Friday, April 10, 2026
36.2 C
Hyderabad

అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే!|EDITORIAL

ఒకప్పుడు రాజకీయమంటే సేవ. సిద్ధాంతాలు. ఇప్పుడు రాద్ధాంతాలు. రాక్షసంగా జనానికి కీడు చేయడమే రాజకీయంగా మారిపోయింది. అధికారాన్ని, పదవులను పొందడమంటే, ఎలాగైనా వాటిని గుంజుకోవడంగా మారింది. అందుకు ఎంతకైనా తెగించడం, ఎంతటి నీచానికైనా ఒడిగట్టడంగా మారింది. రీతి, నీతి, జాతి, నిజాయితీ లేకుండా పోయింది.

ఇప్పుడు రాజకీయ నేతలు అధికారం, పదవులుంటేనే పెదవులు విప్పుతున్నారు. లేకపోతే గోతులు తవ్వుతున్నారు. అధికారం రాకపోతే, అది ప్రజల తప్పు. వస్తే మన గెలుపుగా బాహాటంగా జబ్బలు చరుచుకుంటున్నారు. పార్టీలు, ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలకతీతంగా ఈ దుస్థితి పరివ్యాప్తమై, విపరీతమై, విశృంఖలమై వికృత వికటాట్టహాసం చేస్తోంది.
పార్టీ ఏదైనా వాటి చరిత్రంతా ఒక్కటే! అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే!! ‘డా.మార్గం-అడుగు’ ఎడిటోరియల్

రాజకీయాలంటేనే అధికారం, పదవులు పొందటం. ఒకప్పుడు వాటిని పొందడానికి కొన్ని విలువలుండేవి. నైతిక పద్ధతులను పాటించేవారు. మాట మీద నిలబడేవారు. ఆడిన మాట తప్పేవారు కాదు. నమ్మకంగా ఉండేవారు. ప్రజలే కేంద్రంగా ఆలోచించేవారు. అభివృద్ధే పరమావధిగా పని చేసేవారు. అనైతిక పనులకు, బంధుప్రీతి, అవినీతికి దూరంగా మసలేవారు. తాము నిర్వహించే శాఖల్లో అవినీతి జరిగితే, తాము నైతిక బాధ్యత వహిస్తూ ఆ పదవులను త్యజించేవారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీ ఏ పదవీని వద్దన్నారు. వద్దన్నా ఇచ్చిన పదవికి రాజీనామా చేసిన ఘనత మన రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ ది. ఎక్కడో రైలు పట్టాలు తప్పితే, ఆ తప్పిదాన్ని తనదిగా చెప్పి, రాజీనామా చేసిన నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మన లాల్ బహదూర్ ది. కేవలం ప్రత్యేక తెలంగాణ సిద్ధాంతానికి కట్టుబడి, ఉన్న మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణ వచ్చే వరకు ఏ పదవినీ స్వీకరించనని చేసిన శపథాన్ని చివరికంటా నిలబెట్టుకున్న నిట్టనిలువు నిజాయితీ మన కొండా లక్ష్మణ్ బాపూజీది.

కాలం మారింది. అంతా రివర్స్ అయింది. భూతద్దం పెట్టి వెతికినా, ఇప్పుడు గాంధీలు, అంబేద్కర్ లు, లాల్ బహదూర్ లు, లక్ష్మణ్ బాపూజీలు కనిపించడం లేదు. వారి ఆనవాళ్ళను కూడా లేకుండా చేసి, అమాంతం మింగే గుంట నక్కలు రాజకీయాల్లోకి ప్రవేశించాయి. ఒకప్పుడు రాజకీయమంటే సేవ. సిద్ధాంతాలు. ఇప్పుడు రాద్ధాంతాలు. రాక్షసంగా జనానికి కీడు చేయడమే రాజకీయంగా మారిపోయింది. అధికారాన్ని, పదవులను పొందడమంటే, ఎలాగైనా వాటిని గుంజుకోవడంగా మారింది. అందుకు ఎంతకైనా తెగించడం, ఎంతటి నీచానికైనా ఒడిగట్టడంగా మారింది. రీతి, నీతి, జాతి, నిజాయితీ లేకుండా పోయింది.

