువైన రాయితీలు, సదుపాయాలు కల్పించి పరిశ్రమాధిపతులకు లాభాలు సమకూర్చడం పైనే ప్రభుత్వాలు శ్రద్ధ చూపుతున్నాయి. ఆ పరిశ్రమలకు భూములిచ్చిన రైతులు, ఉపాధి కోల్పోయిన పేదలు, వృత్తిదారులను విస్మరించాయి. ఇప్పటికే ఉప్పాడ కార్మికులు సముద్రంలో కలుస్తున్న కాలుష్యాన్ని నిలిపివేయాలంటూ పాలకులను నిలదీసారు. తాజాగా అనకాపల్లి సెజ్‌ ఏర్పాటుపై మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడడానికే గానీ తీయడానికి కాదని వారు అంటున్నారు. అనకాపల్లి జిల్లాలోని సక్కపల్లి మండలంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్ ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకి చేరుకుంది.

నిజానికి ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడాలి అంతేగానీ తీయకూడదు. రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులతో వచ్చే పరిశ్రమల్లో వేలాది మందికి ఉపాధి కలగనుందని ప్రభుత్వం చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించడం లేదు. పైగా ఆ పరిశ్రమల ఏర్పాటు కోసం జరిగే ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలన్న డిమాండ్‌పై ఏకమవడం నూతన పరిణామం.

ఉపాధి పేరుతో మోసగించి కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చాలన్న ప్రభుత్వ పెద్దల ఆరాటానికి ప్రజా పోరాటాలు బ్రేకులు వేస్తున్నాయి. పోలీసు బలగాలతో ప్రజలను భయపెట్టేందుకు యత్నించినా చాలా ప్రాంతాల్లో తిరగబడుతున్నారు. బల్క్‌ డ్రగ్‌ ఒక్కటే కాదు ఎక్కడ భూ సేకరణ జరిగినా రైతులు తిరగబడుతున్నారు. పరిశ్రమలకు ఒకనాడు భూములిచ్చిన రైతులు ఇపుడు అడుక్కు తింటున్నారు. తెలంగాణ, ఆంధ్రా అన్న తేడా లేకుండా పరిశ్రములు, రోడ్లు, ప్రాజెక్టులకు రైతుల భూములు లాక్కోవడం వారిని వదిలివేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. పోలవం బాధితులు, మల్లన్నసాగర్‌ బాధితులు ఇదే కోవలోకి వస్తారు.

కొద్ది రోజుల క్రితం బల్క్ డ్రగ్ ప్రాజెక్టును ఆపాలంటూ, ఆ ప్రాంత పర్యటనకు వెళ్లిన మంత్రి వాహనం ముందు తాటిచెట్టు అడ్డంపెట్టి మరీ పోరాడారు. దీంతో తాత్కాలికంగా పనులు నిలిపివేస్తున్నట్టు మంత్రి ప్రకటించాల్సి వచ్చింది. ఆదానీకి చెందిన గంగవరం పోర్టు ధూళి, దుమ్ముతో భరించలేని కాలుష్యంతో బాధపడుతున్న ప్రజల్లో అంబూజా సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటుపై ఆగ్రహం వెల్లువెత్తింది. విశాఖ పోర్టు ట్రస్ట్‌, గంగవరం పోర్టును పర్యావరణ ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవడం లేదు. ఎన్టీపిసి కాలుష్యంతో మూల స్వయంవరం, సోమినాయుడుపాలెం ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. పరవాడ ఫార్మా సిటీకి అనుకొనివున్న గ్రామాలు వాయు కాలుష్యంతో తల్లడిల్లుతున్నాయి. పరిశ్రమలు వ్యర్థ రసాయన జలాలను శుద్ధి చేయకుండా చెరువుల్లోకి విడిచిపెడుతున్నాయి. రాంకీ యాజమాన్యానికి కాలుష్య నియంత్రణ అధికారులు నోటీసులు జారీ చేసినా? చర్యలేవిూ తీసుకోలేదు. ముత్యాలమ్మపాలెం ఉప్పుటేరు కాలుష్యమయమైంది. అచ్యుతాపురం సెజ్‌ లోని వ్యర్థాలను శుద్ధి చేయకుండా పూడిమడక వాగులోకి వదిలేయడంతో చేపలు చనిపోయి మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ప్రజలకు హానికరంగా నిబంధనలు సవరించి కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రభుత్వం, అధికారులు సిద్ధంగా ఉంటున్నారు.

ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తినకుండా వుండాలంటే పర్యావరణ ప్రమాణాలను పరిశ్రమలు పాటించేలా నిబంధనలు కఠినతరం చేయాలి. అలాగే కాలుష్యకారక పరిశ్రమలతో పర్యావరణాన్ని దెబ్బతీసే పరిశ్రమలను దూరం పెట్టడమే మంచిది.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News