Friday, April 10, 2026
36.2 C
Hyderabad

తెలంగాణలో మొదలైన ‘పంచాయితీ’!?|EDITORIAL

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికలే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఇందిరమ్మ చీరల పంపిణీని మొదలు పెట్టింది. మంగళవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 3.5లక్షల మంది మహిళలకు రూ.300.4 కోట్ల వడ్డీరహిత రుణాలిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు ప్రగతిలో ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం బాగానే ప్రిపేర్ అయింది.
కానీ, బీసీ రిజర్వేషన్లనే వెనక్కి నెట్టేసింది. బీసీలకు రిజర్వేషన్లు సాధించి తీరుతామని ఊదరగొట్టి, చివరకు పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్‌ ఇచ్చింది. దాని అమలు పేరుతో నానా ఫీట్లు చేసి, చివరకు కోర్టుల్లో ఫట్ మనిపించింది. నెపం కేంద్రం మీద, బీజేపీ, బీఆర్ఎస్ ల మీదకు నెట్టారు. రిజర్వేషన్లపై 50శాతం సీలింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయినా, సాధించేస్తామని బీరాలు పలికి, లాయర్ల ఫీజుల కింద కోట్లు తగలేశారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు వెనక్కి వెళ్ళకుండా అన్న సాకుతో ఎన్నికలకు సిద్ధ పడింది. బీసీ రిజర్వేషన్ల పేరిట నానా హంగామా చేసి, మళ్లీ పాతపద్ధతిలోనే పంచాయతీ ఎన్నికలకు సిద్ధమయ్యారు.
‘1948 చట్టం’ ప్రకారం జన,కులగణన చేపట్టే అధికారం కేంద్రానికి మాత్రమే ఉన్నది. రాష్ట్రాలకు లేదు. ఒకవేళ చేసినా ఆ గణాంకాలకు చట్టబద్ధత ఉండదు. అమలు చేసే అవకాశం లేదు. పైగా కేంద్ర ప్రభుత్వమే ‘గణాంకాల సేకరణ చట్టం-2008’ ద్వారా రాష్ట్రాలకు డాటా సేకరణకు పరిమిత అధికారాలను బదలాయించింది. ఒకవేళ జన, కుల గణనను రాష్ట్రం నిర్వహించాలని భావించినా, అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అంతేకాదు, సేకరించిన డాటా వెల్లడిపై కూడా అనేక ఆంక్షలు ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఇంటింటి సర్వే పేరుతో జన, కుల గణన చేశామని అందరినీ మభ్యపెట్టిందనేది విపక్షాల ఆరోపణలు. కుల గణనకు కేంద్రం పూనుకోవడంతో అదీ తమ ఘనతేనని చెప్పు కున్నది. కేంద్రం మెడలు వంచామని బుకాయించారు.

ఇక పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌, వార్డుల రిజర్వేషన్ల ఖరారులో గందరగోళం నెలకొంది. సర్కారు మార్గదర్శ కాలకు విరుద్ధంగా జిల్లాల్లో అధికారులు రిజర్వేషన్లను ఇష్టారీతిన ఖరారు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ప్రభుత్వం జీవో 46ను విడుదల చేసింది. తదనుగుణంగా సర్పంచ్‌ స్థానాలకు ఆర్డీవోలు, వార్డు మెంబర్ల స్థానాలకు ఎంపీడీవోలు రిజర్వేషన్లను ఖరారు చేశారు. జనాభా దామాషా ప్రకారం తొలుత ఎస్టీ, ఎస్సీ, బీసీ, తదుపరి మహిళా స్థానాలను ఖరారు చేశారు. గ్రామం, మండలం, జిల్లా, ఆపై రాష్ట్రం యూనిట్‌గా నిర్దేశిత కోటా ప్రకారం స్థానాలను రిజర్వ్‌ చేశారు.

ఇదిలాఉంటే వార్డు సభ్యుల స్థానాలకు ఇంటింటి సర్వే 2024 లెక్కలను, సర్పంచ్‌ స్థానాలకు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీ రిజర్వేషన్లకు ఇంటింటి సర్వే 2024 లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం వివాదంగా మారింది. రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నదని బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ కోటాను తగ్గించి జనరల్‌ కోటను పెంచారని బీసీ సంఘాలు చెప్తున్నాయి. రొటేషన్‌ ముసుగులో బీసీలకు రావాల్సిన సర్పంచ్‌ స్థానాలను అగ్రకులాలకు కట్టబెడుతున్నారని మండిపడుతున్నాయి.

ఇప్పటికైనా బీసీ సంఘాల ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రిజర్వేషన్ల అమలు, ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరగాలి.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News