Friday, April 10, 2026
36.2 C
Hyderabad

అప్పుల ఊబీ నుంచి గట్టెక్కడం ఎలా!?|EDITORIAL

2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరగి, ఏపీ- తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావం తర్వాత రెండు రాష్ట్రాలు కూడా భారీ అప్పుల్లో కూరుకుపోయాయి. 2014-15లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర లోటు రూ.16వేల కోట్లుగా కాగ్‌ తేల్చింది. ఒకవైపు ఆదాయ మార్గాలు పెరుగుతున్నా, అంతకంతకూ పెరుగుతున్న ఉద్యోగులు, పాలకుల జీత భత్యాలు, సంక్షేమ పథకాలు రాష్ట్రాలకు పెను భారంగా మారుతున్నాయి. విధానాల లోపాలు, ఆదాయ సముపార్జనలో వ్యూహాత్మక తప్పిదాలు, అనుత్పాదక రంగాల్లో పెట్టుబడులు, అమలుకు అలవికాని ఉచిత సంక్షేమ పథకాలు, అన్నీ కలిసి తడిసి మోపెడవుతున్నాయి. చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి దాపురించడానికి కారణం పాలకుల, అధికారుల అసమర్థతే. ఈ పరిస్థితిలో రాష్ట్రాలు అప్పుల ఊబీ నుంచి గట్టెక్కడం ఎలా? వ్యూహాత్మక పరిష్కారాలు ఏంటి?

ప్రస్తుతం ప్రభుత్వమే బడ్జెట్ లో చెప్పిన విధంగా తెలంగాణ అప్పు భారం రూ.6.85 లక్షల కోట్లు. ఇది రాష్ట్ర జీడీపీకి 26.2%. సమానం. అప్పుల్లో ఎక్కువగా మంచినీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాలు, వడ్డీ భారాలు, జీత భత్యాలు, పెన్షన్లు, రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల ఖర్చులే ఎక్కువ. బడ్జెట్ లో సగం జీత భత్యాలకుపోను, రూ.56వేల కోట్లు సంక్షేమ పథకాలకే ఖర్చవుతున్నాయి. 2024 25 లో తెలంగాణ ఆదాయాల్లో 78% స్వంత వనరుల నుంచి వస్తోంది, మిగతా 22% కేంద్రం నుండి వస్తోంది. అందులో రాష్ట్రానికికు పన్నుల వాటాగా 12%, గ్రాంట్ల రూపంలో 10% నిధులు వస్తున్నాయి.
ఏపీ లో అప్పులు రూ.4.86 లక్షల కోట్లు. ఇది రాష్ట్ర జీడీపీకి 34.7% కు సమానం. ఇందులో ఉచిత, సంక్షేమ పథకాలకు 55వేల కోట్లు ఖర్చవుతున్నాయి. దీనికి గత ప్రభుత్వాల అధిక ఖర్చులు, ప్రాజెక్టుల మేనేజ్‌మెంట్ లోపాలు, ఆదాయ వృద్ధి తక్కువ ఉండటం, కేంద్ర సాయం గ్రాంట్లు తక్కువగా అందడం కారణాలు. 2023 24 లో ఆంధ్రప్రదేశ్ కు మొత్తం ఆదాయాల్లో 57% స్వంత వనరుల నుంచి, మిగతా 43% కేంద్రం నుండి వస్తోంది. అందులో రాష్ట్రానికి పన్నుల వాటాగా 20%, గ్రాంట్ల రూపంలో 23% నిధులు వస్తున్నాయి.

తాజాగా తెలంగాణ 16వ ఫైనాన్స్ కమిషన్ ముందు అప్పులను పునర్వ్యవస్థీకరించాలని, వడ్డీ తగ్గింపు, చెల్లింపు ప్రీమియం తగ్గించాలని కేంద్రాన్ని కోరింది. కొన్ని అప్పులను కమర్షియల్ కాని బ్యాంకులకు బదలాయించాలని కూడా కోరింది.

అలాగే, ప్రస్తుత రాష్ట్రాల ఆదాయంలో కేంద్రం వాటా 41% ఉన్నా, తెలంగాణ ఆ పన్నుల వాటాను 50%కి పెంచాలని కోరుతోంది. ఇందువల్ల రాష్ట్రాలకు స్వతంత్ర వ్యయం నిలుపుకోవడానికి అవకాశాలు మెరుగవుతాయి. కేంద్ర పథకాలను రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా అమలు చేసే స్వేచ్ఛని కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, సహాయ నిధులు అనుకున్న స్థాయిలో రాష్ట్రాలకు చేరడం లేదు.
అయితే, ఇవన్నీ కలిసి రాష్ట్రాలకు పెను సవాళ్ళను విసురుతున్నాయి. అప్పుల పెరుగుదల సంక్షేమ పథకాలపై అధిక ప్రభావం చూపుతున్నాయి. ప్రాజెక్టుల్లో ఖర్చు పెరిగిపోవటం, వాటిని బడ్జెట్ లో స్పష్టంగా తెలపడకపోవటం. ఆదాయ వృద్ధి తక్కువగా ఉండటం, ఉత్పాదకత, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి ఆలస్యం కావటం. పన్నుల వసూలు, ప్రభుత్వ ఆస్తులను వదిలేయడం, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత లోపాలు ఉండటం వంటి సమస్యలు అనేకం ఉత్పన్నం అవుతున్నాయి.

మరి వీటి పరిష్కార మార్గాలు ఏమిటి? అంటే రాష్ట్రాలు తమ ఖర్చులను నియంత్రించుకోవాలి. దినసరి వేతనాలు, సామాజిక రంగ పంపిణీ పథకాలను సమీక్షించాలి. కొన్ని ఉచిత పథకాలు ప్రభుత్వానికి పెను భారాన్ని కలిగిస్తున్నాయి. ఆదాయ వృద్ధికి అవసరమైన పెట్టుబడులు పెంచుకోవాలి. పన్నుల వసూలును సరళం చేయాలి. ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడం కాకుండా, వాటిని, ఇతర వనరులను సమర్ధవంతంగా వినియోగించాలి. ఆయా పథకాలను పున: పరిశీలించాలి. ప్రతి పథకం లాభ నష్టాలను బేరీజు వేయాలి. నష్టం చేసే పథకాలకు తిలోదకాలివ్వాలి. ప్రభుత్వ పథకాలు, ఆదాయ వ్యయాల్లో పారదర్శకతను పాటించాలి. ప్రతి పథకానికి ఆడిట్ ఉండాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సహాయం సహా, ఆర్థిక సంక్షేమ నివేదికలు రూపొందిస్తూ దశల వారీగా అప్పులను తగ్గించుకునే ప్రణాళికలు రూపొందించుకోవాలి. కేంద్ర గ్రాంట్లు, ప్యాకేజీలు రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం చూపేవిగా ఉండాలి. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే, కేంద్ర సహాయం, ప్యాకేజీలు పెరిగి, పన్నులు తగ్గి పురోగతికి ఆస్కారం ఏర్పడుతుంది.

అప్పులు అధికమైతే, అది రాష్ట్రాల ఆర్థిక స్వతంత్రతను దెబ్బతీస్తాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజలకు పార్టీలిచ్చే వాగ్దానాలు ప్రశ్నార్థకమవుతాయి. కేంద్రం ఇచ్చే సహాయం తాత్కాలికమే. దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు స్వీయ సామర్థ్యాన్ని పెంచుకోవాలి.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News