Friday, April 10, 2026
36.2 C
Hyderabad

విమోచనంపై ఎందుకింత విముఖత!?|EDITORIAL

చరిత్రను విస్మరించిన జాతి లేదా దేశం ముందడుగేయడం కష్టం. తెలంగాణ విమోచనమా? విలీనమా? విద్రోహమా? అన్న అంశంపై రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. బీజేపీ విమోచన దినోత్సవంగా, బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవంగా, కాంగ్రెస్ ప్రజా పాలన దినోత్సవంగా, ఎవరికివారు ఇష్టం వచ్చిన రీతిగా నిర్వహిస్తున్నారు. పార్టీల స్వార్థపూరిత ప్రవర్తనల కారణంగా అసలు చరిత్ర మరుగున పడుతోంది. మన భవిష్యత్ తరాలకు వాస్తవ చరిత్ర అందకుండా, తెలియకుండా పోతోంది. ఇంకొంత వక్రీకరణ కూడా జరుగుతోంది. ఒక చారిత్రక సంఘటనపై ఇన్ని రకాలుగా కార్యక్రమం నిర్వహించడం విధి విపరీత వైచిత్రి.

విమోచనోత్సవంతో లబ్ది పొందాలన్న భావనలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక్క కమ్యూనిస్టులు మాత్రమే దీనిపై బలంగా నిలబడ్డారు. అధికారికంగా విమోచనోత్సవం జరపాలని కోరుతున్నారు. అయినా అధికార కాంగ్రెస్‌ ఇందుకు సుముఖంగా లేదు. కేవలం ప్రజాపాలనతో విమోచన దినోత్సవాన్ని గట్టెక్కించాలని చూస్తోంది. కేసీఆర్‌ అధికారంలో ఉన్న పదేళ్లు కేవలం సమైక్యతా దినోత్సవం పేరిట ముగించారు. ఇప్పుడు ప్రజాపాలనతో సాగిస్తున్నారు. కేవలం నాటి రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ పెట్టిన పార్టీ, ముస్లిం ఓటు బ్యాంక్‌ కోసం బీజేపీ, కమ్యూనిస్టులు మినహా మిగతా పార్టీలు నానా గడ్డీ కరుస్తున్నాయనడానికి విమోచన దినోత్సవాన్ని ఉదాహరణగా చెప్పుకోచ్చు. అటు కేంద్రం ఇటు రాష్ట్రం వేర్వేరుగా… వేర్వేరు పేర్లతో ఉత్సవాలను నిర్వహించడం కూడా విచిత్రమే!

నిజాం రాజరికం నుంచి విముక్తమైన ప్రజల మనోభావాలకు అనుగుణంగా సెప్టెంబర్‌ 17న ఉత్సవాలు జరుపుకోవడం నేటివరకు అధికారికంగా జరగలేదు. కేవలం మహారాష్ట్ర, కర్నాటకలో మాత్రమే ఈ ఉత్సవాలు జరిపేవారు. అనూహ్యంగా కేంద్రం విమోచనోత్సవాలు జరపాలని మూడేళ్ల క్రితం నిర్ణయించడంతో, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దిగిరాక తప్పలేదు. ఈ యేడు యథావిధిగానే బీజేపీ తనవంతుగా కార్యక్రమం చేపట్టింది. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈయేడు అతిథిగా వస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్సవం పేరిట జెండా వందనం నిర్వహిస్తోంది. కేంద్రం మాత్రం సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో విమోచనోత్సవాలకు శ్రీకారం చుట్టింది. దీంతో హైదరాబాద్‌ లో జరిగే ఉత్సవాల్లో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జెండా ఎగురేస్తారని అన్నారు. రాంజీ గోండు త్యాగానికి ప్రతిఫలం, తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ గుర్తు చేస్తోంది. ఒకే చెట్టుకు అత్యంత కిరాతకంగా వెయ్యి మంది తెలంగాణ ప్రజలను ఒకేసారి ఉరితీసిన నిర్మల్‌ వెయ్యి ఉరుల మర్రి ఘాతుకంలో అమరవీరులైన మన పూర్వీకులకు నివాళులు అర్పించనుంది. నిజాం రజాకార్లపై, బ్రిటిష్‌ సైన్యంపై గెరిల్లా యుద్ధం చేసిన మన రాంజీగోండు పోరాట స్ఫూర్తిని స్మరించుకుందాం అంటూ పిలుపునిస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొందాం, తెలంగాణ చరిత్రను తరువాతి తరానికి అందిద్దాం. అన్న నినాదంతో బీజేపీ ఏటా ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ యేడు కూడా పరేడ్‌ గ్రౌండ్‌లో విమోచనోత్సవాలను రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభిస్తారు.

