Friday, April 3, 2026
32.2 C
Hyderabad

రెచ్చగొట్టొద్దు!|KONDA MURALI

నన్నెవరూ పిలవలేదు
PARTY|పార్టీ మీద RESPECT|గౌరవంతో నేనే వచ్చా
DESCIPLINARY COMMITTEE|క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు
కమిటీకి ERSTWHILE WARANGAL|ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ వివరాలు
MLA|MLC|LEADERS|ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, నేతలపై ఫిర్యాదు
లోపల సంజాయిషీ
బయట అజమాయిషీ
‘కొండ’ దిగొచ్చినా… ‘మాట’ మారలే

హైదరాబాద్, జూన్ 28 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
‘నన్ను రెచ్చగొట్టొద్దు. నన్నెవరూ పిలవలేదు. నేనే వచ్చాను. నా బాడీలో ఇంకా నాలుగు బుల్లెట్లున్నాయి. బీసీ బిడ్డ టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మీద, పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చాను. మా కుటుంబాన్ని కొందరు పనిగట్టుకుని వేధిస్తున్నారు. మంత్రి పదవి పోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. కడియం వచ్చాకే సమస్యలు మొదలయ్యాయి. మంత్రి సీతక్కతో ఓకే, మంత్రి పొంగులేటి కక్షగట్టారు. నాయిని రాజేందర్ రెడ్డి, బస్వరాజు సారయ్యతో కలిసి మా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. వేం నరేందర్ పాత కోపంతో ఉన్నారు. పరకాల నాదే. నాయిని, రేవూరిలను నేనే గెలిపించాను. గండ్ర కోసం సీటు వదులుకున్నాను. సీఎం రేవంత్ రెడ్డి అంటే అభిమానిస్తాను. రాహుల్ ని ప్రధాని చేయడమే నా లక్ష్యం’ అంటూ మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి రకరకాలుగా వ్యాఖ్యానించారు. ఒకవైపు క్రమశిక్షణ కమిటీకి సంజాయషీ ఇచ్చుకున్నట్లుగానే లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చి, అందులో తన గత వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. పార్టీకి తానే పెద్ద దిక్కుగా పేర్కొంటూ, అందరినీ గెలిపించానని, తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. బయటకు వచ్చాక తిరిగి తన అజమాయిషీని ప్రవర్తించారు. విలేకరులు అడిగిన ‘ఆత్మగౌరవం మీకే కాదు కదా, మీరు తిట్టిన వాళ్ళకు కూడా ఉంటుంది కదా?’ అంటే ‘నన్ను రెచ్చగొట్టద్దం’టూ బాణీ మార్చేశారు. తిరిగిన తన మూసలో పడి వ్యాఖ్యలు చేసేశారు. తాను దిగి వచ్చినట్లే వచ్చి, తాను మారలేదని, తన మాట కూడా మారదని తేల్చిపడేశారు.

మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఈ నెల 19న రాహుల్ జన్మదిన వేడుకల సందర్భంగా పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలపై తమకు అందిన ఫిర్యాదుల మేరకు వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కోరింది. అయితే, వివరణకు బదులు ఫిర్యాదు ఇవ్వడంతో వారంలోగా లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని, అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఇదిలావుంటే, కొండా మురళి ఇచ్చిన ఫిర్యాదు మరోసారి కాంగ్రెస్ లో సంచలనంగా మారి, చర్చనీయాంశమైంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసిన కీలక నేతగా కొండా మురళి శనివారం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కమిటీ తనను ఎలాంటి ప్రశ్నలు అడగకపోయినా, తానే స్వయంగా ఆరోపణలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. కాంగ్రెస్ కి తాను నిబద్ధత కలిగిన కార్యకర్తనని, బీసీల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని చెప్పారు. తనను రెచ్చగొట్ట వద్దని, బెదిరించే ప్రయత్నాలు చేయొద్దని, చావుకే భయపడని వ్యక్తినని స్పష్టం చేశారు. తన శరీరంలో ఇంకా నాలుగు బుల్లెట్లున్నాయని స్పష్టం చేశారు.
మరోవైపు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన 6పేజీల ఫిర్యాదులో అనేక అంశాలు ప్రస్థావించారు. గతంలో తాను, తన భార్య మంత్రి కొండా సురేఖ గత పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరామన్నారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుండే సమస్యలు మొదలయ్యాయన్నారు. పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సురేఖ, సీతక్కల మధ్య తప్పుడు ప్రచారాలతో విభేదాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్టేషన్ ఘన్ పూర్ లో ఇందిరను కూడా ఇబ్బందీ పెడుతున్నారన్నారు.
పరకాల నియోజకవర్గం తమదేనని, రేవూరి ప్రకాష్ రెడ్డిని తాము గెలిపించామన్నారు. ఇప్పుడు రేవూరి గూడుపుఠాని రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. నాయిని రాజేందర్ రెడ్డి తనకు సంబంధం లేని తూర్పులో ప్రభుత్వ పోస్టులను ఇప్పిస్తున్నాడన్నారు. నాయినికి ఎమ్మెల్సీ సారయ్య, మంత్రి పొంగులేటి కలిసి సహకరిస్తున్నారన్నారు. పొంగులేటి మామ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డికి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి తన మీద కోపమన్నారు. గత పునర్విభజనలో వారి నియోజకవర్గాలు రిజర్వ్ కావడానికి తానే కారణమన్నది వారు మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారన్నారు. ఈ తరహా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి మచ్చ తేల్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
అయితే, తాను పార్టీ మారినప్పుడు రాజీనామా చేశానని, తనతో పాటు 26 మంది కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ కి తెచ్చానని ఆ ఫిర్యాదులో చెప్పారు. తన లాగే ఇప్పుడు వచ్చిన వారు రాజీనామాలు చేస్తారా? లేదా అనేది వారికే వదిలేస్తున్నానన్నారు. మరోవైపు పీసీసీ చీఫ్, సీఎంలపై గౌరవ మర్యాదలు ప్రకటిస్తూనే, రాహుల్ ని ప్రధాని చేయాలన్నారు. ఇప్పుడు కొండా మురళి ఫిర్యాదు సరే, వివరణ ఎలా ఉండబోతోందన్నదే ఆసక్తిగా మారింది.
మొత్తంగా, కాంగ్రెస్‌లో ప్రాంతీయ ఆధిపత్య పోరాటాలు, విభేదాలు పార్టీకి ప్రధాన సమస్యలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండా మురళి లేఖపై అధిష్టానం తీసుకునే నిర్ణయాలే కీలకంగా మారనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే ఈ వ్యవహారం, రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
…….

ఫిర్యాదులు సరే, వివరణ ఏది?
అడిగిన ప్రశ్నలకు మాత్రమే జవాబులివ్వండి
కొండా మురళికి క్రమశిక్షణ కమిటీ ఆదేశం

హైదరాబాద్, జూన్ 28 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
‘వివరణ అడిగితే, ఫిర్యాదులు ఇచ్చారు. సరే, క్రమశిక్షణ కమిటీ అడిగిన ప్రశ్నలకు మాత్రమే జవాబులు చెప్పండి. వారం రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వండి. పరిశీలించి మా నిర్ణయం మేం తీసుకుంటాం.’ అని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ఆదేశించింది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలపై మురళీ చేసిన వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదుల మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా మురళిని వివరణ కోరింది. అయితే శనివారం భారీగా వాహనాలతో గాంధీ భవన్ కు చేరిన కొండా మురళి, క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. 6 పేజీల ఫిర్యాదును అంద చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి జిల్లాలో తమ కుటుంబ పాత్ర, కావాలనే కొందరు నేతలు తమపై కక్ష గట్టి దుష్ప్రచారం చేస్తున్నారని, వాటికి గల కారణాలతో సహా అందులో వివరించారు. నియోజకవర్గాల వారీగా ఎవరేంటి? అనే అంశాలను కూలంకశంగా అందులో పేర్కొన్నారు. ఆ లేఖను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవికి అంద చేశారు. అయితే, కమిటీ అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు కావాలని, వారంలోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని మురళిని ఆయన ఆదేశించారు.

Warangal KM Report

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News