Friday, April 10, 2026
36.2 C
Hyderabad

మానవత్వమా! నీ అడ్రసెక్కడ?|EDITORIAL

మానవత్వం మంటగలుస్తోంది. మానవ విలువలు మట్టిపాలవుతున్నాయి. మనిషి ప్రాణం త్రుణ ప్రాయంగా మారింది. నిత్యం ఏదో ఘోరం వినాల్సి రావడమో, చూడాల్సి రావడమో తప్పడం లేదు. అసాంఘిక, అత్యాచార, హత్యలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. నేరం-ఘోరం నిత్యకృత్యమైంది. విక్రుత విష రూపాలు తీసుకుంది. బయటకు వెళ్ళినవాళ్లు తిరిగి వస్తారా? అన్న భయం పోయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే, ఏమైనా జరగొచ్చు. ఎవరికి ఏమైనా కావచ్చు. ఏడడుగులు కలిసి నడిచిన భార్యాభర్తలు, అన్నా దమ్ములు, తల్లిదండ్రులు పిల్లలు అన్న రక్త సంబంధాలు కూడా రక్తమోడుతున్నాయి. కుటుంబ బంధాలు ఏనాడో మంటకలిశాయి. సమాజంలో మనుషుల సంబంధాలన్నీ అవసరాల మేరకో, ఆర్థికపరంగానో ముడి పడ్డాయి. దీంతో ఎవరన్నా, ఎవరికీ లెక్కలేదు. ఎవరిని ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఒక కుటుంబ సభ్యులు ఒక ఇంట్లో కలిసి ఉన్నా, మానసికంగా దూరమే. మరి సమాజంలో ఏం జరుగుతోంది? ఎందుకీ మారణ హోమం. అమానవీయతత్వం? బహుషా ఈ కలికాలం అంతరించిపోతుందంటే ఇదేనేమో? ఇలాగేనేమో?

ఒకప్పుడు ఎవరికి ఎవరి వల్లనైనా హాని ఉందంటే అది శ్రతువు వల్ల, ప్రక్రుతి ప్రకోపం వల్ల, ప్రమాదాల వల్ల అయి ఉండేది. ఇప్పుడా భయం అక్కరలేదు. మన పక్కనే మనతో నవ్వుతూ మాట్లాడే వారితోనో, మన కన్న కొడుకులు, బిడ్డలతోనో, భార్యా భర్తతోనో, అన్నాతమ్ముళ్ళతోనో, మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన రక్త సంబంధీకులు, అంతా మన అనుకున్న వాళ్ళతోనే ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

జాతీయ నేర నివారణ విభాగం గణాంకాల ప్రకారం.. దేశంలో రోజుకు 86 అత్యాచారాలు నమోదవుతున్నాయి. ఇందులో 90 శాతం దారుణాలు తెలిసిన వ్యక్తుల ద్వారానే జరుగు తుండడం గమనార్హం. బాధితుల్లో 10 శాతం మంది 18ఏళ్ల లోపు వారు కాగా, 66శాతం మంది 18-30 ఏళ్ల లోపువారు. దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అత్యాచార, హత్యాచార ఘటనలు, విద్యార్థినులపై జరుగుతున్న దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సామాజికంగా, శాంతిభద్రతల, ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో ఎదిగామని అనుకుంటున్న ఈ తరుణంలోనూ మన మానసిక దౌర్బల్యాన్ని, మన వెనుక బాటుతనాన్ని, మన సంకుచిత మనస్తత్వాన్ని, పెరుగుతున్న పగ, ప్రతీకారాలు, నేర ప్రవ్రుత్తిని, సమాజంలో పెరుగుతున్న అశాంతి ధోరణులను, మన భద్రతను, మన రక్షణను, మన పాలకుల నిర్లక్ష్య, నిర్లిప్త ధోరణులను ఎత్తి చూపుతున్నాయి. మన మానసిక ఈ స్థితులే మనల్ని వెక్కిరిస్తున్నాయి.

