Friday, April 3, 2026
35.2 C
Hyderabad

ఆపరేషన్‌ సిందూర్‌ -2

తోక ముడిచిన పాక్!
పాక్‌ అతలాకుతలం!!
రక్షణ వ్యవస్థలు కకావికలం!
భారత్‌ దాడుల్లో ఇస్లామాబాద్‌ సర్వనాశనం!
అజ్ఞాతంలోకి పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌!?
పఠాన్‌కోట్‌ సెక్టార్‌లో పాక్ ఫైటర్‌ జెట్ల కూల్చివేత!
కర్కశ ముష్కరులపై ముప్పేట దాడి..
లాహోర్‌, సియోల్‌కోట్‌పై ప్రతి దాడి
పాకిస్తాన్‌పై మొదలైన భారత్ దాడులు
కరాచీ ఓడరేవు సమీపంలో పేలుళ్లు!
భారత్‌ దాడిలో ధ్వంసమైన 8 క్షిపణులు, 16 డ్రోన్లు!
సైరన్‌ల మోతతో ఠారెత్తిన పాక్ పురవీధులు!
భారత సైన్యం అదుపులో పాక్‌ పైలెట్‌
మన సైనిక స్థావరాలపై దాడికి విఫలయత్నాలు
పాక్ పన్నాగాలను తిప్పికొట్టిన భారత సైనికులు
రెడ్‌ అలర్ట్ లో రాజస్థాన్‌ సరిహద్దు జిల్లాలు
రెండు దేశాల మధ్య భీకర యుద్ధ వాతావరణం!
ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న భారత ప్రధాని, రక్షణ మంత్రి
దేశంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

మరోవైపు పాక్ లో అంతర్యుద్ధం!
పారిపోతున్న పాక్ సైన్యం!
రిమోట్ బాంబులతో మొబైల్‌ టవర్లు ధ్వంసం!
పాక్ సైనికులపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు
పాక్‌ సైనికుల ఆయుధాలు, ఆహారం ట్రక్కులు పేల్చివేత
పాక్‌పై ఆరు దాడులు చేశామంటున్న బలుచిస్తాన్ ఆర్మీ

‘వార్’ వన్ సైడే అయింది. ఆపరేషన్ సిందూర్ రెండో రోజే పాక్ తోక ముడిచింది. ముశ్కర మూకలపై జరుగుతున్న ముప్పేట దాడితో రక్షణ వ్యవస్థలు కకావికలమైంది! పాక్‌ అతలాకుతలమవుతోంది! భారత్‌ దాడుల్లో ఇస్లామాబాద్‌ సర్వనాశనమైంది. పాక్ ప్రధాని ఇంటి ముందే బాంబు పేలింది. దెబ్బకు పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ అజ్ఞాతంలోకి వెళ్ళాడు!? పఠాన్‌కోట్‌ సెక్టార్‌లో పాక్ ఫైటర్‌ జెట్ల కూల్చివేయబడ్డాయి. భారత్‌ దాడిలో 8 క్షిపణులు, 16 డ్రోన్లు ధ్వంసమయ్యాయి. సైరన్‌ల మోతతో పాక్ పురవీధులు ఠారెత్తుతున్నాయి. పాక్ పైలట్ ఒకడు భారత సైన్యానికి చిక్కాడు. మన సైనిక స్థావరాలపై దాడికి ప్రయత్నించిన పాక్ విఫలమైంది. పాక్ అన్ని పన్నాగాలను భారత జవాన్లు తిప్పికొట్టారు. బార్డర్ లోని మన సరిహద్దు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికీ దాయది కుటిల కుతంత్రాలకు పాల్పడే అవకాశం ఉన్నందున రెండు దేశాల మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది.

మరోవైపు పాక్ లో అంతర్యుద్ధం మొదలైంది. పాక్ వైఖరిపై విసుగు చెంది, స్వాతంత్ర్యం కోరుకుంటున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులపై 6 చోట్ల దాడులు చేశామని వారే ప్రకటించుకున్నారు. పాక్‌ సైనికుల ఆయుధాలు, ఆహారం ట్రక్కులు పేల్చివేశారు. రిమోట్ బాంబులతో మొబైల్‌ టవర్లు ధ్వంసం చేశారు. బతికుంటే బలిసాకు అనుకుంటూ, పాక్ సైన్యం తమ ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని పారిపోతున్నారు. ఇదీ ప్రస్తుతం ఛిద్రమైన పాకిస్తాన్ ముఖచిత్రం.

