Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

కోర్టులు, కేసులు, తీర్పులు న్యాయన్యాయాలు!|EDITORIAL

సుప్రీం కోర్టులో నిన్న జరిగిన అనూహ్య ఘటన యావత్ దేశానికి దిగ్భ్రాంతిని కలిగించింది. ఆ న్యాయవాది సంయమనం కోల్పోయినా, ప్రధాన న్యాయమూర్తి మాత్రం సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ ఘటన అత్యున్నత న్యాయస్థాన ఔన్నత్యాన్ని ప్రశ్నిస్తోంది. సాధారణ పౌరులకు అతీతంగా వ్యవహరించాల్సిన న్యాయవాదులు, న్యాయమూర్తుల వ్యక్తిగత కష్టాలు, నష్టాలు, భావోద్వేగాలు, ఒత్తిడి, వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యతలను ప్రశ్నార్థకంగా మార్చింది. ఓర్పుగా, నేర్పుగా, కూర్పుగా జరగాల్సిన విచారణలు, తీర్పులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అదే సమయంలో సమాజంలో పెరుగుతున్న అసహనం, కోర్టుల్లో పేరుకుపోతున్న వాయిజ్యాలు, పెరుగుతున్నపని ఒత్తిడి, వృత్తిలో ఉండే విధులు, బాధ్యతలు, సమయ నియంత్రణలు, వివిధ పనుల మధ్య సమన్వయ లోపాలు, అయోమయం, భావోద్వేగాలు, వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య అసమతుల్యత మొదలైనవి మరోసారి తెరమీదకు వస్తున్నాయి. అన్నింటికీ మించి పరిమిత కోర్టులు, అపరిమిత కేసులు, న్యాయమూర్తులు, కొరత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కోర్టులు, కేసులు, తీర్పులు న్యాయన్యాయాలు!
‘డాక్టర్ మార్గం – అడుగు’ ఎడిటోరియల్

సుప్రీం కోర్టులో నిన్న జరిగిన అనూహ్య ఘటన యావత్ దేశానికి దిగ్భ్రాంతిని కలిగించింది. అక్టోబర్ 6న ఓ కేసుపై విచారణ జరుగుతున్న సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, 71ఏళ్ళున్న రాకేశ్ కిషోర్ అనే న్యాయవాది, సీజేఐ పై బూటు విసిరే ప్రయత్నం చేశాడు. వెంటనే భద్రతా సిబ్భంది దీన్ని అడ్డుకున్నారు. సీజేఐ బీఆర్ గవాయి సనాతన ధర్మానికి అవమానం జరిగేలా వ్యాఖ్యానించారని ఆ న్యాయవాది అభియోగం. అయితే, గవాయి ఈ ఘటనను సీరియస్ గా తీసుకోకుండా, ‘ఇలాంటి చర్యలు నన్ను ప్రభావితం చేయవలేవు’ అంటూ విచారణను కొనసాగించారు. ఆ న్యాయవాది సంయమనం కోల్పోయినా, ప్రధాన న్యాయమూర్తి మాత్రం సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ ఘటన అత్యున్నత న్యాయస్థాన ఔన్నత్యాన్ని ప్రశ్నిస్తోంది. సాధారణ పౌరులకు అతీతంగా వ్యవహరించాల్సిన న్యాయవాదులు, న్యాయమూర్తుల వ్యక్తిగత కష్టాలు, నష్టాలు, భావోద్వేగాలు, ఒత్తిడి, వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యతలను ప్రశ్నార్థకంగా మార్చింది. ఓర్పుగా, నేర్పుగా, కూర్పుగా జరగాల్సిన విచారణలు, తీర్పులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అదే సమయంలో సమాజంలో పెరుగుతున్న అసహనం, కోర్టుల్లో పేరుకుపోతున్న వాయిజ్యాలు, పెరుగుతున్నపని ఒత్తిడి, వృత్తిలో ఉండే విధులు, బాధ్యతలు, సమయ నియంత్రణలు, వివిధ పనుల మధ్య సమన్వయ లోపాలు, అయోమయం, భావోద్వేగాలు, వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య అసమతుల్యత మొదలైనవి మరోసారి తెరమీదకు వస్తున్నాయి. అన్నింటికీ మించి పరిమిత కోర్టులు, అపరిమిత కేసులు, న్యాయమూర్తులు, కొరత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

