Friday, April 10, 2026
36.2 C
Hyderabad

అమెరికా ఆటలో బంగ్లా బంతి!|EDITORIAL

బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో అమెరికా పరోక్ష పాత్ర ఉంది. పాక్‌ను దువ్వుతున్నది. నేపాల్‌లో గొడవలు సృష్టించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది. వీసాలపై కఠిన నిబంధలను పెట్టింది. బంగ్లాదేశ్‌ అంతర్గత అలజడుల వెనక అమెరికా హస్తం ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆరోపిస్తున్నారు. ‘ఇతర దేశాల్లో వేలు పెట్టడం వల్ల తాము చాలా నష్టపోయామ’ని అమెరికా ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ తులసీ గబ్బార్‌ ఆ మధ్య అంగీకరించడం, అమెరికా వైఖరిని స్పష్టం చేస్తున్నది.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

దేశాలతో ఆటలాడుకోవడం అమెరికాకు అలవాటుగా మారింది. ఆంక్షలు, సుంకాలు విధించడం, బెదిరించడం పరిపాటిగా మారింది. తాజాగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే, 500 శాతం పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ తన కనుసన్నల్లో ఉండాలన్నది అమెరికా కోరిక. అందుకు అవసరమైన అన్ని కుయుక్తులు పన్నుతోంది. దేశాల అంతర్గత విషయాల్లో వేలుపెడుతూ వాటిని కంట్రోల్‌ చేస్తోంది. ఇజ్రాయిల్‌ను అడ్డం పెట్టుకుని పాలస్తీనాపై దాడికి తెగించింది. ఇరాన్‌, ఖతార్‌లపైనా విరుచుకు పడింది. ఏకంగా రాజకీయంగా దేశాల పాలకులనే మార్చేస్తోంది. ఒక్క భారత్‌లోనే అది సాధ్యం కాలేదు. చైనాలో సాధ్యం కాదు. విభిన్న మతాలు, కులాల సమాహారమైన భారత్, అతి పెద్ద ప్రజాస్వామ్యం కావడంతో ఇక్కడ దాని పప్పులు ఉడకడం లేదు.
బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో అమెరికా పరోక్ష పాత్ర ఉంది. పాక్‌ను దువ్వుతున్నది. నేపాల్‌లో గొడవలు సృష్టించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది. వీసాలపై కఠిన నిబంధలను పెట్టింది. బంగ్లాదేశ్‌ అంతర్గత అలజడుల వెనక అమెరికా హస్తం ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇతర దేశాల్లో వేలు పెట్టడం వల్ల తాము చాలా నష్టపోయామని అమెరికా ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ తులసీ గబ్బార్‌ ఆమధ్య అంగీకరించడం, అమెరికా వైఖరిని స్పష్టం చేస్తున్నది.
బంగాదేశ్‌లో హసీనాను గద్దె దించడం, యూనస్‌ను గద్దెనెక్కించడం చకచకా జరిగి పోయాయి. ఇప్పుడు హసీనాకు ఉరిశిక్షను కూడా విధించారు. రెండు దశాబ్దాల క్రితం రసాయన ఆయుధాల పేరుతో ఇరాక్‌పై దాడిచేసి అక్కడ సద్దాం హుస్సేన్‌ ప్రభుత్వాన్ని అమెరికా గద్దె దింపింది. సద్దాంను బంధించి, ఉరితీసే వరకు నిద్రపోలేదు. సరిగ్గా ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతున్న తీరు కూడా ఇరాక్‌ను పోలివుంది. హసీనా భారత్‌కు అనుకూలంగా ఉండడాన్ని అమెరికా జీర్ణించుకోలేదని అర్థం అవుతోంది. అయితే, పదవీచ్యుతురాలయ్యాక, హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు. ఇప్పుడామె మరణశిక్షకు అర్హురాలని అక్కడి ట్రిబ్యునల్‌ నిర్ణయించింది. ముగ్గురు సభ్యుల ఈ ట్రిబ్యునల్‌ హసీనా ఎన్నో దుర్మార్గాలకు పాల్పడిందని ఏకరువు పెట్టింది. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నవారిని కాల్చిపారేయమని ఆదేశించారని, డ్రోన్లు, హెలికాప్టర్లు ఉపయోగించి మరీ నిరసనకారులపై మారణాయుధాలతో విరుచుకుపడమని భద్రతాబలగాలను ఒత్తిడి చేశారని న్యాయమూర్తులు తేల్చారు. అధికారంలో కొనసాగడానికి అత్యంత అమానుషంగా ప్రవర్తించారంటూ, తీవ్రంగా గాయపడిన నిరసనకారులను సకాలంలో ఆస్పత్రికి తరలించడానికి కూడా భద్రతాదళాలు నిరాకరించాయని న్యాయమూర్తులు ప్రకటించారు. తీర్పు ఇవ్వడంలో జాప్యం జరిగినందుకు క్షమించమని కూడా ఒక న్యాయమూర్తి అన్నారు. తీర్పు వెలువడగానే, యూనిస్‌ ప్రభుత్వం హసీనాను తమకు అప్పగించమని డిమాండ్‌ చేశారు.
సరిగ్గా యాభైయేళ్ళక్రితం జరిగిన సైనిక కుట్రలో తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులను కోల్పోయి, ఆరేళ్ళపాటు భారత్‌లో ఇందిర నీడన తలదాచుకొని, తిరిగి స్వదేశంలో కాలూని అధికారాన్ని చేజిక్కించుకున్న హసీనా గతం ఇప్పుడు అందరికీ గుర్తుకువస్తోంది. జియావుర్‌ రహ్మాన్‌ భార్య ఖలీదా జియా మీద అలుపెరగని, సాహసోపేత పోరాటాలు చేశారు. ఆధిపత్య పోరాటంలో ముజబూర్‌ రహ్మాన్‌ కుమార్తె హసీనా పైచేయి సాధించారు. ఖలీదా సహా బీఎన్పీ అధినాయకుల నిర్బంధాలు, ఆ పార్టీకి అండగా ఉన్న జమాతే వంటే ఇస్లామిక్‌ ఛాందసశక్తులను అధికారికంగానూ, అనధికారికగానూ హసీనా చీల్చిచెండాడారు. హసీనా పాలనలో బంగ్లాదేశ్‌ వేగంగా వృద్ధి చెందింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తయ్యాయి, పేదరిక నిర్మూలనలోనూ మంచిపేరు తెచ్చుకుంది. తనకు వ్యతిరేకంగా సాగిన విద్యార్థి ఉద్యమంపట్ల హసీనా నిర్దయగా వ్యవహరించారన్నదీ వాస్తవమే. ఆ తరువాత ఆమె దిగివచ్చినా, అప్పటికే పరిస్థితి చేజారింది. రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమం తన లక్ష్యాన్ని సాధించుకున్న తరువాత నిజానికి చల్లారినా, స్వల్పకాలంలోనే తిరిగి రాజుకోవడం వెనుక జమాత్‌ ఇస్లావిూ, బీఎన్పీ ఉండటంతో ఆమె కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని అంటారు.