న్యూ ఢిల్లీ, మే 8 (ఆర్‌.ఎన్‌.ఎ.):
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా రెండో రోజు పాక్‌ దాడులతో కౌంటర్‌ అటాక్‌ స్టార్ట్‌ చేసింది భారత్‌. పాకిస్తాన్‌లో లాహోర్‌, సియోల్‌కోట్‌తో పాటు ఇస్లామాబాద్‌, బహల్‌వాల్‌పూర్‌లోనూ దాడులు చేసింది. ఇప్పటికే చాలా నగరాలను టార్గెట్‌ చేసుకొని విధ్వంసం చేసింది. ఇప్పుడు లాహోర్‌లో డ్రోన్‌ దాడి చేసింది భారత్‌. గురువారం సాయంత్రం నుంచి సరిహద్దు వద్ద పాకిస్తాన్‌ చేస్తున్న దాడులకు అదే స్థాయిలో జవాబు ఇస్తోంది.

సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్‌ వరుస డ్రోన్‌ దాడుల తర్వాత భారత్‌ ఈ దాడి చేసింది. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ లో తమ ఎయిర్‌బోర్న్‌ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ విమానం కూలిపోయిందని పాకిస్తాన్‌ వైమానిక దళం ప్రకటించింది. కయ్యానికి కాలుదువ్విన పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు భారత్‌ సైనిక చర్యకు దిగింది. దీంతో పాకిస్తాన్‌ బెంబేలెత్తిపోతోంది. ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌ తుక్కుతుక్కు అయినట్టు సమాచారం. ఈ దాడులను తట్టుకోలేక భారత్‌ను ఎదుర్కోలేక పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షాబాజ్‌ షరీఫ్‌ దేశం విడిచి పోరిపోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రత్యేక చార్టెడ్‌ ఫ్లైట్‌లో దేశం విడిచి వెళ్లిపోయేందుకు ఆయనకు సహాయక సిబ్బంది హెల్ప్‌ చేస్తున్నట్టు పాక్ నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆయన కనిపించకుండా పోయారు. బహుషా ఏ బంకర్ కలుగులోనూ ఈ ఎలుక దాగి ఉంటుందని భావిస్తున్నారు.

కొత్త ఘర్షణలు
గురువారం నాడు భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కొత్త ఘర్షణలు ప్రారంభమయ్యాయి. డ్రోన్‌ దాడులు, క్షిపణి దాడులు, సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్‌లు జరిగాయి. ఉగ్రదాడుల నేపథ్యంలో కరాచీ ఓడరేవు ప్రాంతం సమీపంలో పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. దీంతో భారత నావికాదళం అలర్ట్‌ అయింది. అరేబియా సముద్రంలో కీలకమైన అస్త్రాలను రెడీ చేసింది. అక్కడ కార్యాచరణను కొనసాగించడానికి పశ్చిమ నావికాదళం %Iచీూ% విక్రాంత్‌, డిస్ట్రాయర్లను మోహరించిందని తెలుస్తోంది. భారతదేశ క్షిపణి రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్‌కు చెందిన ఒక %ఖీ%-16, రెండు %జీఖీ%-17 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.

భారత్ పై దాడులకు తెగబడ్డ పాక్
అంతకుముందు, పాకిస్తాన్‌ భారతదేశంలోని అనేక ప్రదేశాలపై దాడులు చేయడానికి ప్రయత్నించింది. వాటిని భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు విఫలం చేశాయి. గురువారం రాత్రి పాకిస్తాన్‌ డ్రోన్లు, క్షిపణులతో భారతదేశ పశ్చిమ సరిహద్దుల్లోని వివిధ ప్రదేశాలను అటాక్‌ చేయడానికి ప్రయత్నించింది. కానీ అది విజయవంతం కాలేదని భారత సైనిక అధికారులు తెలిపారు. జమ్మూ, పఠాన్‌కోట్‌, ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్‌ ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌ డ్రోన్‌లను భారత సాయుధ దళాలు సమర్థవంతంగా నేలమట్టం చేశాయని వివరించారు. బుధవారం రాత్రి కూడా అవంతిపుర, శ్రీనగర్‌, జమ్మూ, పఠాన్‌కోట్‌, అమృత్‌సర్‌, కపుర్తలా, జలంధర్‌, లూథియానా, అడంపూర్‌, భటిండా, చండీగఢ్‌, నల్‌, ఫలోడి, ఉత్తర్‌లై, భుజ్‌లను లక్ష్యంగా చేసుకుని పాక్‌ సైన్యం దాడికి పాల్పడిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే భారత్‌ పాక్‌ కుటిల యత్నాలకు చెక్‌ పెట్టింది.

