Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

విద్య, వైద్యం ప్రజలకు అందని ద్రాక్షేనా?|EDITORIAL

విద్యతోపాటు వైద్యం కూడా ప్రజల ప్రాథమిక హక్కే. వీటిని ప్రజలకు అందించడం ప్రభుత్వాల విధి. కానీ, ప్రభుత్వాలు తమ బాధ్యతల్ని మరచి, వాటిని ప్రైవేట్ పరం చేయడం లేదా కొర్పోరేట్ల చేతుల్లో పెట్టడం, అజమాయిషీ చేయకపోవడం జరుగుతూనే ఉంది. కార్పోరేట్లకు ప్రజా ధనాన్ని దోచిపెట్టడం, ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడం షరా మామూలైపోయింది. కేవలం ఓట్ల కోసం ప్రభుత్వాలు ప్రైవేట్, కార్పోరేట్ హాస్పిటల్స్ కి ఏటా వేల కోట్లను దోచిపెట్టడం విచిత్రం, విడ్డూరం, దారుణం, దౌర్భాగ్యం మరెక్కడా లేదు. పైగా అవి బ్లాక్ మెయిల్ చేస్తే, అవి చెప్పినట్లా తలాడించడం ఏలుతున్న వారికి సిగ్గుచేటు. ఒక్క ఏడాది ప్రభుత్వాలు ప్రైవేట్ హాస్పిటల్స్ కి దోచిపెడుతున్న డబ్బుల్ని ప్రభుత్వ వైద్యానికి వినియోగిస్తే, అసలు ప్రైవేట్ వైద్యం అవసరం ప్రజలకెందుకుంటుంది? వేల, లక్షల కోట్లు వెచ్చించి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పెట్టడమెందుకు? వైద్యులను తయారు చేయడమెందుకు? ప్రైవేటుగా దోచుకోమని చెప్పడానికా?
అప్పుడెప్పుడో ఉమ్మడి ఏపీలో వైఎస్‌ హయాంలో మొదలైన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజల రోగాల కంటే, ప్రైవేట్‌ హాస్పిటల్సే ఎక్కువగా బాగుపడుతున్నాయి. ఈ పథకం కింద పెట్టే ఖర్చుతో జిల్లాకో పది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని నిర్మించవచ్చు. కానీ, ప్రైవేట్‌ మాఫియా గుప్పిట్లో ఉన్న ప్రభుత్వాలు ఈ పథకం పేరుతో ప్రజాధనాన్ని ప్రైవేట్ వైద్యశాలలకు దోచి పెడుతున్నాయి. నిజానికి ఫీ రియంబర్స్‌మెంట్‌ పథకం కూడా ఇలాంటిదే. నేరుగా విద్యార్థులకు అందించాల్సిన ఫీజులను కాలేజీలకు చెల్లించడమేంటి? అవి కోట్లకు పడగలెత్తి ప్రభుత్వాల్ని బెదిరిస్తూ, బ్లాక్ మెయిల్ చేయడమేంటి? ఈ రెండు పథకాలు రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నాయి.

పోనీ, హాస్పిటల్స్, కాలేజీలేమైనా రోగులను, విద్యార్థులను గౌరవిస్తున్నాయా? అంటే అదీ లేదు. సెకండ్‌ గ్రేడ్‌ సిటిజన్ల కింద చూస్తున్నారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లకు గౌరవ ప్రదమైన వైద్యం అందడం లేదు. ఈ పథకం కింద వచ్చే వారికి బిల్లులో మదింపు చేసి ఎక్కువ చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరిని నాసిరకంగా ట్రీట్‌ చేస్తున్నారు. ప్రత్యేక వార్డులు, ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. చికిత్సలో డబ్బులున్న వారికి ఓ రకంగా, ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లను మరోరకంగా ట్రీట్‌ చేస్తున్నాయి. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాల్సి ఉంది. జనాభాకు తగ్గట్లుగా హాస్పిటల్స్ ను నిర్మించి, ఆరోగ్యశ్రీ భారాన్ని తొలగించుకోవాల్సిన అసవరం ఉంది. ఆరోగ్యశ్రీ డబ్బులతో వందలాది దవాఖానాల నిర్మాణం చేయవచ్చు. అలాగే నిర్మాణంలో ఉన్న ఆస్పత్రులను త్వరగా పూర్తి చేయాలి.

