Friday, April 3, 2026
33.2 C
Hyderabad

పాక్‌ను కోలుకోకుండా దెబ్బకొట్టాలి!

ముల్లును ముల్లుతోనే తీయాలి. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా ఉండాలి. పాక్‌ ఏర్పడడమే మత ఛాందసవాందతో ఏర్పడిరది. తాము భారత్‌ను చీల్చి ఏర్పడ్డామన్న జ్ఞానం వారిలో లేదు. అలాగే భారత్‌ భిక్షతో దేశంగా ఏర్పడ్డామన్న కృతజ్ఞత బంగ్లాదేశీయులకు లేదు. ఈ రెండు దేశాల్లో మిగిలిన అరకొర హిందువులను తన్ని తరిమేయడం..కశ్మీర్‌ సహా భారత్‌లో చిచ్చుపెట్టడం వీరి లక్ష్యంగా ఉంది. అది ఎప్పుడో రుజువయ్యింది. మనం శాంతి వచనాలు పలుకుతూ పోతే సమస్య పరిష్కారంకాదు. భారత్‌తో పెట్టుకుంటే అంతే సంగతులు అన్న విధంగా మన జవాబు ఉండాలి. రష్యా ఉక్రెయిన్‌పై దాడిచేసింది. ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై దాడులు చేస్తూనే ఉంది. ఇలాంటి దెబ్బలు మనం కూడా కొట్టగలగాలి. నష్టం కలిగినా ఫర్వాలేదు. దేశాన్ని పటిష్టం చేసే క్రమంలో మనమంతా త్యాగాలకు సిద్ధపడాలి. ఈ దేశాన్ని వందలాది ఏళ్లుగా ఎందరో దాడులు చేసి ధ్వంసం చేశారు. మనలను బానిసలుగా మార్చారు. ఇవన్నీ మనకు గుణపాఠం కావాలి. ఇంకా దాడులను తట్టుకుంటూ పోదాం అన్న పద్దతి మాత్రం మంచిది కాదు. పహల్గాం దాడి జరిగి వారం రోజులు అవుతోంది. పాక్‌ నుంచి శిక్షణ పొందిన ముష్కరులే దాడికి కారణమని తేలింది. ముంబై దాడులు కావచ్చు..పుల్వామా దాడి కావచ్చు…పహల్గామ్‌ కావచ్చు.. అన్నీ పాక్‌ కుతంత్రాల వల్లనే జరిగిన ఘటనలు. అయినా దాయాది దేశానికి బుద్ది రావడం లేదు. పహల్గాం దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్‌ మూసా పాక్‌ సైన్యంలో మాజీ పారా కమాండో అని దర్యాప్తులో తేలింది. దీనిని బట్టి పాక్‌ సైన్యంలో పనిచేసిన వారు ఆ తరవాత ఎలా ఉగ్రవాదులుగా మారుతున్నారో గమనించాలి. ప్రస్తుతం అతడు కరుడుగట్టిన టెర్రరిస్టుగా మారినట్లు దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి. పాక్‌కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్లు వెల్లడిరచాయి. ఆ సంస్థ మాస్టర్‌ మైండ్లే అతడిని కశ్మీర్‌కు పంపినట్లు- పేర్కొన్నాయి. ఇప్పటికే భారత సైన్యం ఉగ్రవాదులకు అనుకూలంగా పని చేస్తున్నారన్న అనుమానంతో వందల మంది స్థానికులను అదుపులోకి తీసుకొంది. వీరిలో 15 మంది ఉగ్రవాద ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్స్‌, మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని ధ్రువీకరించారని అధికారులు వెల్లడిరచారు. అతడు పాక్‌ స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ నుంచి లష్కరేలోకి సహాయకారిగా వచ్చినట్లు తెలుస్తోందని సైన్యం ధృవీకరించింది. ఇంతకన్నా ఆధారాలు ఇక అవసరం లేదు. