Wednesday, April 8, 2026
35.2 C
Hyderabad

ప్రకృతితో పోరాటం కాదు సహజీవనం చేయాలి!|EDITORIAL

ప్రకృతే మానవాళికి జీవనాధారం. సకల జీవరాసులను పోషించేది ప్రకృతే. కానీ నేడు, అదే ప్రకృతి మనిషిని మటాశ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వర్షాభావాలు, తుపాన్లు, వరదలు భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు, హిమపాతాలు, వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా లక్షలాది మంది మనుషులు, జీవరాసులు బలవుతున్నాయి. తాజాగా క్లౌడ్‌ బరస్ట్‌ వచ్చి చేరింది. క్యుములో నింబస్‌ మేఘాలు ఉరుము ఉరిమినట్లుగా కురియడంతో ఒక్కసారిగా ఒకేచోట కుండపోత వానగా వస్తోంది. దీంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది.

ఉమ్మడి ఏపీలో క్యుములో నింబస్‌ మేఘాల వల్లనే అప్పటి సీఎం రాజశేర్‌ రెడ్డితో పాటు, పలువురు నల్లమలలో హెలీక్యాప్టర్ క్రాష్ లో మృత్యువాత పడ్డారు. ఇదంతా ప్రకృతి విధ్వంసం వల్ల జరుగుతున్న విపరిణామం. ఇది నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు. కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హానికర వాయువుల ఉద్గారాల వలన గ్రీన్‌హౌస్ ప్రభావం పెరిగింది. దాంతో భూమి ఉష్ణోగ్రత పెరిగింది. ఫలితంగా మంచు కరగడం, సముద్ర మట్టం పెరగడం, తుఫానుల తీవ్రత పెరగడం వంటి సంఘటనలు సంభవిస్తున్నాయి. పైగా మనం నిత్యం కొండలను, గుట్టలను కొట్టేస్తున్నాం. అడవులను నరికేస్తున్నాం. పారిశ్రామీకరణ, పట్టణీకరణ, నగరాల విస్తరణ, పర్యావరణంపై నిర్లక్ష్యం వెరసే ఈ వైపరీత్యాల విష పరిణామాలు.

ఈ వర్షాకాల సీజన్ లో కాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, హిమాచల్‌, ఏపీ, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్ లు జరిగాయి. జమ్మూలో గురువారం మేఘ విస్ఫోటం విరుచుకుపడింది. ఫలితంగా మచైల్‌ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులు బలయ్యారు. ఒక్కసారిగా వచ్చిన వరదలకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది గాయాల పాలయ్యారు. చాలామంది గల్లంతయ్యారు. పలు భవనాలు, దుకాణాలు తుడిచిపెట్టుకుపోయాయి. వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో మచైల్‌ మాతా దేవి యాత్రను నిలిపివేశారు. ఉత్తరాఖండ్‌లో ఖీర్‌గంగా నది మెరుపు వరదతో ధరాలీ పట్టణంపై విరుచుకుపడింది. ఎగువ ప్రాంతాల్లో జరిగిన క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా అనూహ్య వరద ధాటికి ధరాలీ పట్టణం దాదాపు సగం కొట్టుకుపోయింది. కొన్ని అడుగుల మేర పేరుకుపోయిన బురద తప్ప ఏవీ కనిపించడం లేదు. వరద ధాటికి మూడు నాలుగు అంతస్తుల భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. యాత్రికుల కోసం నిర్మించిన 20-25 హోటళ్లు, పలు హోం స్టేలు ప్రస్తుతం కనపడటం లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఐదుగురు మరణించారు. ఉత్పాతం సమయంలో పర్యాటకులు, స్థానికులందరూ క్షేమంగా ఉన్నారా అన్న అంశంపై కూడా స్పష్టత రావడం లేదు. సహాయక చర్యలు చేపట్టిన సైనిక బృందాల్లో 10 మంది వరద ధాటికి గల్లంతు కావడం గమనార్హం. ఈ దుర్ఘటన తర్వాత కూడా ఆ ప్రాంతంలో అధిక వర్షపాతం కురిసింది. ఖీర్‌గంగ ఇలా ఉప్పొంగడం ఇదే మొదటిసారేం కాదు. ఇటీవల కాలంలో 2018లో, 2021లో కూడా ఈ నదికి భారీగా వరదలు వచ్చి, తీవ్ర నష్టం వాటిల్లింది. 1835లో కూడా ఇలాంటి వరద ఈ నదికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటి మాదిరే బురద వరద అప్పుడు కూడా ధరాలీని ముంచెత్తిందని, దాంతో అప్పటి పట్టణం పూర్తిగా ధ్వంసం అయిందని చెబుతున్నారు. ఆ శిధిలాలపైన ప్రస్తుత పట్టణం నిర్మాణమైంది.