ఏపీలో పీపీపీ కింద వైద్యశాలల నిర్మాణంపై వస్తున్న విమర్శలను పరిశీలించాలి. ప్రభుత్వ పరంగా వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు తెస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యం పేరిట ప్రైవేటుపరం చేస్తోందని వైసీపీ విమర్శిస్తోంది. వైద్య విద్యను పూర్తి ప్రభుత్వ రంగంలోనే నిర్వహిస్తూ, ఇప్పటి లాగే, ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేయాల్సి ఉంది. వైద్య విద్యను సమర్థంగా నిర్వహించాలి. సరైన ఫ్యాకల్టీని, వైద్యులను కూడా సిద్దం చేసుకోవాలి. సంక్షేమం పేరిట దుబారా ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు విద్యా, వైద్యరంగాలను బలోపేతం చేసేందుకు అధిక నిధులను వెచ్చించాలి. బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి. ప్రజలు ప్రైవేటు రంగం వైపే ఎందుకు ఆకర్షితులవుతున్నారన్న దానిపై అధ్యయనం చేయాలి. అందుకే ప్రభుత్వ వైద్యశాలలను ముందుగా బలోపేతం చేయాలి. ప్రైవేట్‌ కు దీటుగా పోటీగా అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి.

విద్యా రంగంలోనూ ప్రైవేట్ మాఫియా బలంగా మారింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థల్లో చేర్చడానికే ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారో తెలుసుకోవాలి. అనేక సదుపాయాలు కల్పించినా, విశాలమైన గదులు, తర్ఫీదు పొందిన, అత్యధిక జీతాలు తీసుకుంటున్న టీచర్లున్నప్పటికీ ఫలితం కానరావడం లేదు. ఫీ రియంబర్స్ మెంట్ వంటి ప్రోత్సాహకాలు ప్రభుత్వ బడుల్లో, కాలేజీల్లో చదివే విద్యార్థులకే అందించాలి. ప్రభుత్వం ప్రైవేట్ వైద్యశాలలు, కాలేజీలకు ఫీ రియంబర్స్ మెంట్ అందిస్తున్నదంటే, ప్రైవేట్ కంటే ప్రభుత్వంవి అధ్వాన్నంగా ఉన్నాయని ప్రభుత్వమే అంగీకరిస్తున్నట్లే గదా?

ప్రభుత్వ విద్యా, వైద్యరంగంలో జవాబుదారీతనం రావాలి. సదుపాయాలు, అజమాయిషీ పెంచాలి. ప్రజల్లో విశ్వాసం పెంచాలి. ఫీ రియంబర్స్ మెంట్ పథకం వల్ల, ఇంజనీరింగ్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చాయి. ఫలితంగా విద్యా ప్రమాణాలు, నాణ్యత దెబ్బతింది. అనేక కళాశాలలు మూతపడ్డాయి. ఆ నాణ్యతలేని విద్యనభ్యసించిన లక్షలాది మంది ఇంజనీరింగ్‌ పట్టభద్రులు నిరుద్యోగులుగా మిగిలారు. అందుకే ప్రభుత్వ విద్య, వైద్య ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ యాజాన్యాలను కట్టడి చేయాలి. ఆ మాఫియా బెదిరింపులకు లొంగకుండా ప్రజాధనాన్ని ప్రజలకే ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి. కనీసం ఈ రెండు రంగాల్లోనైనా ప్రైవేట్ లేకుండా చేస్తే మంచిది.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News