Friday, April 3, 2026
32.2 C
Hyderabad

మీకో దండం మీ పార్టీకో దండం

Bjp| బీజేపీకి Ghoshamahal| గోషామహల్ mla| ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా |resignation

Leaders| నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి,

Hinduism| హిందుత్వానికి తాను అంకితమంటూ లేఖ | letter

గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన రాజాసింగ్, భార‌తీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ నేతృత్వం తనను లక్ష్యంగా చేసుకొని మోసం చేసిందని, రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు పేరును ప్రకటించడంతో తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు రెండు పేజీల కృతజ్ఞతా, తన అభిప్రాయాల లేఖను ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు.

రాజాసింగ్ లేఖలో పేర్కొన్న విషయాలను చూస్తే, ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. లక్షలాది కార్యకర్తలు, ప్రజలు పార్టీలో విశ్వాసంతో నిలబడిన తరుణంలో, పార్టీ తొలి సారిగా తెలంగాణలో అధికారంలోకి రానుందన్న ఆశలు వ్యక్తమవుతున్న వేళ, పార్టీ అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం ఆశావాదాన్ని అణిచేసేలా ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం కేవలం వ్యక్తిగతంగా తనకే కాకుండా, అనేకమంది బీజేపీ కార్యకర్తలకు, నమ్మకమైన ఓటర్లకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు.

పార్టీలో అనుభవం కలిగిన ఎంతో మంది సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నప్పటికీ, వారికి అవకాశం ఇవ్వకుండా కర్టెన్ వెనుక ఉండే నేతల సూచనల మేరకు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్రంగా బాధించింది అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం తీసుకున్న నిర్ణయంగా రాజాసింగ్ భావిస్తున్నట్లు లేఖలో తెలిపారు . ఇది వేల మంది కార్యకర్తల త్యాగాలను విస్మరించడమేనని అన్నారు.

తాను బీజేపీకి అంకితమైన కార్యకర్తగా, ప్రజల ఆశీర్వాదంతో వరుసగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా, ఇలాంటి అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండలేనని పేర్కొన్నారు. ఇది వ్యక్తిగత కారణక వల్ల తీసుకున్న నిర్ణయం కాదని, కార్యకర్తల వేదనను ప్రతిబింబించడమే అని లేఖలో వివరించారు. తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, సరైన నాయకత్వాన్ని ఎంపిక చేయకపోవడం వల్ల ఆ ఆశను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రాజాసింగ్ తన లేఖ చివరి పేజీలో, పార్టీకి రాజీనామా చేసినా, హిందుత్వ సిద్ధాంతం, తన ధర్మ సేవ, గోషామహల్ ప్రజల పట్ల తన బాధ్యత మారదని పేర్కొన్నారు. హిందూ సమాజానికి తన సహకారం మరింత బలంగా కొనసాగుతుందని, ధైర్యంగా తన గొంతును వినిపిస్తానని స్పష్టం చేశారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునః ఆలోచించాలని ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్ తదితరులను కోరారు. తెలంగాణ బీజేపీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని, అలాంటి సమయంలో సరైన నాయకత్వాన్ని ఎంపిక చేసి ఆ అవకాశాన్ని వదులుకోకూడదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, తన రాజీనామాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెలంగాణ శాసనసభ స్పీకర్‌ ప్రసాద్ కుమార్ కి తెలియజేయాలని కోరారు. ఈ ఉదంతం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మూడుసార్లు గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం ద్వారా, పార్టీలో నూతన రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికతో భిన్నాభిప్రాయాలు, అంతర్గత సంఘర్షణలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వం సమీక్షిస్తే మంచిదని అనేక బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే రాజాసింగ్ ఇక నుంచి ఏ రాజకీయ నిర్ణయం తీసుకుంటారో, ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో అన్నది రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. అయితే ఆయన ఇప్పటికీ హిందుత్వ సిద్ధాంతానికి అంకితమని స్పష్టంగా చెప్పడం ద్వారా, రాజకీయ ప్రయాణం కొనసాగించే సూచనలు లేఖలో కనిపిస్తున్నాయి.

ఇక పార్టీ నాయకత్వంపై విమర్శలు చేసిన రాజాసింగ్ లేఖ బీజేపీలో చర్చలకు తావిస్తోంది. పార్టీ కేంద్ర నేతలు ఈ లేఖను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు, నాయకత్వ మార్పు పై మళ్లీ సమీక్ష జరగుతుందా? అన్నదానిపై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News