Trending News
Friday, February 20, 2026
21.2 C
Hyderabad
Trending News

శివ నామస్మరణతో మారుమ్రోగిన పాలకుర్తి|PALAKURTHI|SHIVARATRI

భక్తుల స్మరణతో పులకించిన సోమన్న గుట్ట

ఘనంగా సోమన్న కళ్యాణం

పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే యశస్విని

సోమన్నను దర్శించుకున్న పలువురు ప్రముఖులు

జనగామ జిల్లా, పాలకుర్తిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి పారవశ్యంతో కళకళలాడింది. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ప్రధాన వీధులు, రాజీవ్ చౌరస్తా నుంచి గుడివాడ చౌరస్తా వరకు రాత్రంతా భక్తుల రద్దీ కనిపించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా సమీప జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే సుమారు మూడు లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు చెప్తున్నారు. కల్యాణోత్సవాన్ని లక్షకు పైగా భక్తులు ప్రత్యక్షంగా తిలకించారు.

భక్తుల రద్దీ కారణంగా దర్శనానికి సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది. ఆలయ ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న, ఇతర ఆలయ అధికారులు గత మూడు రోజుల నుండి ఏర్పాట్లు మంచి ఫలితాలు ఇచ్చాయి. కానీ భక్తుల రద్దీ పెరగడంతో ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన తల్లులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీరు, క్యూలైన్ల నిర్వహణ, పార్కింగ్ వంటి అంశాల్లో సరైన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం సఫలీకృతమైందని కొందరు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ని చేసినా… భక్తులలో ఉత్సాహం మాత్రం తగ్గలేదు. “ఓం నమశ్శివాయ” నినాదాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం స్వామివారి కల్యాణోత్సవాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న శర్మ, అర్చకులు డివిఆర్ శర్మ, అనిల్ కుమార్ శర్మ, మత్తగజం నాగరాజు శర్మ, నాగరాజు శర్మ, సునీల్ శర్మ, సంతోష్ శర్మ, శ్యామ్ శర్మ, తదితర అర్చకులు శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయం రాత్రంతా కిటకిటలాడగా, భద్రతా పరంగా డిసిపి రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసిపి నర్సయ్య, సీఐ జానకిరామ్ రెడ్డి, ఎస్సైలు,తదితర సిబ్బంది, 150 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

మహా అన్నదానం

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి సహకారంతో పాలకుర్తిలో 10 వేల మందికి మహా అన్నదానం నిర్వహించారు. క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న విశాలమైన ప్రాంగణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా అన్నప్రసాదం పంపిణీ చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు కుమారస్వామి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించగా భారీ ఎత్తున భక్తులు స్వీకరించారు. పలువురు దాతలు వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. మొత్తంగా మహాశివరాత్రి సందర్భంగా పాలకుర్తి ఆధ్యాత్మిక క్షేత్రంగా మారి భక్తి భావంతో కళకళలాడింది.

Latest News

పెండ్లి పిల్ల మీద నో(కో)ట్ల కట్టలు!?|ADUGU TRENDS

పెండ్లంటే నూరేళ్ళ పంట. గందుకే ఆకాసమంత పందిరి, భూదేవంత పీటలేసి పెండ్లిల్లు శేత్తరు. ఉన్నోల్లు కోట్లకు కోట్లు కర్సు పెడ్తరు. కనీ, గీ వీల్లు గవన్నీ శేసిండ్లు. గంతకు మించి, పెండ్లి పిల్ల...

జెండాలకతీతంగా అభివృద్ధి ఎజెండా!|EDITORIAL

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. ఇక రాజకీయాలు పక్కన పెట్టేయాలి. ప్రజలు ఎదురుచూస్తోన్న అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. గ్రామాలు, పట్టణాలు బలపడితేనే రాష్ట్రం, దేశం బలపడుతుంది. ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ఎజెండాను...

గురువారం, ఫిబ్రవరి 19–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--శుక్లపక్షం తిధి విదియ సాయంత్రం 04.35 వరకు ఉపరి తదియ నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 09.43 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం సిద్ద రాత్రి 09.45 వరకు ఉపరి సాధ్య కరణం కౌలవ సాయంత్రం 04.36...

