Friday, April 10, 2026
36.2 C
Hyderabad

నిరంకుశం వైపు ప్రజాస్వామ్యం పరుగులు!|EDITORIAL

ప్రజలు, వారి ప్రతినిధుల ద్వారా ప్రజల కోసమే జరిగే పరిపాలన ప్రజాస్వామ్యం. రాను రాను ప్రజాస్వామ్యం నిరంకుశం వైపు పరుగులు పెడుతున్నట్లుగా కనిపిస్తున్నది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన నేతలు, నిరంకుశంగా పాలించడం, నిరపేక్షంగా అధికారాన్ని చెలాయించడం చూస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థ నింరకుశంవైపు, నిరంకుశాలు నియంతృత్వంగా మారుతుండటం విచారకరం. ఒక వ్యక్తి లేదా ఒక వర్గం చేత అధికారాలు కేంద్రీకృతమై, ప్రజల స్వేఛ్ఛా హక్కులను హరించడమే దీని ఉద్దేశ్యం. ఇది ప్రజాభిప్రాయాన్ని అణచివేస్తుంది. వివిధ సంస్థలను హస్తగతం చేసుకుని, ప్రజాస్వామ్యంలో ఈ నిరంకుశ ప్రవృత్తి మెల్లగా ప్రబలడం ఎంతో ప్రమాదకరం.
ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను మరిచి, అధికారంలోకి వచ్చాక తమ స్వంత ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం.. మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి సంస్థలను కంట్రోల్ లో పెట్టుకోవడం ద్వారా అధికారాన్ని నిలుపుకోవడం.. హక్కుల కోసం పోరాటాలు, నిరసనలు జరగకుండా అణచివేయడం.. భిన్నాభిప్రాయాలను దేశద్రోహంగా ముద్రవేసి, విపక్షాలను విచారణల పేరుతో వేదించడం.. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిని అణచడానికి న్యాయ వ్యవస్థను లేదా చట్టాలను ఉపయోగించడం వంటివన్నీ నిరంకుశ ధోరణులే. దేశ భద్రత, ఆర్థిక అభివృద్ధి, స్థిరత్వం వంటి నినాదాల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారు. హిట్లర్ తరహాలోనే వీరు వ్యవహరిస్తున్నారు. శాసన సభలను రద్దు చేయడం, గవర్నర్ల వ్యవస్థను వాడుకోవడం, మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు వంటి చర్యలన్నీ ప్రజాస్వామ్య బలహీనతలుగా చూడాలి.
బలమైన పౌర సమాజం ఏర్పడాలి. ప్రజలలో రాజకీయ చైతన్యం పెరగాలి. హక్కుల విషయంలో గళమెత్తే శక్తిని ప్రజలు కలిగి ఉండాలి. ప్రశ్నించే మీడియా ఉంటే ప్రభుత్వ చర్యలు ప్రజలకు స్పష్టమవుతాయి. ప్రభుత్వానికి అతీతంగా స్వతంత్రంగా న్యాయ వ్యవస్థ పనిచేయాలి. ఓటు హక్కును వినియోగించడమే కాక, ప్రభుత్వ చర్యలను గమనిస్తూ, ప్రశ్నించే ధైర్యాన్ని ప్రజలు చూపాలి. అప్పుడే నిరంకుశ పాలనకు అడ్డుకట్ట వేయవచ్చు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ లో ప్రస్తుతం ఆరోగ్యకరమైన, ప్రజాస్వామ్యయుత రాజకీయ వాతావరణం కనిపించకుండా పోతోంది. అధికారం చేపట్టిన నేతలు నిరంకుశమనే విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. అన్ని వ్యవస్థలతో పాటు మీడియా పైనా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మీడియాపై ఆంక్షలు, కక్ష సాధింపులు, అక్రమ కేసులు, అరెస్టుల దాకా వెళుతున్నారు. సొంత మీడియా సంస్థలను ప్రోత్సహిస్తూ, సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. మోదీ, మమతా బెనర్జీ, నిన్న మెన్నటి దాకా కేసీఆర్‌, జగన్‌ వంటి వాళ్లంతా అహంకార పూరితంగా పరిపాలకులుగా చరిత్రలో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు, వారిచ్చే ఓటుతో గెలిచి సుపరిపాలన అందించాలి. ఓట్లేయించుకోవడం, వేసుకోవడం ఎలాగో తెలుసుకుని రాజ్యమేలుతున్న మన రాజకీయ నేతలు అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేస్తున్నారు. ప్రజలను పురుగుల్లా చూస్తున్నారు. పోలీసులను తమ గుప్పిట్లో పెట్టుకుని పాలన చేస్తున్నారు. ఇలా జరుగుతుందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఊహించి ఉండరు. లేకుంటే ఎక్కడో అక్కడ ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టేవారేమో!
దేశంలో ఉక్కు మహిళగా పేరున్న ఇందిరా గాంధీ కాలంలోనూ, ఉమ్మడి ఏపీలో చెన్నారెడ్డి, వైఎస్ లాంటి నేతలు కూడా ఇంత నిరంకుశంగా పాలించ లేదు. ప్రజా సంక్షేమం పేరుతో, డబ్బుల పందేరంతో ఖాజానాను ఊడ్చేస్తున్న నాయకులు ఎప్పటికైనా జవాబుదారీగా ఉండాల్సిందే. అధికారంలో ఉన్న వారు నిజంగా మంచి పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు. వారిని ఆదరిస్తారు. లేదంటే అత: పాతాళానికి తొక్కేస్తారు.
ప్రజాస్వామ్యానికి అసలైన శక్తి ప్రజలే. అయితే ప్రజల మౌనం, ఓటింగ్ పై ఆసక్తి లేకపోవడం, వ్యక్తిగత లాభం కోసమే ఓట్లేయడం వంటి అంశాలు ప్రజాస్వామ్యానికి చేటు, నిరంకుశత్వానికి బలం చేకూరుస్తాయి. ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పదిలంగా ఉండాలంటే ప్రజలు చైతన్యంగా ఉండాలి. పాలకులను ప్రశ్నించగలగాలి. లేదంటే ప్రజాస్వామ్యం నెమ్మదిగా నియంతృత్వాన్ని సంతరించకోవడం ఖాయం.
…..

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News