పాక్ ఒత్తిడి కారణంగా అమెరికా, దాని మిత్రదేశాలు కొన్ని ఆమెకు పూర్తి వ్యతిరేకంగా వ్యహరించాయి. ఆమె పారిపోయి భారత్ కు వచ్చిన తరువాత, బంగ్లాదేశ్‌లో సాగిన పరిణామాలన్నీ ఆమె పట్ల ఏయే శక్తులు ఏ లక్ష్యాల కోసం కత్తికట్టాయో తేటతెల్లం చేస్తున్నాయి. గృహనిర్బంధంలో ఉన్న ఖలీదా విదేశీ చికిత్సతో ఎన్నికలకు సిద్ధపడటం, వేలాదిమంది జమాత్‌ యోధులు జైళ్ళ నుంచి బయటకు రావడం, ముజబూర్‌ రహ్మాన్‌ విగ్రహాలను మాత్రమే కాదు, ఆయన ఆధ్వర్యంలో సాగిన విముక్తి పోరాటాన్ని సైతం చరిత్ర నుంచి చెరిపేయడం, అప్పట్లో ఊచకోత కోసిన పాకిస్తాన్‌ను ఘనంగా కీర్తిస్తూ. ఊరేగించడం చూస్తూనే ఉన్నాం.
పాక్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ను, బంగ్లాదేశ్‌ను ఎగదోయడం వెనక అమెరికానే ఉన్నదన్నది సుస్పష్టం. ఇప్పటికే హసీనాను అప్పగించాలని యూనిస్‌ ప్రభుత్వం పలు మార్లు కోరుతూ వచ్చింది. ఇప్పుడు ఉరిశిక్ష విధించారు. కనుక భారత్‌ మీద ఒత్తిడి పెంచేందుకు మరో ఆయుధం అందివచ్చింది. ఇదంతా అమెరికా ఆడిస్తున్న నాటకమని తెలుసుకోవడానికి పెద్దగా తెలివి తేటలు అక్కర్లేదు.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News