Friday, April 10, 2026
36.2 C
Hyderabad

భారత భద్రత, భవితవ్యం భవ్యమేనా!?|EDITORIAL

ఒక దేశంగా భారత్ భద్రమేనా? భారత్ భవితవ్యం భవ్యంగా ఉన్నట్లేనా? దేశ విచ్ఛిన్నమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. మరి దేశాన్ని మతపరంగా విభజించే కుట్రలేమైనా సాగుతున్నాయా? మన పక్కనే ఉన్న పాక్ పక్కలో బల్లెంలా తయారైంది. స్వాతంత్ర్య భిక్ష పెట్టిన భారత్ పైనే బంగ్లాదేశ్ కయ్యానికి కాలుదువ్వుతోంది. తాజాగా డిల్లీ బాంబు పేలళ్ళ కుట్ర టర్కీ నుంచి జరిగింది. ఫరీదాబాద్ ఉగ్ర కార్యకళాపాలకు వేదికైంది. దేశంలో ఢిల్లీ సహా హైదరాబాద్, బెంగళూరు, కశ్మీర్ అనేక నగరాల్లో ఉగ్రమూలాలు వెల్లడవుతున్నాయి. మైనార్టీ యూనివర్సిటీలు ఉగ్రవాదుల తయారీ కేంద్రాలవుతున్నాయి. ప్రాణాలు పోసే వైద్య విద్యనభ్యసించిన వాళ్ళే ప్రాణాలు తీసే మానవ బాంబర్లవుతుంటే దేశం ఎటుపోతోంది? మనిషి ప్రయాణం ఎటు సాగుతోంది? మతం మానవత్వాన్ని మింగేస్తోందా? సర్వమానవ హితం, సర్వమానవ హతంగా మారుతోందా? ఏమైపోతోంది మన భారతదేశం?

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ 

ఒక దేశంగా భారత్ భద్రమేనా? భారత్ భవితవ్యం భవ్యంగా ఉన్నట్లేనా? దేశ విచ్ఛిన్నమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. మరి దేశాన్ని మతపరంగా విభజించే కుట్రలేమైనా సాగుతున్నాయా? మన పక్కనే ఉన్న పాక్ పక్కలో బల్లెంలా తయారైంది. స్వాతంత్ర్య భిక్ష పెట్టిన భారత్ పైనే బంగ్లాదేశ్ కయ్యానికి కాలుదువ్వుతోంది. తాజాగా డిల్లీ బాంబు పేలళ్ళ కుట్ర టర్కీ నుంచి జరిగింది. ఫరీదాబాద్ ఉగ్ర కార్యకళాపాలకు వేదికైంది. దేశంలో ఢిల్లీ సహా హైదరాబాద్, బెంగళూరు, కశ్మీర్ అనేక నగరాల్లో ఉగ్రమూలాలు వెల్లడవుతున్నాయి. మైనార్టీ యూనివర్సిటీలు ఉగ్రవాదుల తయారీ కేంద్రాలవుతున్నాయి. ప్రాణాలు పోసే వైద్య విద్యనభ్యసించిన వాళ్ళే ప్రాణాలు తీసే మానవ బాంబర్లవుతుంటే దేశం ఎటుపోతోంది? మనిషి ప్రయాణం ఎటు సాగుతోంది? మతం మానవత్వాన్ని మింగేస్తోందా? సర్వమానవ హితం, సర్వమానవ హతంగా మారుతోందా? ఏమైపోతోంది మన భారతదేశం?