భర్తలను వదిలించుకునే భార్యల సంఖ్య పెరుగుతోంది. ప్రియుడి మోజుల చంపేవారు కొందరు….ప్రియురాలి కోసం భార్యలను వధించే వారు మరికొందరు… సుపారీ హత్యలు, పరువు హత్యలు. ఆస్తుల పంచాయితీల్లో అన్నాతమ్ములమనే భావన పోతోంది. అన్నను తమ్ముడు చంపడమో..తమ్ముడిని అన్నను చంపడమో మామూలైంది. మద్యానికి బానిసలై తల్లిదండ్రులను కడతేరుస్తున్నారు. పోలీసులు అన్నా.. జైలు అన్నా భయం లేకుండా పోతోంది. జైలుకే కదా? కొన్ని రోజులు వెళ్లి వద్దాంలే! అన్న ధోరణి కనిపిస్తోంది. ఎక్కడైనా సరే, డబ్బులు పెడితే చాలు బయట పడొచ్చన్న నిర్లక్ష్యం కూడా వేళ్ళూనుకోవడమే కాదు, వట వ్రుక్షమైపోతోంది. అత్యాచార ఘటనలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ కూతరు ప్రియుడితో కలసి తల్లిని హత్య చేయించింది. వరంగల్‌లో ప్రియురాలు మోజులో పడి భార్యను నిర్లక్ష్యం చేయడంతో ఇటీవల ఓ డెంటిస్ట్‌ ఆత్మహత్య చేసుకుంది. సమాజంలో పడిపోతున్న విలువలు, పెరుగుతున్న విష సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోల్‌కతాలో వరుస హత్యాచార ఘటనలు..ఆందోళన కలిగించాయి. కోల్‌కత్తా లా కాలేజీ విద్యార్థినిపై సహ విద్యార్థుల అత్యాచారం, ఐఐఎం విద్యార్థినిపై కళాశాల హాస్టల్లోనే అఘాయిత్యం జరిగాయి. బెంగాల్‌లో అధికార పార్టీకి చెందిన విద్యార్థి సంఘం నాయకులు ఈ దుర్మార్గం వెనుక ఉన్నారని వార్తలు వచ్చాయి. గతేడాది ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ హాస్పటల్లో జూనియర్‌ డాక్టర్‌ అత్యాచారానికి, హత్యకు గురి కావడం దేశవ్యాప్త ఆందోళనలకు దారి తీసింది.

ఒడిషాలో బిఇడి విద్యార్థిని … తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యాపకుడి విూద ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణం. భవిష్యత్తు లో ఉపాధ్యాయినిగా ఎదగాల్సిన విద్యార్థిని బలన్మరణానికి దారి తీసింది. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని కళాశాలకు వెళ్లి, గండికోటలో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో పారా మెడికల్‌ విద్యార్థినులు… తమను ల్యాబ్‌ అసిస్టెంటు, మరో ముగ్గురు సిబ్బంది లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్టు- ఫిర్యాదు చేశారు. ఏలూరులోని స్టోర్ట్స్‌ అధారిటీ- ఆఫ్‌ ఇండియా కేంద్రంలో క్రీడాకారిణుల పట్ల కోచ్‌లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు- వచ్చిన వార్తలు సంచలనం కలిగించాయి. అలాగే, నేర నిరూపణ చేయటంలోనూ పోలీసు యంత్రాంగం తరచూ విఫలమ వుతోంది. సంచలనం కలిగించిన ఆయేషా, రిషితేశ్వరి ఉదంతాలలో నిందితులకు శిక్ష పడలేదు. దర్యాప్తులో వైఫల్యాలు కూడా నేర ప్రవర్తకులకు పరోక్ష ధైర్యాన్నిస్తాయి. ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటే కఠిన శిక్షలు విధించాల్సిందే. మరణశిక్షలకు సైతం వెనకాడరాదు. చిన్నప్పటి నుంచే విలువలతో కూడిన చదువు, జీవితాన్ని మన పిల్లలకు అందించాలి. మన పాఠ్యాంశాలను కూడా మనం మార్చుకోవాల్సి ఉంది. మార్పు అనేది ప్రతి ఒక్కరిలోనూ రావాలి. విలువైన మానవ జీవితానికి సార్థకతను తేవాలి.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News