Friday, April 10, 2026
36.2 C
Hyderabad

కరూర్‌ లాంటి ఘటనలు గుణపాఠాలు కావాలి|EDITORIAL

తమిళనాడులోని కరూర్‌లో సెప్టెంబర్ 27, 2025న సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభ తీవ్ర విషాదానికి దారి తీసింది. తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం, మృతుల్లో పిల్లలుండటం, అనేక మంది క్షతగాత్రులవడం దేశవ్యా్ప్తంగా సంచలనమైంది. తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే కుంభమేళా, ఢిల్లీ రైల్వేస్టేషన్, గోవా, ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాటలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మన దగ్గరే ఇలాంటి ఘటనలు తరచుగా ఎందుకు జరుగుతున్నాయి? నిర్వాహకుల లోపమా? ప్రజల పాపమా? ఇలాంటి ఘటనల అనుభవంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

జనవరి 29న మహాకుంభ మేళాలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు తండోపతండాలుగా వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతి చెందారు. 60 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. ఫిబ్రవరి 16న ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళలు, పిల్లలు సహా 18 మంది చనిపోగా మరో 20 మందికిపైగా గాయపడ్డారు. మే3న గోవా షిర్గావ్ లోని శ్రీ లైరాయ్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 7గురు మరణించారు. జూన్ 4, 2025న బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. జూన్ 29న పూరి రథయాత్రలో ముగ్గురు చనిపోయారు. సెప్టెంబర్ 27న కరూర్‌లో 8 మంది పిల్లలతో సహా 41 మంది తొక్కిసలాటకు బలయ్యారు. సినిమాకు సంబంధించి 2024, డిసెంబర్ 4న పుష్ఫ 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గతంలో ఏపీలో చంద్రబాబు హయాంలో గోదావరి పుష్కరాల సందర్భంగా పదుల సంఖ్యలో చనిపోయారు. మొన్నటి జగన్ ర్యాలీలో ఒకరిద్దరు చనిపోయారు. ప్రమాదాలు జరిగాక నష్టపరిహారాలు, ప్యాకేజీలేవీ తిరిగి వారిని తీసుకరాలేవు.

ఈ ప్రమాదాలకు కారణం ప్రమాదకర రీతిలో జన సాంద్రత ఉండటమే. ఒక చదరపు మీటర్ ప్రదేశంలో సాధారణంగా 5-7 మంది ఉండాల్సిందానికి భిన్నంగా, కుక్కినట్లుగా జనం ఉండటం, ఇసుక రాలనంత ఇరుకు, కాలు మోపలేనంత సందు లేకపోవడం వల్లే తొక్కిసలాటలు జరుగుతున్నాయి. పైగా, ప్యాక్డ్‌గా ఉన్న జనంపై చిన్న ఒత్తిడి జరిగినా, పేకమేడలా పడిపోతారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకుపోయే యత్నంలో మరికొందరు పడి, మిగతా వాళ్ల కాళ్ల కింద నలిగి, ఊపిరాడక ప్రాణాలు కోల్పోతారు. ఇదే సినీ, రాజకీయ సభలైతే, తొక్కిసలాట తీవ్రత మరీ ఎక్కువగా ఉంటున్నది.

ఇక నిర్వాహకులు 10వేల మంది వచ్చే అవకాశం ఉంటే, వెయ్యి మందికి ఏర్పాట్లు చుసుకోవడం పరిపాటిగా మారింది. కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా జనం తరలిరావడం కూడా జరుగుతున్నది. ఈ క్రౌడ్ కంట్రోల్ విషయంలో నిర్వహకులు నిర్లక్ష్యంగా, ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. సరైన ఎంట్రీ, ఎగ్జిట్ ప్లానింగ్, కార్యక్రమం జరిగే ప్రదేశంలో లైనింగ్స్, బ్యారికేడ్లు లేకపోవడం తొక్కిసలాటలకు దారితీస్తున్నాయి. క్రౌడ్ మేనేజ్మెంట్ పై సరైన అవగాహన ఉండటం లేదు. వలంటీర్లను నియమించినా, వారేం చేయలేకపోతున్నారు.

ఇదే సమయంలో జనం సభకు నిండుగా వచ్చే వరకు సినీతారలు, లీడర్లు సభా ప్రాంగనానికి రావడం లేదు. గంటల తరబడి ఆలస్యంగా రావడం, వాళ్ళని చూడ్డానికి జనం ఎగపడ్డం వల్ల కూడా తొక్కిసలాటలు జరిగి, విలువైన మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కరూర్‌లో విజయ్ కూడా దాదాపు 6 గంటలు ఆలస్యంగా వచ్చారు. ఇలాంటప్పుడు ప్రజల్లో అంతకంతకు అసహనం, ఆసక్తి పెరుగిపోతుంది. కుంభమేళా లాంటి ప్రదేశాల్లో సీసీటీవీలు, క్రౌడ్‌ను సూచించే సెన్సార్లు ఏర్పాటు చేసినా, అవి ఇచ్చిన డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోవడంలో నిర్వాహకులు పూర్తిగా విఫలం అయ్యారు. అనుకోని సంఘటన జరిగితే.. అంబులెన్స్ లు రావడానికి, జనాలు పారిపోవడానికి సరైన మార్గాలు ఉండటం లేదు.
ఇలాంటి తొక్కిసలాటలను సీరియస్‌గా పరిగణించాలి. అవసరమైతే నిర్వాహకులు పటిష్ట భద్రత చర్యలు తీసుకునేలా చట్టాలు రూపొందించాలి. ఆర్సీబీ ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం క్రౌడ్ కంట్రోల్ బిల్ 2025 తీసుకొచ్చింది. రాజకీయ, సినిమా, మతపరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు, నిర్వాహకులకు తీసుకోవాల్సిన భద్రత చర్యల గురించి వివరించాలి. అంతర్జాతీయంగా అమలులో ఉన్న భద్రత ప్రమాణాలు పాటించేలా చేయాలి. లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించాలి. కార్యక్రమం ఏర్పాటు చేసే ప్రదేశానికి అనుగుణంగా జన సమూహానికి అనుమతించాలి. అలాగే ఇండిపెండెంట్ నిపుణులు ధ్రువీకరించిన క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్లాన్లను నిర్వాహకులు అధికారులకు ముందే సమర్పించేలా చర్యలు చేపట్టాలి. ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళే ప్రజలు కూడా జాగ్రతలు తీసుకోవాలి. వీలైతే ముందుగా లేదా ఆలస్యంగా వెళ్లాలి. ఎవరినీ ముందుకు తోయకూడదు. బయటకు వెళ్లే దారులను బట్టి మసలుకోవాలి. అనూహ్యంగా తొక్కిసలాటలో చిక్కుకుంటే, చేతులు ఛాతిపై పెట్టుకోవాలి. ఒకవేళ కింద పడిపోతే, తల, మెడ కవర్ అయ్యేటట్లు చేతులు అడ్డుపెట్టుకుని ముడుచుకుపోవాలి. వీలైనంత త్వరగా పైకి లేచేందుకు ప్రయత్నించాలి. దేశవ్యాప్తంగా జరిగిన ఘటనలను గుణపాఠాలుగా తీసుకుని, ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాలి. మెరుగైన చట్టాలను రూపొందించాలి. ఎక్కువమంది ప్రజలు హాజరయ్యే సభలు, కార్యక్రమాలకు.. సరైన ప్లానింగ్ ఉంటేనే అనుమతులు ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో కరూర్ లాంటి దుర్ఘటనలను నివారించడానికి వీలవుతుంది.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News