Sunday, April 12, 2026
36.2 C
Hyderabad

అమెరికా ఆటలో బంగ్లా బంతి!|EDITORIAL

బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో అమెరికా పరోక్ష పాత్ర ఉంది. పాక్‌ను దువ్వుతున్నది. నేపాల్‌లో గొడవలు సృష్టించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది. వీసాలపై కఠిన నిబంధలను పెట్టింది. బంగ్లాదేశ్‌ అంతర్గత అలజడుల వెనక అమెరికా హస్తం ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆరోపిస్తున్నారు. ‘ఇతర దేశాల్లో వేలు పెట్టడం వల్ల తాము చాలా నష్టపోయామ’ని అమెరికా ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ తులసీ గబ్బార్‌ ఆ మధ్య అంగీకరించడం, అమెరికా వైఖరిని స్పష్టం చేస్తున్నది.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

దేశాలతో ఆటలాడుకోవడం అమెరికాకు అలవాటుగా మారింది. ఆంక్షలు, సుంకాలు విధించడం, బెదిరించడం పరిపాటిగా మారింది. తాజాగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే, 500 శాతం పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ తన కనుసన్నల్లో ఉండాలన్నది అమెరికా కోరిక. అందుకు అవసరమైన అన్ని కుయుక్తులు పన్నుతోంది. దేశాల అంతర్గత విషయాల్లో వేలుపెడుతూ వాటిని కంట్రోల్‌ చేస్తోంది. ఇజ్రాయిల్‌ను అడ్డం పెట్టుకుని పాలస్తీనాపై దాడికి తెగించింది. ఇరాన్‌, ఖతార్‌లపైనా విరుచుకు పడింది. ఏకంగా రాజకీయంగా దేశాల పాలకులనే మార్చేస్తోంది. ఒక్క భారత్‌లోనే అది సాధ్యం కాలేదు. చైనాలో సాధ్యం కాదు. విభిన్న మతాలు, కులాల సమాహారమైన భారత్, అతి పెద్ద ప్రజాస్వామ్యం కావడంతో ఇక్కడ దాని పప్పులు ఉడకడం లేదు.
బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో అమెరికా పరోక్ష పాత్ర ఉంది. పాక్‌ను దువ్వుతున్నది. నేపాల్‌లో గొడవలు సృష్టించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది. వీసాలపై కఠిన నిబంధలను పెట్టింది. బంగ్లాదేశ్‌ అంతర్గత అలజడుల వెనక అమెరికా హస్తం ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇతర దేశాల్లో వేలు పెట్టడం వల్ల తాము చాలా నష్టపోయామని అమెరికా ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ తులసీ గబ్బార్‌ ఆమధ్య అంగీకరించడం, అమెరికా వైఖరిని స్పష్టం చేస్తున్నది.
బంగాదేశ్‌లో హసీనాను గద్దె దించడం, యూనస్‌ను గద్దెనెక్కించడం చకచకా జరిగి పోయాయి. ఇప్పుడు హసీనాకు ఉరిశిక్షను కూడా విధించారు. రెండు దశాబ్దాల క్రితం రసాయన ఆయుధాల పేరుతో ఇరాక్‌పై దాడిచేసి అక్కడ సద్దాం హుస్సేన్‌ ప్రభుత్వాన్ని అమెరికా గద్దె దింపింది. సద్దాంను బంధించి, ఉరితీసే వరకు నిద్రపోలేదు. సరిగ్గా ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతున్న తీరు కూడా ఇరాక్‌ను పోలివుంది. హసీనా భారత్‌కు అనుకూలంగా ఉండడాన్ని అమెరికా జీర్ణించుకోలేదని అర్థం అవుతోంది. అయితే, పదవీచ్యుతురాలయ్యాక, హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు. ఇప్పుడామె మరణశిక్షకు అర్హురాలని అక్కడి ట్రిబ్యునల్‌ నిర్ణయించింది. ముగ్గురు సభ్యుల ఈ ట్రిబ్యునల్‌ హసీనా ఎన్నో దుర్మార్గాలకు పాల్పడిందని ఏకరువు పెట్టింది. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నవారిని కాల్చిపారేయమని ఆదేశించారని, డ్రోన్లు, హెలికాప్టర్లు ఉపయోగించి మరీ నిరసనకారులపై మారణాయుధాలతో విరుచుకుపడమని భద్రతాబలగాలను ఒత్తిడి చేశారని న్యాయమూర్తులు తేల్చారు. అధికారంలో కొనసాగడానికి అత్యంత అమానుషంగా ప్రవర్తించారంటూ, తీవ్రంగా గాయపడిన నిరసనకారులను సకాలంలో ఆస్పత్రికి తరలించడానికి కూడా భద్రతాదళాలు నిరాకరించాయని న్యాయమూర్తులు ప్రకటించారు. తీర్పు ఇవ్వడంలో జాప్యం జరిగినందుకు క్షమించమని కూడా ఒక న్యాయమూర్తి అన్నారు. తీర్పు వెలువడగానే, యూనిస్‌ ప్రభుత్వం హసీనాను తమకు అప్పగించమని డిమాండ్‌ చేశారు.
సరిగ్గా యాభైయేళ్ళక్రితం జరిగిన సైనిక కుట్రలో తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులను కోల్పోయి, ఆరేళ్ళపాటు భారత్‌లో ఇందిర నీడన తలదాచుకొని, తిరిగి స్వదేశంలో కాలూని అధికారాన్ని చేజిక్కించుకున్న హసీనా గతం ఇప్పుడు అందరికీ గుర్తుకువస్తోంది. జియావుర్‌ రహ్మాన్‌ భార్య ఖలీదా జియా మీద అలుపెరగని, సాహసోపేత పోరాటాలు చేశారు. ఆధిపత్య పోరాటంలో ముజబూర్‌ రహ్మాన్‌ కుమార్తె హసీనా పైచేయి సాధించారు. ఖలీదా సహా బీఎన్పీ అధినాయకుల నిర్బంధాలు, ఆ పార్టీకి అండగా ఉన్న జమాతే వంటే ఇస్లామిక్‌ ఛాందసశక్తులను అధికారికంగానూ, అనధికారికగానూ హసీనా చీల్చిచెండాడారు. హసీనా పాలనలో బంగ్లాదేశ్‌ వేగంగా వృద్ధి చెందింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తయ్యాయి, పేదరిక నిర్మూలనలోనూ మంచిపేరు తెచ్చుకుంది. తనకు వ్యతిరేకంగా సాగిన విద్యార్థి ఉద్యమంపట్ల హసీనా నిర్దయగా వ్యవహరించారన్నదీ వాస్తవమే. ఆ తరువాత ఆమె దిగివచ్చినా, అప్పటికే పరిస్థితి చేజారింది. రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమం తన లక్ష్యాన్ని సాధించుకున్న తరువాత నిజానికి చల్లారినా, స్వల్పకాలంలోనే తిరిగి రాజుకోవడం వెనుక జమాత్‌ ఇస్లావిూ, బీఎన్పీ ఉండటంతో ఆమె కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని అంటారు.

