Friday, April 10, 2026
36.2 C
Hyderabad

సామాన్యుడి ఊసే లేని సంస్కరణల బడ్జెట్!?|EDITORIAL

దేశ ప్రజల ఆకలి బాధలు, జీవన ప్రమాణాల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలను పట్టించుకోకుండానే కేంద్ర ప్రభుత్వం మరోసారి బడ్జెట్‌ను యథావిధిగా ప్రవేశపెట్టింది. రూ. 53.47 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ కాగితాల మీద భారీగా కనిపించినా, సామాన్య ప్రజల జీవితాల్లో ప్రతిఫలించేదేమిటి? గత తొమ్మిదేళ్లుగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న బడ్జెట్ల ఫలితాలను సమగ్రంగా పరిశీలిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థలో సమతౌల్య అభివృద్ధి జరిగిందని చెప్పడానికి ఆస్కారమే లేకుండా పోతోంది.

ప్రస్తుతం దేశంలో ఎదురవుతున్న ప్రధాన సమస్య ఆర్థిక మందగమనం. జాతీయ స్థాయిలో వినియోగం తగ్గిపోవడం, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యావసర వస్తువుల నుంచి ఔషధాల వరకు ధరలు విపరీతంగా పెరిగాయి. కోవిడ్‌ అనంతరం, కొన్ని కీలక ఔషధాల ధరలు 200 నుంచి 500 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్‌ డేటా సూచిస్తోంది. ఫలితంగా వైద్యం చేయించుకోవడం దూరమైతే, కనీసం మందులు కొనుగోలు చేసే స్థితిలోనూ సామాన్యుడు లేకుండా పోయాడు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిజంగా ప్రగతిశీలమైతే, దాని ప్రభావం ప్రజల జీవితాల్లో కనిపించాలి. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఆశించిన మార్పు రావడం లేదు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. ఉపాధి అవకాశాలు విస్తరించకపోవడంతో గ్రామాల నుంచి పట్టణాల వైపు వలసలు పెరుగుతున్నాయి. సంపాదించిన ఆదాయం తిండికే సరిపోని పరిస్థితి విస్తరిస్తోంది. గ్రామీణ వినియోగం తగ్గిన తీరే ఇందుకు నిదర్శనం.

ఈ బడ్జెట్‌లో మరో ప్రధాన అంశం ఆర్థిక క్రమశిక్షణ. కార్పొరేట్లు, కోటీశ్వరులకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాల్సినప్పుడు ఈ క్రమశిక్షణ గుర్తుకు రాలేదు. కానీ కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ వ్యయాలు పెంచాల్సిన సందర్భంలో మాత్రం ‘ఆర్థిక క్రమశిక్షణ’ ముందుకు వచ్చింది. ఫలితంగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం వంటి రంగాలకు కేటాయింపుల్లో కోతలు పడ్డాయి. మహిళా సంక్షేమం కోసం ఉద్దేశించిన జెండర్ బడ్జెట్‌ నిధుల్లోనూ కోత పడటం ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టంగా చూపిస్తోంది.

బడ్జెట్‌పై ప్రతిపక్షాలు మాత్రమే కాదు, ఆర్థిక సంస్కరణలకు మద్దతు ఇచ్చే నిపుణులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో నిరుద్యోగం, అధిక ధరలు, జీవన వ్యయాల పెరుగుదల తప్పవన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గత ఏడాదిలో ఆదాయ పన్ను, జీఎస్టీ మార్పులతో కొంతమేర ఉపశమనం కల్పించిన ప్రభుత్వం, ఈసారి వాటి జోలికి వెళ్లకపోవడం మధ్యతరగతిపై భారాన్ని మరింత పెంచింది. పరోక్ష మినహాయింపులు ప్రకటించినా, అవి ప్రజల జేబుల్లోకి డబ్బు తెచ్చే స్థాయిలో ఉంటాయా? అన్నది అనుమానమే.

అయితే, బడ్జెట్‌లో కొన్ని ఆశాజనక అంశాలు కూడా ఉన్నాయి. కేన్సర్‌ చికిత్సకు ఉపయోగించే 17 కీలక ఔషధాలపై దిగుమతి సుంకాల మినహాయింపు, అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మరో 7 ఔషధాలపై సుంకాల తగ్గింపు నిర్ణయం ఊరట కలిగించే అంశం. ఇవి ఔషధాల ధరలను తగ్గించి బాధితులకు ఉపశమనం కలిగించే అవకాశముంది. కానీ ఇది సమగ్ర ఆరోగ్య సంరక్షణ విధానానికి ప్రత్యామ్నాయం కాదన్నది గుర్తించాలి.

ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించిన ‘సంస్కరణల ఎక్స్ ప్రెస్’, ‘మూడు కర్తవ్యాలు’ గత తొమ్మిదేళ్లుగా విన్న పదాలే. కానీ, వాటి ఫలితాలు గ్రామాల్లో, పేదల జీవితాల్లో ఎందుకు కనిపించడం లేదు? ఇంకా కోట్లాది మందికి ఉచిత బియ్యం అందించాల్సిన పరిస్థితి ఉంటే, దేశ ఆర్థిక బలం గురించి గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించాల్సిన అంశమే.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను లోతుగా అర్థం చేసుకోకుండా, ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు తీసుకోకుండా ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టినా భారత పురోగతి కాగితాలకే పరిమితం అవుతుంది. ‘సంస్కరణల ఎక్స్ ప్రెస్’ వేగం పెరిగిందని చెప్పడం కంటే, ఆ ఎక్స్ ప్రెస్ ఎవరిని తీసుకెళ్తోంది? ఎవరిని వదిలేస్తోంది? అన్నదే తేలాల్సిన ప్రశ్న? మరి సమాధానం మన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా?

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News