PALLA| పల్లాను కలిసి KOMMURI| కొమ్మూరి పరామర్శ
JANGAON| జనగామ POLITICS| రాజకీయాల్లో విమర్శ
జనగామ నియోజకవర్గ రాజకీయాల్లో ఒక ఊహించని కలయిక ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యే స్థానానికి ఒకరు BRS| బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరొకరు CONGRESS| కాంగ్రెస్ తరపున పోటీ చేసిన డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. అయితే ఆ ఎన్నికల్లో కొమ్మూరిపై 15,783 ఓట్ల తేడాతో పల్లా గెలిచారు. అప్పటి నుంచి వారి మధ్య రాజకీయ విభేదాలు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. విమర్శలు, విమర్శలకు ప్రతివిమర్శలు, బల ప్రదర్శనలు, దూషణలు తరచూ జరిగేవి. కానీ తాజాగా ఎమ్మెల్యే పల్లా స్వగృహంలో ఆయనను పరామర్శించేందుకు జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి వెళ్లిన విషయం రాజకీయంగా ఊహించని పరిణామంగా మారింది. ప్రమాదం అనంతరం ఇంట్లో పల్లా విశ్రాంతి తీసుకుంటుండగా, ఇంటికే వెళ్లి మరీ పరామర్శించిన కొమ్మూరి చర్యకు వెనుక రాజకీయ మతలబు ఉందా అనే చర్చ ప్రారంభమైంది. రెండు పార్టీల నేతలు సామాజికంగా ఒకే వర్గానికి చెందినవారైన నేపథ్యంలో ఈ కలయిక మరింత ఆసక్తికరంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో జనగామ జిల్లాలో చేర్యాల నియోజకవర్గం తిరిగి ఏర్పడే అవకాశం ఉండటంతో, ఆ నియోజకవర్గంలో పాగా వేయాలనే ఉద్దేశంతో కొమ్మూరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు చేరువ కాబోతున్నారా? పల్లా ద్వారా మళ్లీ టచ్లోకి వెళుతున్నారా? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. కొమ్మూరి గతంలో కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పల్లాను కలిసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనా, ఈ కలయిక జనగామ నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడిరాజేసింది. ఈ ప్రస్తుత పరిణామాలకు వారిరువురిలో ఎవరో ఒక్కరు సమాధానం చెప్పాలి. లేదంటే మాత్రం కాలమే సమాధానం చెప్తుంది.



