Friday, April 10, 2026
36.2 C
Hyderabad

యమపాశంగా ఆయిల్ గ్యాస్ బ్లోఅవుట్లు!|EDITORIAL

గోదావరి పరవళ్లు, పచ్చటి ప్రకృతి అందాలతో విరాజిల్లే కోనసీమ గత కొన్ని దశాబ్దాలుగా చమురు, సహజవాయు అన్వేషణలతో నిత్య భయాల మధ్య జీవిస్తోంది. ఓఎన్‌జీసీ అడుగుపెట్టిన నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి కన్నా ప్రమాదాలనే ఎక్కువగా చూశారు. పొలాల్లో, ఇళ్ల మధ్య, కాళ్ల కింద ఎప్పుడు పేలుతాయో తెలియని ఆయిల్‌, గ్యాస్‌ పైపులైన్లు, కోనసీమ ప్రజల జీవితంలో శాశ్వత ఆందోళనగా మారాయి. 30ఏళ్ళ క్రితం పాశర్లపూడి బ్లోఅవుట్‌ గానీ, తాజా ఇసుమండ బ్లోఅవుట్‌ గానీ, నేర్పుతున్న పాఠం ఒక్కటే. అభివృద్ధి ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే, ఆ మంటలు తరతరాల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆయిల్, గ్యాస్, అభివృద్ధి ఏదైనా మానవ మనుగడకే తప్ప, మానవ హననానికి కాదని గుర్తుంచుకోవాలి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

గోదావరి పరవళ్లు, పచ్చటి ప్రకృతి అందాలతో విరాజిల్లే కోనసీమ ప్రాంతం గత కొన్ని దశాబ్దాలుగా చమురు, సహజవాయు అన్వేషణలతో నిత్య భయాల మధ్య జీవిస్తోంది. దేశ ఇంధన అవసరాల కోసం ఓఎన్‌జీసీ అడుగుపెట్టిన నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి కన్నా ప్రమాదాలనే ఎక్కువగా చూశారు. పొలాల్లో, ఇళ్ల మధ్య, కాళ్ల కింద ఎప్పుడు పేలుతాయో తెలియని ఆయిల్‌, గ్యాస్‌ పైపులైన్లు, కోనసీమ ప్రజల జీవితంలో శాశ్వత ఆందోళనగా మారాయి.

1995 జనవరి 8న పాశర్లపూడిలో సంభవించిన బ్లోఅవుట్‌ ఈ ప్రాంత చరిత్రలో చెరగని విషాద ఘట్టం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బ్లోఅవుట్‌గా నమోదైన ఈ ఘటనను అదుపు చేయడానికి 65 రోజులు పట్టింది. ఆరు వేల కుటుంబాలు శిబిరాలకు తరలిపోవాల్సి వచ్చింది. పంటలు నాశనమై, పర్యావరణానికి తీరని నష్టం జరిగింది. ఆ మంటల వేడి, ఆకాశాన్ని చీల్చిన శబ్దం ఇప్పటికీ కోనసీమ వాసుల జ్ఞాపకాలలో భయానకంగా నిలిచిపోయాయి.

పాశర్లపూడి బ్లోఅవుట్‌ ఒక్కసారిగా జరిగిన ప్రమాదమేమీ కాదు. 1993లో కొమరాడ, 1997లో దేవరపల్లి, 2020లో ఉప్పూడి, ఇలా బ్లోఅవుట్‌లు తరచూ జరుగుతూనే ఉన్నాయి. 2014లో మామిడికుదురు మండలం నగరంలో గెయిల్‌ పైప్‌లైన్‌ పేలి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కాలం చెల్లిన పైప్‌లైన్లు, నిర్వహణ లోపాలు, ప్రైవేటు సంస్థల నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
తాజాగా మలికిపురం మండలం ఇసుమండలో ఓఎన్‌జీసీ బావిలో సంభవించిన బ్లోఅవుట్‌ కోనసీమను మరోసారి కలవరపాటుకు గురిచేసింది. ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చినా, మూడు రోజులైనా మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వందలాది కొబ్బరి చెట్లు, వరి నారుమళ్లు, పంటలు నాశనం కావడం ఈ ప్రమాద తీవ్రతను స్పష్టం చేస్తోంది. బ్లోఅవుట్‌ భయంతో మూడు గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది.
ఇన్ని సంఘటనలు జరుగుతున్నా పాఠాలు ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? 1993లో డ్రిల్లింగ్‌ చేసిన బావిని, అధిక పీడనం ఉందని అప్పట్లోనే నిలిపివేసిన ప్రాంతాన్ని, మళ్లీ ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ఎంతవరకు సమంజసం? ప్రమాదానికి గల అసలు కారణాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం పాలనా వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే హడావుడి పడటం కాదు. ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడమే చమురు సంస్థలు, నిర్వాహకులు, ప్రభుత్వాల బాధ్యత. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ఓఎన్‌జీసీ వంటి సంస్థలు ప్రజల ప్రాణాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కాలం చెల్లిన పరికరాలు తొలగించడం, కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేయడం, ప్రైవేటు సంస్థలపై కఠిన నియంత్రణ పెట్టడం అత్యవసరం. బాధితులకు తక్షణమే సముచిత నష్టపరిహారం చెల్లించడం ఇంకా అవసరం.

పాశర్లపూడి బ్లోఅవుట్‌ జరిగి మూడు దశాబ్దాలు గడిచాయి. కానీ కోనసీమ ప్రజల భయాలు ఏమాత్రం తగ్గలేదు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, మానవ నిర్లక్ష్యం ఉంటే ప్రమాదాలు తప్పవు. పాశర్లపూడి నుంచి నేటిదాకా కోనసీమ నేర్పుతున్న పాఠం ఇదే. అభివృద్ధి ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే, ఆ మంటలు తరతరాల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆయిల్ గ్యాస్ అయినా, అభివృద్ధి అయినా మానవ మనుగడకే తప్ప, మానవ హననానికి కాదని గుర్తుంచుకోవాలి.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News