నిజానికి తెలంగాణ విముక్తి కోసం ఎందరో పోరాడారు. ఎందరో మహిళలు తమ మాన, ప్రాణాలను పోగొట్టుకున్నారు. రజాకార్ల దాష్టీకానికి ఎందరో బలయ్యారు. సర్వస్వాన్ని త్యాగం చేసిన కొమురం భీం, రాంజీ గోండు, తుర్రేబాజ్‌ ఖాన్‌, షోయబుల్లాఖాన్‌, వందేమాతరం రామచంద్రరావు, నారాయణరావ్‌ పవార్‌, నల్లా నర్సింహులు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, దాశరథి సోదరులు, కాళోజీ నారాయణరావు, పీవీ నరసింహారావు వంటి ఎందరో మహానుభావులను స్మరించుకునేందుకు ఇదొక సరైన సమయం. అలాగే ఎందరో పోరాట యోధులను గురించి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. త్యాగాలను తర్వాతి తరాలకు అందజేసేలా చరిత్రను అందుబాటులోకి తీసుకుని రావాలి. పాఠ్యాంశాలుగా ముద్రించాలి.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేక పోవడానికి పూర్తిగా రాజకీయ దివాళాకోరుతనమే కారణం. ఘనమైన తెలంగాణ చరిత్రను మరుగున పడేసే ప్రయత్నాలు సరికాదు. ఏటా విమోచనోత్సవంపై జోరుగా వాద ప్రతివాదనలు, విమర్శలు సాగుతుండేవి. అయినా తెలంగాణలో కూడా విమోచనో త్సవాలకు మోక్షం దక్కలేదు. ఈ ఉత్సవాలు జరపాలంటేనే ఎందుకనో తెలంగాణ పాలకులు విముఖత చూపుతూ వచ్చారు. తెలంగాణకు ముందు విమోచనోత్సవాలకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తప్పమరోటి జరిగేది కాదు. దేశం ఆంగ్లేయుల పాలన నుంచి ఆగస్టు 15, 1947న స్వతంత్ర మైనప్పటికీ నాటి హైదరాబాద్‌ సంస్థానం మాత్రం ఇంకా విముక్తి పొందలేదు. స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు దాదాపు 13 నెలలు పట్టింది. ఉక్కు మనిషి, నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ప్రత్యేకమైన చొరవతీసుకుని హైదరాబాద్‌పై పోలీసు చర్యకు ఉపక్రమించడం ద్వారా హైదరాబాద్‌ సంస్థా నాన్ని భారత్‌లో విలీనం చేశారు. ఈ కారణంగా నిజాం అరాచక పాలననుంచి ప్రజలకు విమోచన లభించింది.

బైరాన్‌పల్లి, పరకాల ఘటనలను ఎలా మరచి పోగలం. వందల మందిని నిలబెట్టి రజాకార్లు పిట్టలను కాల్చినట్లు కాల్చారు. గ్రామాలను లూటీ చేసి తమ వికృతరూపాన్ని ప్రదర్శించారు. భారతదేశానికి స్వాతంత్యర్ర వచ్చిందని త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తే నిజాం, రజాకార్లు జీర్ణించుకోలేక పరకాల ప్రజలపై హత్యాకాండకు పాల్పడి మరో జలియన్ వాలా బాగ్ ను తలపించిన నాటి ఘటన నేటి యువతకు తెలవాల్సిన అవసరం ఉంది. ఆనాటి పోరాటాలను స్మరిస్తూ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాల్సి ఉంది. తెలంగాణ విమోచన దినోత్సవం జరపాల్సిన అవసరం గురించి ప్రజలకు తెలియపరచాలి. అమర వీరుల త్యాగాలను స్మరించుకోవాలి.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News