Friday, April 3, 2026
30.2 C
Hyderabad

మోడీ ఇమేజ్‌ పెరిగిందా? తగ్గిందా! | NARENDRAMODI |

|NARENDRAMODI|OPERATION SINDHOOR|

‘ఆపరేషన్‌ సిందూర్‌’ తో పాకిస్తాన్‌ బెంబేలెత్తింది. ఎంతగానో బెదిరిపోయింది. కాల్పుల విరమణకు ప్రపంచం చుట్టూతా తిరిగింది. చివరకు అమెరికా కాళ్ళు పట్టుకుంది. యుద్ధతంత్రమో, రాజకీయ కుతంత్రమో కానీ, కాల్పుల విరమణ అనివార్యమైంది. ఫలితంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే, యుద్ధభూమిలో దాయదిపై పూర్తిగా పై చేయి సాధించిన భారత్‌, మరోమారు అది వికృత చేష్టలకు పాల్పడకుండా ఎలాంటి ఒప్పందాలు లేకుండానే కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకుంది? అనేది ప్రధాన ప్రశ్న. ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో పాకిస్తాన్‌ని భయపెట్టగలిగాం. కానీ, అది ఎంతో కాలం నిలవలేదనేది మరో ప్రశ్న.

ఒకవైపు కాల్పుల విరమణ మరుక్షణమే మరోవైపు ఎప్పటిలాగే ఎల్‌ఓసీ వద్ద పాక్ దుశ్చర్యలు. పైగా ‘నేనే యుద్ధాన్ని ఆపా?’ అంటూ అమెరికా అధ్యక్షుడు ‘ట్రంప’రితనపు మాటలు మోడీని మరింత ఇరుకున పెట్టాయి. ఇంతలోనే ‘మాదే విజయమ’ని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. పాక్‌ సైనికులు మిఠాయిలు పంచుకొంటూ సంబురాలు చేసుకొన్న వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో మోడీ ప్రభుత్వంపై విమర్శల తీవ్రత మరింత పెరిగింది. ఇంతలోనే ‘కాల్పుల విరమణ’ నిర్ణయాన్ని పక్కనబెట్టి సరిహద్దుల్లో పాక్‌ మళ్లీ డ్రోన్ల దాడులతో కవ్వింపులకు పాల్పడుతుండటంతో ఎన్డీయే ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈలోగా ఉగ్ర ప్రతిదాడుల్లో హతమైన ప్రతి ఒక్కరికి రూ.కోటి చొప్పున పాక్ ప్రధాని ప్రకటించారు. ఇంత దారుణ మారణకాండ జరుగుతుండగా, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయిన పాక్ ప్రభుత్వం ఐఎంఎఫ్ నుంచి తెచ్చిన అప్పుల ప్యాకేజీలోంచి ఉగ్రవాదుల కుటుంబాలకు అంత పెద్ద మొత్తం ప్రకటించడం భారత్ ని కవ్వించడం, మోసం చేయడం, నయవంచన కాక మరేమిటి? అలాగే ఆ దాడుల్లో భవహల్ పూర్ ఉగ్ర శిబిరంలో హతమైన మరో 14 మందికి కూడా పరిహారం ప్రకటించింది. ఆ హతుల్లో మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్టు, భారత్ లో జరిగిన ఉగ్ర చర్యలన్నింటికీ మూలం జైష్ ఎ మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది, మరో నలుగురు కూడా ఉన్నారు. వారికి అందాల్సిన ఆ మొత్తం రూ. 14 కోట్లను మసూద్ అజార్ కే ఇవ్వాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించడం, వారి అంత్యక్రియల్లో పాక్ సైన్యం, పోలీసులు పాల్గొనడం వంటి చర్యలు మరింత కవ్వింపుగా ఉన్నాయి. ఇలా ఇచ్చే ప్రతి పైసా, తిరిగి పాక్ లో ఉగ్రవాదుల పెంపునకు దోహదం చేయడమేగాక, ఉగ్రవాదులకు బలం చేకూర్చి, తిరిగి అది భారత్ పై ప్రయోగానికి దారి తీస్తుందన్నది నిస్సందేహం.

