Friday, April 3, 2026
33.2 C
Hyderabad

స్పందించ “వేం” !?

ఉలక’వేం’? పలక’వేం’!?
మౌనంగా ఉంటా”వేం”!?
– అజంజాహి కార్మిక భవనం కూల్చి రెండు నెలలైనా మాట్లాడ “వేం”!?
సీఎం ప్రధాన సలహాదారుగా మీ సూచనలేంటి?
సీఎం గారికి మీరిస్తున్న సలహాలేంటి?
కాంగ్రెస్ నేతగా కార్మికులకు ఏ కబురంపుతారు?
ఈ జిల్లా నేత గా మీ జవాబు ఏంటి?
మీ జోక్యం కోసం కోసం అజం జాహి కార్మిక లోకం ఆశగా ఎదురుచూస్తున్నది

కొందరికి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. కానీ కొందరికి అరుదైన అవకాశాలు వస్తాయి. రెండు కోవలకు చెందిన వారు వేం నరేందర్ రెడ్డి. కే సముద్రం మండలం అర్పణ పల్లె లో పుట్టిన ఆయన వరంగల్ సి కె ఎం కాలేజీలో డిగ్రీ చేసి, 2004లో మహబూబాబాద్ ఎమ్మెల్యే అయ్యారు. కాలక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారాల ప్రధాన సలహాదారుగా నియమింపబడ్డారు. ఆయనకు వరంగల్ చరిత్ర తెలుసు. ఆజం జాహి మిల్లు చరిత్రా తెలుసు. కార్మికుల సంగతి తెలుసు. మిల్లు కార్మిక భవన స్థలం కబ్జా సంగతీ తెలుసు. ఆ స్థలాన్ని ఎప్పుడు? ఎలా? ఏం? చేయాలో కూడా తెలుసు. సమస్య తెలుసు! పరిష్కారం కూడా తెలుసు!! అ(ఇ)న్నీ తెలిసిన, సీఎం కే సలహాలిచ్చే పొజిషన్ లో ఉన్న వేం నరేందర్ రెడ్డి మాత్రం మౌనం వీడటం లేదేం!? ఉలక’వేం’? పలక’వేం’!? మౌనంగా ఉంటా”వేం”!? అజం జాహి కార్మిక భవనం కూల్చి రెండు నెలలైనా మాట్లాడ “వేం”!? అంటూ “వేం” జోక్యం కోసం మిల్లు కార్మిక లోకం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని మరీ ఎదురుచూస్తున్నది.

వరంగల్ మట్టి పరిమళం వేం నరేందర్ రెడ్డి. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకుని, ఇక్కడే ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడి… ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుగా నియమింప పడ్డారు. ఆయన సీఎం కు సలహాలిచ్చే అసాధారణ స్థానంలో ఉన్నారు. ఇది వరంగల్ కే గర్వకారణం. ఇంతటి స్థాయి, స్థానంలో ఉన్న మనిషి నుంచి ఎవరైనా ఏం కోరుకుంటారు? కాస్త మంచి, వీలైతే ఓ మాట సాయం. అంతేగా!? కానీ ఆయన నుంచి ఓ మంచి మాట సాయాన్ని కోరుకున్న అజం జాహి మిల్లు కార్మికులు మాత్రం ఉలుకు, పలుకు లేని మౌనాన్ని ఎదుర్కొంటున్నారు. చారిత్రక అజంజాహి కార్మిక భవనం కబ్జాకు గురైంది. తప్పుడు దస్తావేజులతో అన్యాక్రాంతమైoది, ఓ బడా వ్యాపారి అక్రమ పర్మిషన్లు పొందాడు. కాంగ్రెస్ కే చెందిన ఓ ప్రజా ప్రతినిధి కొబ్బరికాయ కొట్టి, బహుళ అంతస్తుల భవనానికి శంకుస్థాపన చేశారు. కార్మికుల కళ్ళ ముందే వాళ్ళ కలల సౌధం, ఎన్నో కార్మిక ఉద్యమాల సాక్షీభూతం, కార్మిక దేవాలయం, కార్మిక భవనం నేలమట్టం అయింది. ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్నాయి. కార్మికులు, కార్మిక కుటుంబాలు, కాంగ్రెస్ సహా పార్టీలన్ని అఖిల పక్షమై, కార్మిక, ప్రజా సంఘాలన్నీ ఏకపక్షమై కోట్లాడుతున్నాయి. అది ముమ్మాటికీ కార్మిక భవన స్థలమే అనడానికి భవన శిలాఫలకం నుండి ఇంటి నెంబర్, ఇంటి పన్ను వరకు అవసరమైన అనేక ఆధారాలను బయట పెట్టారు. కార్మిక నాయకుల కాసుల కక్కుర్తిని, తప్పుడు దస్తావేజులతో చేపట్టిన కబ్జాని, నియమ నిబంధనలు అతిక్రమించిన అధికారుల అవినీతిని సాక్ష్యాలతో సహా ఎలుగెత్తారు. అయినా సరే, ప్రజాపాలనే గీటురాయిగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టలేదు. అధికారంలో ఉన్న ఏ ప్రజా ప్రతినిధి కీ ఇది తప్పని తోయలేదు. ఏ ఉన్నతాధికారికి తప్పును సరిదిద్దుకోవాలనిపించలేదు. సరిదిద్దే ప్రయత్నం ఏ కోణం నుంచీ జరగలేదు. ఒక అవినీతి కోణం వెనుక ఇంత మౌనమా?!

చివరకు మీలాంటి వారికి కూడా పట్టకపోతే, ఎవరికి పడుతుంది? ఇంకెవరిని అడగాలి సార్!? బహిరంగంగా అందరికీ తెలిసిన అజం జాహి లాంటి చారిత్రక మిల్లు కార్మిక స్థలానికే రక్షణ, దిక్కు దివాణం లేకపోతే, ఈ ప్రజా పాలనలో ఇంకెవరికి రక్షణ ఉన్నట్లు సార్?! మన ప్రజా పాలన ఫలాలు ఎవరికి అందుతున్నట్లు సార్? ప్రజలకేనా సార్?! పాలకులకా? ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నోళ్లకా సార్?!

అందుకే సార్, అజం జాహి మిల్లు కార్మికులు, కార్మికుల కుటుంబాలు, అఖిల పక్షాలు, అన్ని ప్రజా సంఘాలు, ప్రజలు అంతా కలిసి, ఈ మట్టి బిడ్డగా మిమ్మల్ని అడుగుతున్నారు. మిల్లు కార్మిక భవన స్థల కబ్జా పై సీఎం ప్రధాన సలహాదారుగా మీ సూచనలేంటి? సీఎం గారికి మీరిస్తున్న సలహాలేంటి? కాంగ్రెస్ నేతగా కార్మికులకు ఏ కబురంపుతారు? ఈ జిల్లా నేత గా మీ జవాబు ఏంటి? ఉలక ‘వేం’? పలుక ‘వేం ‘? మాట్లాడ ‘వేం’? అంటూ మీ ప్రతిస్పందన కోసం అఖిల పక్షం… ప్రజాపక్షమై… మీ జోక్యం కోసం అజం జాహి కార్మిక కుటుంబ లోకం ఆశగా ఎదురుచూస్తున్నది.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News