పాక్ ను నిలువరించిన భారత సైన్యం
మంగళవారం రాత్రి భారత సాయుధ దళాలు ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పిఓకె), పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్‌ కౌంటర్‌ అటాక్‌ ప్రయత్నాలు చేసింది. కానీ భారత్‌ దాయాది దేశాన్ని నిలువరించింది. ‘‘మే 7-8 రాత్రి, పాకిస్తాన్‌%ౌ% ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అవంతిపుర, శ్రీనగర్‌, జమ్మూ, పఠాన్‌కోట్‌, అమృత్‌సర్‌, కపుర్తలా, జలంధర్‌, లూథియానా, ఆదంపూర్‌, భటిండా, చండీగఢ్‌, నల్‌, ఫలోడి, ఉత్తరలై, భుజ్‌ ప్రాంతాల్లో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోని డ్రోన్లు, క్షిపణులను ప్రయత్నించింది’’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘వీటిని ఇంటిగ్రేటెడ్‌ కౌంటర్‌ %ఖAూ% (మానవరహిత విమాన వ్యవస్థ) గ్రిడ్‌, వాయు రక్షణ వ్యవస్థలు నేలమట్టం చేశాయని’’ అని ఒక ప్రకటనలో వెల్లడించింది. పాక్‌ ఉగ్రవాదుల తరహాలో దాడులు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని విమానయాన శాఖ సూచించింది. విమానాశ్రయ టెర్మినల్‌ భవనాల్లో సందర్శకులను అనుమతించవద్దని నిర్దేశించింది.

భారత్ లో హై అలర్ట్
మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనా సిద్ధంగా ఉండాలని సూచించింది. జమ్మూకశ్మీర్‌ లక్ష్యంగా పాక్‌ దాడులకు తెగబడింది. ముఖ్యంగా జమ్మూలోని విమాశ్రయమే లక్ష్యంగా డ్రోన్‌లను ప్రయోగించింది. భిష్ణా, ఆర్‌ఎస్‌ పురా, సాంబా, పూంచ్‌, కథువా ప్రాంతాల్లో షెల్లింగ్‌ దాడులు చేసింది. అయితే ఈ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా అఖ్నూర్‌, కిష్త్వార్‌, సాంబా, ఉధంపూర్‌లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు చేసింది. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో పాక్‌ డ్రోన్‌ దాడులు చేయగా, వాటని భారత సైన్యం కూల్చేసింది. మరోవైపు రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనేర్‌ సహా పలుప్రాంతాల్లో బ్లాక్‌అవుట్‌ ప్రకటించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌, జలంధర్‌, పఠాన్‌కోట్‌ సహా పలు ప్రాంతాల్లో (బ్లాక్‌ అవుట్‌) విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. పాక్‌ దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అదనపు పారామిలటరీ బలగాలను పంజాబ్‌కు తరలిస్తున్నారు.

ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న ప్రధాని
పాకిస్థాన్‌ దాడులు చేపట్టిన నేపథ్యంలో, జరుగుతున్న పరిణామాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడారు. మరోవైపు త్రివిధ దళాధిపతులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మరోవైపు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా సీడీఎస్‌, త్రివిధ దళాధిపతులతో పరిస్థితులను సమీక్షించారు. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినప్పటికీ, ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ, పర్యవేక్షిస్తూ తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా, సమాచారాన్ని సైన్యానికి చేరవేయాలని ప్రధాని సూచించారు.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News