మనదేశ జనాభా, పెరుగుతున్న వాయిజ్యాలకు తగ్గట్లుగా హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో న్యాయమూర్తులు లేరు. కేసుల సంఖ్యపెరిగి, ఒక్కో కేసుకు దశాబ్దాలు పడుతోంది. న్యాయమూర్తులపై ఒత్తిడి పెరుగుతోంది. రోజువారీ కేసులకే సమయం సరిపోవడం లేదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న మనదేశంలో సుప్రీం కోర్టుకు 34 మంది న్యాయమూర్తులు సరిపోతారా? ఇక హైకోర్టుల్లో 63 లక్షలకు పైగా, దిగువ కోర్టుల్లో ఐదు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌ కేసులు కొండలా పేరుకుపోవడం ఆందోళనకరం. అత్యున్నత న్యాయస్థానం చరిత్రలో ఎన్నడూ లేనంతగా 88,417 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
న్యాయం ఆలస్యం కావడమంటే అన్యాయం కిందే లెక్క. అండర్‌ ట్రయల్‌ ఖైదీలు కేసులు తెమలక ఏళ్లుగా జైళ్లల్లో మగ్గుతున్నారు. న్యాయం కోసం కోర్టు మెట్లెక్కినా ఏళ్ల తరబడి కేసులు తెమలడం లేదు. రాజకీయ కేసులు తప్ప క్రిమినల్‌ తదితర కేసులు తేలడం లేదు. జాతీయ జ్యుడీషియల్‌ గ్రిడ్‌ ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం 69,605 సివిల్‌, 18,887 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు 2020 వేసవి సెలవుల సమయంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. ప్రస్తుత సీజేఐ గవాయి వేసవి సెలవుల్లోనూ కోర్టులు పాక్షికంగా పనిచేసే పద్ధతిని తీసుకొచ్చారు. అయినా సరిపోవడం లేదు.

కొల్‌కతా, మహారాష్ట్ర హైకోర్టుల్లో కేసుల పెండింగ్‌ అత్యధికంగా ఉంది. జనాభాతో న్యాయమూర్తుల నిష్పత్తి మనదేశంలోనే అత్యల్పంగా ఉండటం కేసుల పెండింగ్‌కు కారణమనే వాదన ఉంది. అమెరికాలాంటి దేశాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు 150 మంది వరకూ న్యాయమూర్తులుండగా, మన దేశంలో 21 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. కోర్టుల్లో కేసులు భారీగా పెరిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేసులతో న్యాయస్థానాలపై ఒత్తిడి పెరుగుతోంది. దేశంలో కార్పొరేట్‌, అవినీతి, నేర రాజకీయాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. చట్టసభల సభ్యుల్లో 45 % మందిపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాధాన్యతా క్రమంలో చట్ట సభల సభ్యులు, అధికారులపై కేసులను పరిష్కరించడం కూడా అత్యవసరం.

ఇక న్యాయవాదులు తరచూ వాయిదాలు కోరడం, స్థానికంగా పరిష్కరించదగినవి కూడా కోర్టుల దాకా వెళ్ళడం, వల్ల అసంఖ్యాకంగా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే, రిటైర్డ్‌ న్యాయమూర్తుల సేవలు సివిల్‌ కేసుల విషయంలో వినియోగించుకుని, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను తేల్చాలనే సూచన ఉంది. ఏదేమయినా ఈ విషయంలో కేంద్రం ఇక ఎంతమాత్రం ఉపేక్షించకుండా హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచి , కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సి ఉంది.

కోర్టుల్లో తగినంతమంది న్యాయమూర్తులను, సిబ్బందిని నియమించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. లోక్‌ అదాలత్‌లు లాంటివి నిర్వహించి ఇరుపక్షాలు అంగీకరించిన కేసులను పరిష్కరిస్తే కోర్టులపై ఒత్తిడి తగ్గుతుంది. తీర్పులకు సమయం నిర్దేశించాలనే వాదన కూడా వుంది. న్యాయస్థానాలకు పూర్తిస్థాయిలో సహకరించాల్సిన కేంద్రం అనేక సందర్భాల్లో అడ్డుపడటం, అడ్డగోలుగా విమర్శలు చేయడం పరిపాటిగా వుంది. న్యాయమూర్తుల నియామకానికి ప్రత్యేకంగా ఒక జ్యుడీషియల్‌ కమిషన్‌ ఉండాలన్న చర్చ చాలాకాలంగా వుంది. అయితే నేడు కొలీజియం వ్యవస్థ ఆ బాధ్యత నిర్వహిస్తోంది. కాని కేంద ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం నియామకాలను తీవ్రంగా జాప్యం చేస్తోంది. ఏవో సాకులు చూపి తిరస్కరిస్తోంది. ఇంకొన్ని సందర్భాల్లో కొలీజియం, కేంద్ర న్యాయశాఖ మధ్య సమన్వయం కుదరడంలేదు. పాలన, శాసన, న్యాయ వ్యవస్థల మధ్య భారత రాజ్యాంగం స్పష్టమైన లక్ష్మణరేఖలను నిర్దేశించింది. పాలకులు వాటిని ఉల్లంఘించిన సందర్భాల్లోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది.

నాగరిక సమాజంలో సత్వర న్యాయం అందించడం న్యాయవ్యవస్థ కనీస బాధ్యత. అందుకోసం సుప్రీంకోర్టు తీసుకుంటున్న చొరవకు కేంద్రం వీలైనంత తోడ్పాటు నందించాలి. అప్పుడే పెండింగ్‌కు అడ్డుకట్టపడటంతోపాటు సత్వర న్యాయం అందేందుకు అవకాశముంటుంది.

 

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News