ఇనుప సువ్వలతో దెండెం ఇకమతు!?|ADUGU TRENDS

ఇంటి మీద, మిద్దెల మీద, మేడల మీద బట్టలారేసు కోవాల్నంటే మస్తు తిప్పలైతది. దండాలు కట్టాల్నంటే కూడా కట్టమే. గిదీనికి ఓ ఇకమతు ఉంది. కవాల్నంటే సూడుండ్రి. గీ పోటువల సూపినట్లు.. ఇనుప సువ్వతోటి...

మనం-వనమే జీవావరణం!|EDITORIAL

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వన్యప్రాణులు గ్రామాలు, పట్టణాలలో సంచరించడం ఆందోళనకరంగా మారింది. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవిపందులు, ఏనుగులు, కోతుల దాడులు కూడా పెరిగిపోతున్నాయి. వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడానికి ప్రధాన...

బుధవారం.ఫిబ్రవరి 18–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--శుక్లపక్షం ఫాల్గుణ మాసం ప్రారంభం తిధి పాడ్యమి సాయంత్రం 05.20 వరకు ఉపరి విదియ నక్షత్రం శతభిషం రాత్రి 09.54 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శివ రాత్రి 11.35 వరకు ఉపరి సిద్ద కరణం బవ...

బంగారాన్ని బయటికి తీసే ఉపాయం!?|ADUGU TRENDS

పొరపాటుగ బంగారం ఉంగురంపోతే ఏం సేత్తం? దబదబ యెత్కుతం. గదే ఓ బురదలోనో, నీటిలోనో పడిపోతే ఏం సేత్తం? ఇంకా ఆగమాగమైపోతం. అసలే బంగారం ధర పెరిగిపాయె. గిదీనికి గూడ ఓ ఇకమతు...

ప్రణాళికలతో ‘సాగ’డమే శ్రేయస్కరం|EDITORIAL

నీటి నిర్వహణలో స్పష్టత, ప్రాధాన్యతా క్రమం, కార్యాచరణలే అభివృద్ధికి అసలైన బలమైన పునాదులు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికాకుండానే కొత్త ప్రతిపాదనలను, ప్రణాళికలను సిద్ధం చేయడం, రాజకీయ వ్యాఖ్యలతో వివాదాలను రేకెత్తించడం మామూలైపోయింది. ఇది...

మంగళవారం, ఫిబ్రవరి 17–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు మాఘమాసం--కృష్ణపక్షం తిధి అమావాస్య సాయంత్రం 05.32 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ధనిష్ఠ రాత్రి 09.37 వరకు ఉపరి శతభిషం యోగం పరిఘ రాత్రి 01.06 వరకు ఉపరి శివ కరణం నాగవ సాయంత్రం 05.34 వరకు ఉపరి...

సోమవారం, ఫిబ్రవరి 16–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు మాఘమాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.17 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం శ్రవణ రాత్రి 08.50 వరకు ఉపరి ధనిష్ఠ యోగం వరీయాన్ రాత్రి 02.11 వరకు ఉపరి పరిఘ కరణం శకుని సాయంత్రం 05.18 వరకు ఉపరి...

జీపీఓల వ్యవస్థ – అవస్థలు – పరిష్కారాలు|GPO|TELANGANA|ARTICLE

నిజాం కాలం నాటి పటేల్–పట్వారీ వ్యవస్థ నుంచి నేటి జీపీఓల దాకా వచ్చిన మార్పులు గ్రామ పరిపాలన స్వరూపాన్నే మార్చేశాయి. అయితే, ప్రతి మార్పు కొత్త అవకాశాలతోపాటు సరికొత్త సవాళ్లను కూడా మోసుకొచ్చింది. సాయి...

కజ్జూర పండ్ల గింజల్ని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

కజ్జూర పండ్లంటే ఎవరికైన ఇట్టమే. లొట్టలేసుకుంట చప్పరిస్తం. ఇగ శిన్న పిల్లలైతే గయి మస్తుగ తింటరు. గయి మనకు మస్తు బలాన్నిస్తయి. గయి గీ కాలంలనే దొరుకుతయి. గవాటిని నోట్లేసుకుని, పండును తిని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News