Friday, April 3, 2026
35.2 C
Hyderabad

ఐక్యత కోసమే నా ప్రయత్నం|Raja Singh

కిషన్ రెడ్డి |kishan Reddy వ్యాఖ్యలపై రాజాసింగ్ |Raja Singh

Goshamahal| గోషామహల్ MLA| ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ నోట్ విడుదల చేశారు. “రాజాసింగ్ సీనియర్ నాయకుడు, నేను కేవలం సామాన్య కార్యకర్త” అని కిషన్ రెడ్డి అన్న వ్యాఖ్యలతో పాటు, “రాజాసింగ్ చెప్పినదాన్ని మేము పాటిస్తాము” అనే వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్ పార్టీలో తన స్థానమేమిటో స్పష్టంగా వివరించారు. పార్టీ పట్ల తనకు ఉన్న ప్రేమను, అనుభవాలను వివరించడంతో పాటు, ప్రస్తుత పరిణామాలు పార్టీ ఐక్యతకు హానికరం అవుతాయని హెచ్చరించారు.

రాజాసింగ్ తన ప్రకటనలో, తన ఉద్దేశం ఎప్పుడూ పార్టీ బలోపేతమేనని, వ్యక్తిగత పదవులు, తన లబ్ది కోసమేమీ కృషి చేయలేదని చెప్పారు. పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నదే తన ధ్యేయమని, పార్టీ సేవ చేయడమే తన ధ్యేయంగా ఉందన్నారు. కానీ, తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించాలన్న లక్ష్యాన్ని మరిచి, ఒక్కరినే లక్ష్యంగా చేసుకుని అడ్డంకులు సృష్టించడం తీవ్ర అసంతృప్తికి కారణమవుతోందన్నారు. అయినప్పటికీ, తాను ఎప్పటికీ పార్టీకి అంకితంగా పని చేస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన ప్రశ్నను రాజాసింగ్ అడుగుతూ, “ఇది పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా?” పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెట్టడం ద్వారా ఏమాత్రం లాభం లేదని, ఇది పార్టీ పటిమకు హాని కలిగించే అంశమని అన్నారు. తన వ్యక్తిగత గౌరవం కన్నా, పార్టీ ఐక్యతను కాపాడడమే తన మొదటి ప్రాధాన్యతగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ ఓ విన్నపం చేశారు. “మాకు కొంత సమయం కేటాయించండి. నేను, ఇతర కార్యకర్తలు వ్యక్తిగతంగా మీకు కలుసుకుని సమస్యలు వివరించదలిచాము. ఇది విభేదాల కోసం కాదు, ఐక్యత కోసం” అని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఎప్పుడైనా మీ నిర్ణయం మేరకు మేము కలుసుకోడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

తమ లక్ష్యం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమేనని, ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని, అందుకే వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.తమ ప్రయాణం పైన పార్టీ నాయకత్వం పునరాలోచించాలని సూచించిన రాజాసింగ్, చివరగా “జై హింద్, జై బీజేపీ” అంటూ తన ప్రకటనను ముగించారు.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News