Wednesday, April 8, 2026
34.2 C
Hyderabad

భారతీయ ‘ఆత్మ’ను ఆవిష్కరిద్దామా!?|EDITORIAL

‘మహాత్మా గాంధీ ఉపాధి హామీ’ పథకాన్ని ‘బాపు గ్రామీణ్ రోజ్ గార్ యోజన’ పథకంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. భారతదేశంలో ఊళ్ళు, పట్టణాలు, ప్రభుత్వ పథకాలు, వీధుల పేర్లు మారుస్తూ ఉండటం ఇటీవలి కాలంలో ఒక ప్రధాన రాజకీయ, సామాజిక అంశంగా మారింది.

భారతదేశంలో పేర్ల మార్పు కొత్తేమీ కాదు. ఇంతకుముందు. 1956లో ట్రావెన్‌కోర్-కొచ్చిన్‌ను కేరళగా, 1996లో మద్రాస్ ను చెన్నైగా, 2001లో కలకత్తా ను కోల్‌కతా గా, 2011లో ఒరిస్సాను ఒడిషాగా, 2006లో పాండిచ్చేరిని పుదుచ్చేరిగా మార్చారు. 2016లో ప్రధాని అధికారిక నివాసం పేరును ‘లోక్ కళ్యాణ్ మార్గ్’గా, ‘రాజ్‌పథ్‌’ను ‘కర్తవ్య పథ్’గా, తాజాగా ప్రధాని కార్యాలయానికి ‘సేవాతీర్థ్’గా, రాష్ట్ర గవర్నర్ల నివాసాలు ‘రాజ్‌భవన్‌’లను ‘లోక్ భవన్’గా మార్చడం తెలిసిందే. ఇదే కోవలో ఉపాధి హామీ పథకానికి కూడా పేరు మార్చారు. అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చాక మార్చిన పేర్లే ఎక్కువ వివాదాస్పదమవుతున్నాయి.
ఈ ప్రక్రియ కొందరికి చరిత్ర పునరుద్ధరణగా అనిపిస్తే, మరికొందరికి రాజకీయ దురుద్దేశంగా, ప్రజాధన దుర్వినియోగంగా కనిపిస్తోంది. పేరు కేవలం ఒక గుర్తింపేనా, లేక ప్రజల భావోద్వేగాలకు, చరిత్ర జ్ఞాపకాలకు, ప్రాధాన్యాలకు ప్రతీకనా? పేర్ల మార్పు సమంజసమా? నిజంగా మార్చాల్సిన అవసరం ఉందా? ఉంటే ఏ మేరకు?

దేశం సహా, రాష్ట్రాలు, ప్రాంతాలు, ఊర్లు, పట్టణాలు, గ్రామాలు, వీధులు, మనుషుల పేర్లకు భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉంటుంది. వాటన్నింటి ప్రభావం ఆయా పేర్లపై ఉంటుంది. ఆర్యులు, ముస్లింలు, బ్రిటీషర్లు మొదలైన వలస పాలనల కాలంలో, అనేక పేర్లు మార్పు జరిగింది. ఆ పేర్లు ఇప్పుడు స్థానిక సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను ప్రతిబింబించవు అనే వాదన ఉంది. అలాంటి సందర్భాల్లో ప్రాచీన చరిత్రను, స్థానిక గుర్తింపును ప్రతిఫలించే పేర్లను పునరుద్ధరించడం అవసరమా? ఇది నిజంగా ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించి, సాంస్కృతిక అవగాహనను బలపరుస్తుందా? అయితే, పేర్ల మార్పు అన్నది కేవలం రాజకీయ ప్రేరేపిత భావోద్వేగాల ఎజెంగా జరిగితే సమస్యలు తలెత్తుతాయి.
పేరు చరిత్రను ప్రతిబింబిస్తుంది. ఊరు, వీధి పేర్లు తరతరాలుగా ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయి. పేరు ద్వారా ఆ ప్రాంత చరిత్ర, సామాజిక పరిణామాలు, సాంస్కృతిక నేపథ్యం వెల్లడవుతాయి. అలాంటి పేర్లను తరచూ మారిస్తే చరిత్రను చెరిపేయడమేనా? చరిత్రలోని తప్పులను సరిదిద్దడమే లక్ష్యమైతే, పేర్ల మార్పు కంటే చరిత్రపై అవగాహన పెంపొందించడం, విద్య ద్వారా నిజాలను ప్రజలకు తెలియజేయడం ఉత్తమ మార్గం కాదా?