1971 యుద్ధంలోనే అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నామని కాంగ్రెస్ ను, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని విమర్శిస్తున్న కమలనాథులు, ఇప్పుడు మోడీ చేసిందానికి ఏం సమాధానం చెబుతారు? ఏ విధంగా సమర్ధించుకుంటారు? అందుకే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇప్పుడు మోడీని, బీజేపీని వేలెత్తి చూపిస్తున్నాయి. ఏ ఒత్తిడులకు తలొగ్గి కాల్పుల విరమణకు ఒప్పుకున్నారో ప్రధాని మోడీ ప్రజలకు చెప్పాలంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం రాజకీయ రాజీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ విమర్శలంత ఈజీగా ఈ విమర్శలను తిప్పికొట్టడం కష్టం. అయితే ఈ నిర్ణయం మోడీ దీర్ఘకాల వ్యూహాత్మక దృష్టిని ప్రతిబింబిస్తుందని అంటున్నారు. కానీ, ఈ వ్యూహాన్ని ఏవిధంగా భారత ప్రజలను నమ్మిస్తారు. ప్రతి పక్షాలను ఒప్పిస్తారు? విచిత్రంగా విమర్శకులే కాదు మోడీని సమర్ధించేవారు కూడా మోడీ స్ట్రాంగ్‌ మ్యాన్‌ ఇమేజ్‌కు ఎదురు దెబ్బగానే చూస్తున్నారు. ఏదేమైనా, ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తో ప్రధాని మోడీ ఇమేజ్‌ ఒక్కసారిగా పైకెళ్లి, ఆ తర్వాత ఆయన భక్తులు కూడా ఉస్సూరుమనే దీనస్థితికి దిగజారింది. రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, మేధావులు, రక్షణరంగ నిపుణులు, కళాకారులు, జర్నలిస్టులు.. అంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో ఆత్మరక్షణలో పడిన మోడీ తన ఇమేజీ డ్యామేజీ కంట్రోల్‌కు దిగినట్టు కనిపిస్తోంది. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించడం, ఆ మరుసటి రోజే పంజాబ్‌లోని అధంపూర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించడం ఇందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘కాల్పుల విరమణ’పై ఆగ్రహంతో ఉన్న వారిని తన ప్రసంగంతో తన దారికి తెచ్చుకోవాలని మోడీ ఎంతో ప్రయత్నించారు. భావోద్వేగపూరిత సంభాషణలు జోడించారు. అయితే, మోడీ తన ప్రసంగంలో ‘కాల్పుల విరమణ’ నిర్ణయానికి గల కారణాలను మాత్రం కనీసం ఉటంకించలేకపోయారు. ‘ట్రంప్‌ వాణిజ్య బెదిరింపుల వ్యాఖ్యల’పై కూడా ఆయన స్పందించలేదు. దీంతో మోడీ వైఖరిపై అందరూ మండిపడ్డారు.మోడీ ప్రసంగం నిస్తేజంగా సాగిందని ధ్వజమెత్తారు. ‘జాతినుద్దేశించి మాట్లాడటం పార్లమెంట్‌ సమావేశాలకు ప్రత్యామ్నాయం కాదని, బాధ్యతల నుంచి ప్రధాని తప్పించుకోలేర’ ని ప్రముఖ జర్నలిస్ట్‌ రాజు పార్లేకర్‌ వంటి వారు బహిరంగంగానే విమర్శించారు. అమెరికాతో చర్చల్లో వాణిజ్యం ప్రస్తావనే రాలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఓ మొక్కుబడి ప్రకటనను ఆ తర్వాత విడుదల చేశాయి. దీంతో నెటిజన్లు మరింతగా మండిపడ్డారు.

మొత్తంగా తన ప్రసంగం కూడా ప్రభావం చూపలేదని గ్రహించిన మోడీ మంగళవారం పంజాబ్‌లోని అధంపూర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించి జవాన్లతో ముచ్చటించారు. పనిలోపనిగా సైనికుల్లో ధైర్యాన్ని నింపేలా మాట్లాడారు. ‘భారత ఆడపడుచుల సిందూరం తుడిచిన వారి నట్టింట్లోకి వెళ్లి మరీ నాశనం చేశామం’టూ మాట్లాడారు. భారత్‌ను, ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకొంటామన్నారు. ఈ సందర్శన కూడా బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. జవాన్లతో మోడీ చేసిన వ్యాఖ్యలపై కూడా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘పహల్గాం మహిళల సిందూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదులను, వారిని ఎగదోసిన పాక్‌ను విడిచిపెట్టడమేనా మీరు చెప్తున్న ఆ పెద్ద నిర్ణయం’ అంటూ నెటిజన్లు మోడీ వీడియోను ట్యాగ్‌ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు. యుద్ధానికి ముందు లేదా యుద్ధం జరుగుతున్నప్పుడు నాయకుడు సైన్యంలో ధైర్యాన్ని నూరిపోయడం చూశాంగానీ, యుద్ధం పూర్తయ్యాక వెళ్లడమేంటని మోడీని ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. విచిత్రమేంటంటే, లైవ్‌ స్టీమ్రింగ్‌, యూట్యూబ్‌, ఎఫ్‌బీ, ఎక్స్‌ లైవ్‌ వీడియోల్లో మోడీ ప్రసంగాలకు వ్యూయర్‌షిప్‌ భారీగా తగ్గింది.

మొత్తంగా ’కాల్పుల విరమణ’ ప్రకటన, దాని తదనంతర పరిణామాలపై ప్రధాని మోడీ ఆత్మరక్షణలో పడి ఇమేజ్‌ మేకోవర్‌ కోసం ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయని చెప్తున్నారు. రాబోవు రోజులలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News