Friday, April 10, 2026
36.2 C
Hyderabad

ఇండిగో సంక్షోభం, ఇండియాకో గుణపాఠం!|EDITORIAL

ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. సంక్షోభం తలెత్తి వారం గడస్తున్నా పరిష్కారాలేవీ లేకపోవడం, పైగా రోజు రోజుకు మరిన్ని విమాన సర్వీసులు రద్దవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. సోమవారం 350 సర్వీసులు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన 70, ఇక్కడి నుండి వెళ్ళాల్సిన 74 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇది ఇండిగో వైఫల్యంగానే కనిపిస్తోంది. ఇండిగో నిర్వాహకుల తప్పిదాలే ఈ సంక్షోభానికి కారణంగా కనిపిస్తోంది. ఈ సమస్య తలెత్తేనాటికి ఇండిగో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లంతా విదేశాల్లో ఉన్నట్లుగా తేలింది. అయితే సంక్షోభం తలెత్తిన నాటి నుండే బోర్డ్ డైరెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ఇండిగో ప్రకటించింది.

ఇదిలా వుండగా, విమానాల రద్దు సమస్యకు ఇండిగోనే కారణమని భారత పౌరవిమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానంగా చెప్పారు. ఇండిగో ఎయిర్ లైన్స్ క్రూ, ఇంటర్నల్ ప్లానింగ్ లోపం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్నారు. ఎఫ్డీటీఎల్ అమలు చేయడంతో ఎలాంటి సమస్యా లేదన్నారు. ‘నెల రోజులుగా ఇండిగో సంక్షోభంపై విమానయానశాఖ పరిశీలిస్తూనే ఉంది. డిసెంబర్ 1న సంక్షోభం తీవ్రమైనప్పుడు యాజమాన్యంతో చర్చించాం. ఎలాంటి సమస్యా లేదు. కానీ, హఠాత్తుగా డిసెంబర్ 3న క్రైసిస్ పెరగింది. ఈ సమస్యను విచారిస్తున్నాం, తేలికగా తీసుకోమని’ ఆయన హెచ్చరించారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతోందన్న అనుమానాలను కూడా మంత్రి వ్యక్తం చేశారు.

ఇండిగో ఎయిర్ లైన్స్ భారత దేశానికి చెందిన చౌకైన విమానయాన సంస్థ. గుర్గావ్ దీని ప్రధాన కేంద్రం. ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్ కు చెందిన రాహుల్ భాటియా, అమెరికాలోని ఎన్ఆర్ఐ రాకేష్ ఎస్. గాంగ్వాల్ కలిసి 2006 లో ఇండిగోను స్థాపించారు. ఇంటర్ గ్లోబ్ సంస్థకు ఇండిగోలో 51.12% వాటా, గాంగ్వాల్ కు చెందిన సేలం ఇన్వెస్టిమెంట్ కంపెనీకి 48% వాటా ఉన్నాయి. 2014 డిసెంబరు నాటికే 36.1% వాటా కలిగిన అతి పెద్ద ఎయిర్ లైన్ సంస్థగా ఎదిగింది. ఎయిర్ బస్ A320 కుటుంబానికి చెందిన 91 విమానాలు ఈ సంస్థలో ఉన్నాయి. భారత వైమానిక మార్కెట్ వాటాలో నాలుగో వంతుతో, కేవలం 6 ఏళ్ళల్లోనే ఇండిగో ఘనత సాధించడం విశేషం. ఇతర దేశాల్లోని 37 కేంద్రాల నుంచి ప్రతి రోజూ 550 విమానాలతో ఇండిగో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ సంస్థ పాత విమానాలను ఎప్పటికప్పుడు మారుస్తుంటుంది. 2015, ఫిబ్రవరి 6 నాటికి ఇండిగో నడిపిస్తోన్న వాటిలో 91 విమానాల సగటు విమాన వయస్సు కేలం 2.9 ఏళ్ళే. అనేక అవార్డులూ రివార్డులూ గెలుచుకుంది.

అయితే, డిసెంబర్‌ 2 అర్ధరాత్రి వరకు సాధారణంగా ఉన్న వ్యవస్థ, ఒక్కసారిగా కుప్పకూలడానికి గల కారణాలపై విమానాయన సంస్థ లోతుగా దర్యాప్తు చేస్తున్నది. నిజానికి ఇండిగోలోనే అత్యధికంగా 2,260 మంది పైలెట్లు ఉన్నారు. పెరుగుతున్న డిమాండ్‌కనుగుణంగా ఇండిగో ఎయిర్‌ బస్‌ నుంచి 100 విమానాలు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్‌ ఇండియా 500, ఆకాశ 100, స్పైస్ ‌జెట్‌ కూడా 50 విమానాలు కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చాయని తేలింది. ప్రస్తుతావసరాలకు అనుగుణంగా రెండు, మూడు సంస్థలు అనుమతి పొందినా. మార్కెట్ లో విమానాలు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు విమానయాన సంస్థల్లో ఆహారం, నీరు, టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత, సీటు కోసం మళ్లీ నగదు వసూలు చేస్తున్న వ్యవహారంపైనా పూర్తి విచారణ జరగాల్సి ఉంది. విమానాల ఆలస్యం, రద్దు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణీకులకు రిఫండ్‌ చేసే విషయంలోనూ పౌర విమానయాన శాఖ చర్యలు తీసుకోవాలి.

ఇండిగో సంక్షోభం దేశ విమానయాన రంగంలోని లోపాలను మరోసారి బయటపెట్టింది. 140 కోట్ల జనాభా ఉన్న జనాభాకనుగుణంగా విమానయాన వ్యవస్థ విస్తరణ జరగకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహం తగ్గడం, ప్రైవేట్‌ రంగంపై నియంత్రణ లేకపోవడం విమానయాన రంగాన్ని బలహీనపరుస్తున్నాయి. పైలట్లు, సిబ్బంది కొరత లేకున్నా, సంస్థలు సంక్షోభాల్లోకి ఎందుకు జారుతున్నాయన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు కావాలి.
వరుసగా చోటు చేసుకున్న బాంబు బెదిరింపులు, సాంకేతిక సమస్యలు, కార్యకలాపాల లోపాల వంటివన్నీ చూస్తూ, ఏదో పెద్ద కుట్ర కోణం దాగి ఉందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. సమగ్ర దర్యాప్తు చేసి, వాస్తవాలను వెలికి తీయాలి.

ఇండిగో సంక్షోభం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, విమానాయాన సంస్కరణలకు అవకాశం కూడా. ఇప్పటికైనా విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధానాలు రూపుదిద్దాలి. లేకపోతే రాబోయే రోజుల్లో చిన్న చిన్న లోపాలే పెద్ద పెద్ద సంక్షోభాలుగా మారే ప్రమాదం తప్పదు.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News