అభివృద్ధి పేరుతో పెద్దఎత్తున సాగుతున్న అడవుల విధ్వంసం కూడా ఉత్తరాఖండ్‌లో కొనసాగుతోంది. ఒక్క గత సంవత్సరంలోనే 998 హెక్టార్ల మేర అడవి తరుక్కుపోయింది. 2021-24 మధ్య దేశంలోని అటవీ ప్రాంతాల్లో 41 శాతం చెట్లను కోల్పోయినట్లు తాజాగా విడుదలైన ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక పేర్కొంది. విచ్చలవిడిగా సాగుతున్న ఈ తరహా విధ్వంసం కూడా ప్రకృతి ప్రళయాలకు కారణమౌతోంది. అదే విధంగా ఖీర్‌గంగా పొడవునా రక్షిత గోడ నిర్మించాలని స్థానిక ప్రజలు కొన్ని సంవత్స రాలుగా కోరుతున్నారు. అధికార యంత్రాంగం ఈ విషయాలపై దృష్టి సారిస్తే స్థానిక ప్రజలకు కొంత మేర ఊరట లభిస్తుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో, ఏపీలోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇంకోవైపు వర్షం నీరు వస్తే పోయే దారులను ఆక్రమించి ఇళ్లు కట్టుకుంటున్నాం. దీంతో చిన్న పాటి వర్షాలకే రోడ్ల నదుల్లా, లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారుతున్నాయి. ఇక ఆకస్మిక వరదలు వస్తే ఎలా ఉంటుందో నిన్న మొన్న హైదరాబాద్ లో చూశాం. వరంగల్‌లోనూ మరోమారు వర్షం బీభత్సం సృష్టించింది. ఖమ్మంలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. చెరువులను మాయం చేసిన పాపానికే హైదరాబాద్‌ ఓ పెద్ద చెరువైంది.

హైదరాబాద్‌లో పురానాఫూల్‌ శ్మశాన వాటిక మునిగి పోయింది. ఉమ్మడి ఏపీలో పలు ప్రాంతాలు మళ్లీ వరద ముంపులకు గురవుతున్నాయి. వివిధ జిల్లాల్లో చిన్నా పెద్దా జలపాతాలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న వరదలు, వానలు సకాలంలో కురవక పోవడం, క్లౌడ్‌ బరస్ట్ లు అన్నీ కూడా ప్రకృతి విధ్వంసం కారణంగానే. వాటినుంచి మనం గుణపాఠం నేర్చుకోవడం లేదు. అడ్డుకునే ప్రయత్నాలు చేయడం లేదు. పర్యావరణంపై ప్రజల్లాగే పాలకులు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రజల్లో కూడా చైతన్యం రావడం లేదు. పాలకుల్లో చిత్తశుద్ధి కనిపించడం లేదు. అప్పటిదాకా ఇలాంటి విధ్వంసాలను భరించాల్సిందేనా? బలవ్వాల్సిందేనా? అందరమూ ఆలోచించుకోవాలి.

ఈ భూమి మన వారసత్వం కాదు, మన భవిష్యత్ తరాలకు అప్పగింత. దాన్ని పరిరక్షించడం మన బాధ్యత. ప్రకృతితో పోరాడటం కాకుండా, దానితో సహజీవనం చేసుకోవాలన్న తత్త్వాన్ని అవలంబించాల్సిన సమయం ఇది.

Latest News

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

బట్టల మీద బూరును సాఫ్ శేసే ఇకమతు!?|ADUGU TRENDS

సూటూ, బూటూ గదేనుల్లా... బట్ట తీరు మనిసికి యిలువ. గా బట్టేమో పోగుల తీరును బట్టి ఉంటదాయె. కొన్ని బట్టలు ఎన్ని పైసలు పెట్టి కొన్నా, ఒక్కపాలి ఉతికితిమా? బూరు బూరు లేస్తది....

కెజి బేసిన్ – మన గ్యాస్ మన హక్కు!|EDITORIAL

పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన, సహజవాయువు సరఫరా వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాల ప్రభావం మన దేశంతోపాటు అన్ని దేశాలపైనా,...

07-04-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి మధ్యాహ్నం 01.49 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 03.21 వరకు ఉపరి మూల యోగం వ్యతీపాత మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి వరీయాన్ కరణం తైతుల మధ్యాహ్నం...

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News