Tuesday, April 14, 2026
35.2 C
Hyderabad

మాటలు సరే, చేతలేవి?|EDITORIAL

తెలంగాణ రాజకీయాలు ప్రజల అవసరాలు, రాష్ట్ర లక్ష్యాలకన్నా, అధికార లాలసకే పాకులాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు.. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రజల సమస్యల పరిష్కారానికి కాకుండా స్వలాభం కోసం పరస్పర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితమవుతున్నాయి. ప్రజలకు మేలు చేయాల్సిన రాజకీయ వ్యవస్థ, అదే ప్రజలను తమ రాజకీయ క్రీడలో పావులుగా మార్చే నీచ స్థాయికి దిగజారిందన్న భావన బలపడుతోంది.

బీఆర్‌ఎస్‌ పాలన ముగిసి రెండేళ్లు దాటుతున్నా, అప్పటి అవినీతి ఆరోపణలపై విచారణలేమీ తేల్చకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాళేశ్వరం నుంచి కూకట్ పల్లి భూకబ్జాల వరకు, అక్రమ లావాదేవీలు వంటి తీవ్రమైన అంశాలు ప్రజల చర్చలో ఉన్నప్పటికీ, వాటిపై స్పష్టమైన చర్యలు లేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తోంది. విచారణల పేరుతో కాలయాపన చేయడం తప్ప, అవినీతి రుజువై, న్యాయం గెలిచిందన్న భావన ఎక్కడా కనిపించడం లేదు. పదేపదే బీజేపీ ఆరోపిస్తున్నట్లు ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత అవగాహనేమైనా ఉందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదన్నది విస్తృతంగా వినిపిస్తున్న మరో అంశం. ‘బంగారు తెలంగాణ’ నినాదం, చివరకు ‘బాకీల తెలంగాణ’గా మారిపోయింది. అభివృద్ధి పేరుతో చేసిన అప్పులు, అవి ఖర్చైన తీరుకు ఏలికలెవరూ బాధ్యత వహించడంలేదు. ఒక ప్రభుత్వం గత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడానికి, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శంచడానికే పరిమితమవుతే, ప్రజలకు ఒరిగేదేంటి? కేవలం నిరాశ తప్ప.

ఇక బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై దుమ్మెత్తిపోస్తోంది. సరే, కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర పురోగతికి చేస్తోందేంటి? నిర్దిష్టంగా రాష్ట్రాభివృద్ధికి చేసిందేంటన్నది ఆ పార్టీ పనితీరుకు కొలమానం కానుంది. తెలంగాణలో అధికారం కోసం ఆరాటపడుతున్న బీజేపీకి పోరాటమే లేదు.

ఇక బీఆర్‌ఎస్‌ అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కేసిఆర్‌ కుమార్తె కవిత, ఆపార్టీ నేతలపై చేస్తున్న అవినీతి ఆరోపణలు సంచలనంగా ఉన్నాయి. కాళేశ్వరం నుంచి కూకట్‌పల్లి భూకబ్జాల వరకు ఆమె ఎత్తి చూపుతున్న అంశాలు బీఆర్‌ఎస్‌ పాలనలోని అవినీతి, బంధుప్రీతి, లోపాలను తిరిగి చర్చల్లోకి తెస్తున్నాయి. అయితే కవిత, తాను ‘కడిగిన ముత్యాన్న’ని నిరూపించుకునే ప్రయత్నం ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోతోంది. లిక్కర్‌ స్కామ్‌ కేసు కవిత రాజకీయ భవిష్యత్తుపై మాయని మచ్చగా మిగిలింది. కన్నవారిల్లు కాదన్న ఈ సమయంలో రాజకీయ మార్గమే ఏకైక దారిగా ఆమె ఎంచుకున్నట్లుంది. కవిత ఆరోపణలు బీఆర్‌ఎస్‌ను మరింత బలహీనపరుస్తుండగా, కాంగ్రెస్‌కు అనుకోని లాభంగా కలిసివస్తోంది.
ఇదే తరుణంలో వారసత్వ రాజకీయాలు తెరమీదకు వస్తున్నాయి. తెలంగాణ సహా, దేశవ్యాప్తంగా వారసత్వ రాజకీయాలు అన్ని పార్టీల్లోనూ కొనసాగుతున్నాయి. ఒకే కుటుంబం, ఒకే కుల ప్రాబల్యంతో పాలన సాగితే, ఆ పార్టీకి, ఆ కులానికే నష్టం కలిగిస్తుందనడానికి బీఆర్‌ఎస్‌ ఉదాహరణగా నిలిచింది.

ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎత్తిచూపడమే కాకుండా, పాలనలో స్పష్టత, పారదర్శకత, ప్రజల నమ్మకం పెంచే చర్యలు చేపట్టాలి. అప్పులపై శ్వేతపత్రం, అవినీతి ఆరోపణలను కాలపరిమితితో తేల్చే విచారణలు, అభివృద్ధి ప్రాధాన్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం వంటివి ప్రజలు ఆశిస్తున్న కనీస చర్యలు.
రాజకీయాలు కేవలం అధికారం, నాయకుల కోసమే కాదు, ప్రజల కోసం కూడా. ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి, అనేక త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని స్వార్థ రాజకీయాలకు బలి చేయడాన్ని చరిత్ర క్షమించదు. ప్రజలు కూడా వదలరు. ఈ తరహా రాజకీయాలకు చెక్ పెట్టాలంటే ప్రజలే చైతన్యవంతులవ్వాలి. ప్రశ్నించాలి. బాధ్యత కోరాలి. అవసరమైతే అలాంటి రాజకీయ పార్టీలను, నాయకులను తిరస్కరించాలి. ప్రజాస్వామ్యంలో నిజమైన శక్తి ప్రజలే.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News