ఇప్పుడు రాజకీయ నేతలు అధికారం, పదవులుంటేనే పెదవులు విప్పుతున్నారు. లేకపోతే గోతులు తవ్వుతున్నారు. అధికారం రాకపోతే, అది ప్రజల తప్పు. వస్తే మన గెలుపుగా బాహాటంగా జబ్బలు చరుచుకుంటున్నారు. పార్టీలు, ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలకతీతంగా ఈ దుస్థితి పరివ్యాప్తమై, విపరీతమై, విశృంఖలమై వికృత వికటాట్టహాసం చేస్తున్నాయి.

ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌, తనకు విపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానుపో అంటున్నారు. చివరకు హైకోర్టు కడప తొక్కారు. ఐదేళ్లు సీఎంగా పనిచేసిన ఆయనకు నిబంధనలు తెలియకపోవడం సిగ్గుచేటు. ఇదేం దేబురింపు? ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తేనే కాదా ప్రమోషన్ దొరికేది? పైగా గురువింద గింజ తన నలుపెరనట్లు, ఎదుటి పార్టీని ఎలా దిబ్బతీయాలా అన్నదే ఇప్పుడు అన్ని పార్టీల ప్రథమ కర్తవ్యంగా మారింది. అధికారంలో ఉంటే అక్రమాలకు పాల్పడడం, ఆస్తులు కూడబెట్టుకోవడం, ఓడితే ఎదుటి పార్టీని విమర్శించడం అలవాటు చేసుకున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. మొగున్ని కొట్టి మొగసాలకెక్కినట్లు, పార్టీల వ్యవహారాలుంటున్నాయి. అధికారం ఉన్నంత కాలం దోచుకోవడం, దాచుకోవడం, దివాలా తీయించడం చివరకు దొంగే, దొంగా దొంగా అని అరచినట్లుగా నానా యాగీ చేసేయడం, అబద్ధాలను పదే పదే చెప్పి, నిజాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తూ, ఎదుటి పార్టీలపై, ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నాయి. దీనికి పార్టీలు, నేతలు, ఎవరూ మినహాయింపు కాదు.

ఇందులో భాగమే పార్టీ పిరాయింపులు, అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి మించి, చేస్తున్న ఫిరాయింపులు అన్ని పార్టీలను ముంచే స్థాయికి చేరాయి. ఎంతటి నేతలైనా అధికార పార్టీల్లో చేరడానికి ఎంత మాత్రం సిగ్గుపడటం లేదు. రాజకీయ, సిద్ధాంత నిబద్దతలేవీ లేవు. అభివృద్ధి కోసమే అంటే చాలు అన్నీ మాఫీ అనుకుంటున్నారు. నేతలకు పార్టీలు, ప్రజలపై విశ్వాసం కన్నా, పదవులపైనే వ్యామోహం ఎక్కువగా ఉందనడానికి తాజా రాజకీయాలే ఉదాహరణ.

గతంలో కాంగ్రెస్ సృష్టించిన ‘ఆగస్టు సంక్షోభాల’కు లెక్కలేదు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం పేరుతో కాంగ్రెస్ కంటికి నిద్రలేకుండా చేసి, ఏకంగా టీడీపీని విలీనం చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ ది. ఇక ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ మారిన తన 10 ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాకుండా, బర్తరఫ్ కోసం పట్టపడుతున్నది. ఏదైనా తనదాకా వస్తే కానీ.. అన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి ఉంది. బీజేపీ కూల్చిన విపక్ష రాష్ట్రాల ప్రభుత్వాల లెక్క ఆ పార్టీ కూడా చెప్పలేదు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ… పార్టీ ఏదైనా వాటి చరిత్రంతా ఒక్కటే! అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే!!

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News