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బాంబులు పేలి 13 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు కావడం అత్యంత విషాదకరం. ఈ ఒక్క ఘటన అనేక కుట్రలను వెలుగులోకి తెస్తున్నది. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు మారణహోమానికి తెగిస్తున్నాయన్నది తేలిపోయింది. నీరు, ఆహార పదార్థాల్లో విషం కలిపి చంపాలని కుట్రలు చేసిన తీరు విస్మయం కలిగించకమానదు. దర్యాప్తు సంస్థలు కూపీ లాగుతున్నాకొద్ది అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. అఖండ భారత్‌ నుంచి విడివడ్డ పాక్‌, బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మతం ముసుగులో మారణహోమం చేయాలనుకున్న వారిని ఏరిపారుయడం వినా మరో మార్గం లేదు.
ఢిల్లీ పేలుళ్ల కుట్రలను ఛేదించి, శోధించిన కొద్దీ ఉగ్ర కుట్రలనేకం వెల్లడవుతున్నాయి. తుర్కియేలోని ’ఉకాసా’ అనే హ్యాండ్లర్‌తో ఈ మాడ్యూల్‌ టచ్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు కనుగొన్నాయి. ఉకాసా అంటే అరబిక్‌లో స్పైడర్‌. ఫరీదాబాద్‌ మాడ్యుల్‌, ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌తో పాటు అన్సర్‌ ఘజ్‌వత్‌ ఉల్‌ హింద్‌ అనే సంస్థల నిర్వాహకులకు ఉకాసాతో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో డాక్టర్‌ ఉమర్‌తో పాటు అతడి సహచరులు ఈ ఉకాసా హ్యాండ్లర్‌తో సంభాషించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. డాక్టర్‌ ఉమర్‌ తో సహా పలువురు 2022లో తుర్కియేలో పర్యటించినట్లు అధికారులు గుర్తించారు. అంకారాలో వారు రెండు వారాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ హ్యాండ్లర్‌ కూడా అంకారాలో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచే ఈ గ్రూప్‌ను నడపడంతో పాటు వారికి నిధులు కూడా సమకూర్చినట్లు భావిస్తున్నారు. భారత్‌లో బహుళ పేలుళ్లకు రూపొందించిన మాడ్యూల్‌ ప్రణాళిక వెనుక ఉకాసా కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. హ్యాండ్లర్లతో చర్చించేటప్పుడు నిఘా వర్గాలకు దొరకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మాడ్యూల్‌ వెనుక ఓ విదేశీ గ్రూప్‌ పనిచేస్తుందని స్పష్టంగా తెలుస్తోందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఈ నెట్‌వర్క్‌ కార్యకలాపాల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు నిందితులు చేసిన చాట్‌, కాల్‌ హిస్టరీలను అధికారులు ఛేదిస్తున్నారు. ఉకాసా ను గుర్తించడంతో పాటు అతడికి పాక్‌ ఉగ్రవాద నిర్వాహకులతో ఉన్న సంబంధాల గురించి తెలుసు కునేందుకు విదేశీ నిఘా సంస్థల సహకారం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా నాలుగు కీలక ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరపాలని నిందితులు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఒక కొత్త, మరో రెండు పాత కార్లను కూడా సిద్ధం చేయాలని వారు ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఇందులో ఐ20 కారులోనే ఎర్రకోట వద్ద పేలుడు జరగ్గా.. ఎకోస్పోర్ట్‌ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా రెండు కార్ల కోసం అన్వేషణ కొనసాగుతోంది.

ఈ ప్లాన్‌ను అమలు చేసేందుకు 8 మందిని సిద్ధం చేసినట్లు వారి డైరీల సమాచారంతో అధికారులు గుర్తించారు. ఒక్కో ప్రాంతానికి ఇద్దరు చొప్పున వెళ్లి పేలుళ్లు జరపాలని వీరు పన్నాగం. ఈ ఎనిమిది మందిలో ఉమర్‌, ముజమ్మిల్‌తో పాటు డాక్టర్‌ అదిల్‌, డాక్టర్‌ షాహీన్‌ కూడా ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. దిల్లీ పేలుడు ఘటన పై దర్యాప్తు చేపట్టిన అధికారులు హరియాణాలోని ఫరీదాబాద్‌లో గల అల్‌ ఫలా యూనివర్సిటీని జల్లెడ పడుతున్నారు. ఇక్కడి మెడికల్‌ కాలేజీలోని బాయ్స్‌ హాస్టల్‌ లోని 17వ నంబర్ భవనం ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఇజ్రాయెల్‌ తదితర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున మారణహోమం జరిగింది. ఇప్పుడు భారత్‌లో వారు ఆడిన ఆటలు సాగకపోవడం వల్లే ఈ దాడులకు తెగిస్తున్నారు. కశ్మీర్‌లో నెలకొన్న ప్రశాంతను చెదరగొట్టారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా అలాగే చేయాలనుకుంటున్నారు.

దేశంలో అక్రమ వలసల నివారణకు గట్టి చర్యలేమీలేవు. పైగా అలాంటి వారికి ఓటర్, గుర్తింపులు అలవోకగా లభిస్తున్నాయి. దేశం వీడి వెళ్లే, వచ్చే వాళ్ళపై తగిన నిఘా లేదు. విదేశీ సరిహద్దులు దాటి మన దేశంలోనే ఉగ్రమూలాలు వేళ్ళూనుకుంటుంటే అరికట్టే విధానాలేవీ లేవు. నిఘా వర్గాలు విఫలమైనప్పుడల్లా ఢిల్లీ పేలుడు లాంటి ఘటనలు సంభవిస్తూనే ఉన్నాయి. అప్పుడే అప్రమత్తత. ఆతర్వాత మళ్ళీ ఘటన జరిగేదాకా మొద్దు నిద్ర. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంలో రక్షణ, భద్రతపై కఠిన నియమ నిబంధనలు తప్పనిసరి. అందుకు తగిన విధి విధానాలు రూపొందించి అమలు చేయాలి. ప్రపంచానికి శాంతిని నేర్పిన దేశంలో అశాంతి రగలకుండా చూడాల్సిన బాధ్యత పాలకులది. అందుకు సంపూర్ణ సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలది, ప్రజలది.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News