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ ఎత్తేసిన తరవాత అక్కడ శాంతి నెలకొనడమే గాకుండా స్థానికులకు ఉపాధి దక్కుతోంది. పర్యాటకం పెరిగింది. అక్కడి యువతలో కూడా మార్పు వచ్చింది. వారంతా జనజీవన స్రవంతిలో కలిసి పోతున్నారు. దీనిని విచ్చిన్నం చేసే పన్నాగమే ఉగ్రదాడి అని తేలింది. కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఘటన అమాన వీయమైనదే కాదు…. మనిషన్నవాడు చేసే పని కాదు. ఇది కేవలం రాక్షస జాతి మాత్రమే చేస్తుంది. పాక్‌ పెంచి పోషిస్తున్న రాక్షసులు భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇందుకుమనం కూడా సన్నద్దం కావాలి. మరణించిన వారి ఆత్మకు శాంతి జరగాలి. ఉగ్రమూకలను చీల్చి చెండాడం ద్వారా మన సత్తా చాటాలి. అలాగే కాశ్మీర్‌లో ఉంటూ…ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న కొందరు పాక్‌ సానుభూతిపరులను కూడా గుర్తించి కఠినంగా శిక్షించాలి. వారిని కూడా ఉగ్రదాడులకు బాధ్యులను చేయాలి. భూతల స్వర్గంగా భావిస్తున్న కశ్మీర్‌ను చూడాలని వెళ్లిన పర్యాటకులను హతమార్చిన ఘటనను ఇప్పటికీ భారతీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నరమేధాన్ని ప్రపంచ దేశాలు అన్నీ తీవ్రంగా నిరసించాయి. కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన విధంగానే ప్రతిస్పందించింది. ఈ దుర్ఘటనకు కారణమైన ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టిఆర్‌ఎఫ్‌)ను, దానికి సహకారం అందించిన లష్కర్‌ ఎ తోయిబాను, దీనికి వెన్నుదన్నుగా ఉన్నదను కుంటున్న పాకిస్థాన్‌ను లక్షంగా చేసుకొని తక్షణ చర్యలు చేపట్టింది. తక్షణమే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను రద్దు చేయడం, నీటి ఒప్పందాలను వెనక్కు తీసుకోవడంతోపాటు ఇంకా అనేక చర్యలు చేపట్టింది. సరిహద్దులను మూసివేయడం కూడా వెంటనే అమలు చేశారు. అదే విధంగా దాడికి బాధ్యులైన వారి లక్షంగా గాలింపు ముమ్మరం చేశారు. ఇవన్నీ ఊహించినవే అయినా సరిపోవని గుర్తించాలి. ప్రజల్లో వస్తున్న తీవ్ర నిరసన కారణంగా దాడులకు తక్షణ చర్యలు ఉండాలి. ఇప్పటికే కాశ్మీర్‌లో వేలాదిమంది పౌరులు, సైనికులు నేలకొరిగారు. వేలాదిమందిని హత్యలు చేశాలరు. లక్షల మందిని మత మార్పిళ్లు చేశారు. ఇవన్నీ గమనించిన తరవాతనే కేంద్రం 2019లో 370 ఆర్టికల్‌ రద్దు చేసి కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని ఎత్తేసింది. దీంతో సాధారణస్థితికి వచ్చి కాశ్మీర్‌ పర్యాటకంగా మళ్లీ చిగురించింది. దీనిని జీర్ణించుకోలేని పాక్‌ పాపాల భైరవులు దాడులకు తెగించారు. ఈ క్రమంలో అసవరమైతే యుద్ధం దాకా కూడా భారత ప్రభుత్వం వెళ్లవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇక పాక్‌ను ఎంతమాత్రం నమ్మరాదు. పాముకు పాలుపోసి పెంచినట్లుగా మన గత పాలకులు పాక్‌ పాలకులకు చేయూతను ఇచ్చారు. అందువల్ల మనం ఎంతమాత్రం ఉపేక్షించరాదు. కష్టమైనా, నష్టమైనా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకుని రావాలి. రాజకీయపార్టీలు కూడా విభేదాలు పక్కన పెట్టి పాక్‌కు గుణపాఠం చెప్పే ప్రయత్నాలకు బేషరతు మద్దతు పలకాలి. అలాగే పాక్‌ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా ప్రతీకార చర్యలు ఉండాలి. అప్పుడే భారత్‌కు శాంతి. గత కొన్నేళ్లుగా మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News