పాక్ ఒత్తిడి కారణంగా అమెరికా, దాని మిత్రదేశాలు కొన్ని ఆమెకు పూర్తి వ్యతిరేకంగా వ్యహరించాయి. ఆమె పారిపోయి భారత్ కు వచ్చిన తరువాత, బంగ్లాదేశ్‌లో సాగిన పరిణామాలన్నీ ఆమె పట్ల ఏయే శక్తులు ఏ లక్ష్యాల కోసం కత్తికట్టాయో తేటతెల్లం చేస్తున్నాయి. గృహనిర్బంధంలో ఉన్న ఖలీదా విదేశీ చికిత్సతో ఎన్నికలకు సిద్ధపడటం, వేలాదిమంది జమాత్‌ యోధులు జైళ్ళ నుంచి బయటకు రావడం, ముజబూర్‌ రహ్మాన్‌ విగ్రహాలను మాత్రమే కాదు, ఆయన ఆధ్వర్యంలో సాగిన విముక్తి పోరాటాన్ని సైతం చరిత్ర నుంచి చెరిపేయడం, అప్పట్లో ఊచకోత కోసిన పాకిస్తాన్‌ను ఘనంగా కీర్తిస్తూ. ఊరేగించడం చూస్తూనే ఉన్నాం.
పాక్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ను, బంగ్లాదేశ్‌ను ఎగదోయడం వెనక అమెరికానే ఉన్నదన్నది సుస్పష్టం. ఇప్పటికే హసీనాను అప్పగించాలని యూనిస్‌ ప్రభుత్వం పలు మార్లు కోరుతూ వచ్చింది. ఇప్పుడు ఉరిశిక్ష విధించారు. కనుక భారత్‌ మీద ఒత్తిడి పెంచేందుకు మరో ఆయుధం అందివచ్చింది. ఇదంతా అమెరికా ఆడిస్తున్న నాటకమని తెలుసుకోవడానికి పెద్దగా తెలివి తేటలు అక్కర్లేదు.

Latest News

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

గిది అగ్గిపెట్టేనుల్లా!?|ADUGU TRENDS

గిది నిజ్జంగా అగ్గి పెట్టే! గా ఎండకు ఎండదు. ఆనకు తడవదు. సలికి మండకుండా ఉండదు. జేబుల పెట్టుకుంటే మోటుగుండదు. అరె! మరైతే గిదేం అగ్గిపెట్టే? అని గద అనిపిస్తుంది. కనీ, గిది...

దేశంలో సామాజిక సమస్యలకు పరిష్కారాలేవి!?|EDITORIAL

భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 80 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సందర్భంలో, సాధించిన విజయాలకన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, సామాజిక రంగంలో ఇంకా...

11-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ నవమి రాత్రి 08.34 వరకు ఉపరి దశమి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 10.08 వరకు ఉపరి శ్రవణ యోగం సిద్ద మధ్యాహ్నం 03.29 వరకు ఉపరి సాధ్య కరణం తైతుల ఉదయం 07.59...

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News