ప్రభుత్వాలు తమ భావజాలానికి అనుగుణంగా పేర్లు మార్చడం ద్వారా తమ రాజకీయ అజెండాను అమలుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది ప్రజాస్వామ్యంలో సహజమేనని కొందరు వాదిస్తే, మరికొందరు దీనిని అధికార దుర్వినియోగంగా చూస్తారు. ప్రజల ప్రాథమిక సమస్యలు విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు. వీటిని విస్మరించి, పేర్ల మార్పులపై దృష్టి పెట్టడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమనే విమర్శ బలంగా వినిపిస్తోంది.

పేర్ల మార్పు పరిపాలనా వ్యయభారం. ఒక ఊరు లేదా పట్టణం పేరు మారితే, ప్రభుత్వ పత్రాలు, మ్యాపులు, బోర్డులు, రికార్డులు, డిజిటల్ డేటాబేసులు అన్నీ మార్చాల్సి వస్తుంది. దీనివల్ల భారీగా ప్రజాధనం ఖర్చవుతుంది. ఆ ఖర్చు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగపడితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్న అభిప్రాయాలూ ఉన్నాయి. పేరు మార్పు వల్ల ప్రయోజనం లేకపోతే, ఆ వ్యయం న్యాయసమ్మతమా? ఆలోచించాలి.

సాధారణంగా ప్రభుత్వ పథకాల పేర్లు ప్రజలకు గుర్తుండేలా, ఆకర్షణీయంగా పెడతారు. అయితే ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ పథకాల పేర్లు మారితే, ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది. అసలు సమస్య పథకం పేరు కాదు, ఆ పథకం అమలు. పేర్లు మారుస్తూ పాత పథకాలను కొత్తవిగా చూపించడం వల్ల ప్రజలకు వాస్తవ ప్రయోజనం కలగదు. ఇదంతా ‘పేర్ల రాజకీయం’గా మాత్రమే మిగిలిపోతుంది.
అదేవిధంగా, చరిత్రను పూర్తిగా తిరస్కరించడం కూడా సరైనది కాదు. చరిత్రలో మంచి, చెడులుంటాయి. పేర్ల మార్పు ద్వారా చరిత్రను సరిదిద్దగలమనే భావన భ్రమ మాత్రమే. బదులుగా, చరిత్రను విమర్శనాత్మకంగా అధ్యయనం చేసి, ప్రజలకు అవగాహన కల్పించడమే మేలైన మార్గం.

పేర్లు మార్చడం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సమంజసమే అయినా, అది ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయం కాదు. పేర్ల మార్పు కన్నా విద్య, ఉపాధి, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ నిర్ణయాలు రాజకీయ లాభనష్టాలకంటే ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ఆలోచనాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Latest News

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

బట్టల మీద బూరును సాఫ్ శేసే ఇకమతు!?|ADUGU TRENDS

సూటూ, బూటూ గదేనుల్లా... బట్ట తీరు మనిసికి యిలువ. గా బట్టేమో పోగుల తీరును బట్టి ఉంటదాయె. కొన్ని బట్టలు ఎన్ని పైసలు పెట్టి కొన్నా, ఒక్కపాలి ఉతికితిమా? బూరు బూరు లేస్తది....

కెజి బేసిన్ – మన గ్యాస్ మన హక్కు!|EDITORIAL

పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన, సహజవాయువు సరఫరా వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాల ప్రభావం మన దేశంతోపాటు అన్ని దేశాలపైనా,...

07-04-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి మధ్యాహ్నం 01.49 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 03.21 వరకు ఉపరి మూల యోగం వ్యతీపాత మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి వరీయాన్ కరణం తైతుల మధ్యాహ్నం...

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News