Friday, April 10, 2026
36.2 C
Hyderabad

దేశానికి దిశానిర్దేశంగా బీహార్ ఎన్నికలు!|EDITORIAL

ఎన్నికలంటే ఆర్భాటాలు, ప్రచార పటాటోపాలే కాదు, మేనిఫెస్టోలు, హామీలు కూడా. అమలు చేయలేని, అలవికాని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఎన్నికల్లో హల్ చల్ చేస్తుంటాయి. ఓట్ల కోసం ఏ ఫీట్లయినా చేసే, మన రాజకీయ పార్టీలు, నేతలు, ఉచిత పథకాలు, సబ్సిడీలతో ప్రజల్ని ప్రలోభ పెడుతుంటారు. తాయిలాలు ప్రకటించి, తిలాపాపం తలా పిడికెలా ప్రజా ధనాన్ని దోచేస్తుంటారు. మన దేశంలో ఓట్ల పండుగ అంటే నోట్ల పండుగే!

ఎన్నికల్లో పార్టీల, రాజకీయ నాయకుల ఎజెండాలను నిర్దేశించే స్థాయిలో ప్రజలుండాలి. తమకిచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి నాయకులను నిలదీయాలి. ఒక్కసారి నోటుకు తలొగ్గితే, ఐదేళ్ళు మనం ఎన్నుకున్న నేతకు తలొగ్గాల్సి వస్తుంది. దేశంలో వనుకబడ్డ రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. అయితే బీహార్ లో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రంజుగా సాగుతున్నాయి. ఓట్ల చోరీ, దొంగ ఓట్ల చేరికల ఆరోపణలతో వచ్చిన ఈ ఎన్నికలు బీహార్ తోపాటు, దేశ భవితవ్యాన్ని ప్రభావితం చేయనున్నాయి. అందుకే ప్రజలు అత్యంత జాగరూకతతో ఓట్లు వేయాలి. తాయిలాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓట్లు వేసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది.

బీహార్‌లో పదేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వమే నడుస్తోంది. నితీశ్‌ సిఎంగా పెద్దగా చేసిందేమీ లేదు. అంతుకుముందు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా తమ కుటుంబ సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్‌ మొదటి నుండి రాజకీయంగా చురుకుగా ఉండే రాష్ట్రంగా గుర్తింపు పొందింది. కళింగ రాజ్యమైన బీహార్‌ ను పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని మౌర్యులు పాలించారు. చాణక్యుడు అక్కడే ఉండేవారు. నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ప్రపంచానికి మార్గం చూపింది. ఇలాంటి నేల బీహార్‌లో ఇప్పుడు అరాచకం రాజ్యమేలుతోంది.

రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన నేల. అక్కడ చోటుచేసుకునే పరిణామాలు అనేక సందర్భాలలో దేశ వ్యాప్తంగా ప్రభావం చూపాయి. దేశ రాజకీయాలకు దిశా నిర్దేశం చేశాయి. బీహార్‌కు చెందిన జయప్రకాశ్‌ నారాయణ్‌ జనతా పార్టీని స్థాపించి దేశ రాజకీయాలను మలుపు తిప్పారు. ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఆ రాష్ట్రానికే కాకుండా దేశానికే కీలకంగా మారాయి. మరోమారు అధికారం కోసం ఎన్డీఏ ఎత్తులు వేస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఎన్నో అడ్డదారులు తొక్కుతోంది. హడావుడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సవరణ -సర్‌తో ఎన్నికల కమిషన్‌ స్వతంత్రత ప్రశ్నార్థకం గా మారింది. పెద్దఎత్తున ఓట్‌ చోరీ ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటికి జవాబిచ్చి, సందేహాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల కమిషన్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలపై దాడికి దిగుతోంది.

అయితే బీహార్ లో బంగ్లాదేశ్ చొరబాటుదారుల సమస్య కూడా తీవ్రంగా ఉంది. కొనసాగుతున్న నిరసనల మధ్యే ఓటర్ల తుది జాబితాను, ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం 243 మంది సభ్యులు గల బీహార్‌ శాసనసభకు నవంబర్‌ 6, 11 తేదీలలో పోలింగ్‌ జరగనుంది. 14వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు ఈసీ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాపై కూడా దుమారం రేగుతోంది. ఈ జాబితాలోని చేర్పులు, తొలగింపులకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు అందచేయడంతో పాటు, వాటిని క్షేత్రస్థాయి వరకు ప్రదర్శించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.

ఓట్ల తొలగింపు ఆరోపణలు చేస్తున్న రాహుల్‌ వాటిని రుజువు చేయడంలో విఫలమయ్యారా? సుప్రీం కూడా తొలగించిన ఓట్లకు సంబంధించి రుజువులతో అఫిడవిట్‌ వేయాలని సూచించినా అది ముందు పడలేదు. మరోవైపు ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నితీష్‌ ఇప్పటికే 9సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పదోసారి కూడా ఆ పదవిని ఆయన ఆశిస్తున్నారు. బీజేపీ నేతలు ఆ విషయాన్ని తేల్చకుండా రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలకు మాత్రం నితీష్‌ను పూర్తి బాధ్యుడిని చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఓటర్లను మభ్య పెట్టే కుతంత్రాలకు తెరతీస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ తరహా విన్యాసాలు మరింత జోరందుకోనున్నాయి.

2020లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కేవలం 0.2 శాతం ఓట్ల ఆధికత్యతను మాత్రమే సాధించింది. దీంతో త్వరలో జరగనున్న ఎన్నికలలో వ్యతిరేక ఓటు కీలకంగా మారనుంది. అదే సమయంలో ప్రతిపక్షాల మధ్య మరింత ఐక్యత రావాల్సి ఉంది. గత ఎన్నికల్లో చోటు చేసుకున్న తప్పులు మరోసారి జరగకుండా చూసుకోవడంతో పాటు, ప్రజలకు నమ్మకం ఇయ్యవలసిన బాధ్యత ప్రతిపక్షాలదే!

అధికారమే పరమావధిగా అన్ని పార్టీలు విన్యాసాలు చేస్తున్నాయి. తాజాగా 7.42 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. బీహార్‌ అభివృద్ధికి ఏం చేస్తారన్న దానిపై రాజకీయ పార్టీల్లో స్పష్టత లేదు. కేవలం ఓట్లు కొల్లగొట్టి కుల్లుగుత్తగా అధికారం దక్కించుకోవడం అందరిపనిగా మారింది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేతల కుయుక్తులను గమనించాలి. తమ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News