TELANGANA|తెలంగాణ THALLI|తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో CONGRESS|కాంగ్రెస్, BRS|బీఆర్ఎస్ వర్గాల ఘర్షణ
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి గొడవ తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అది తోపులాట, కొట్టుకోవడం వరకు దారి తీసింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వం రోడ్డు వెడల్పులో భాగంగా అంతకు ముందు వున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసివేసి పోలీసు స్టేషన్ లో భద్రపరిచారు. రోడ్డు పనులు పూర్తి అయిన తర్వాత ఏర్పాటైన ఒక కూడలిలో విగ్రహం కోసం రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన గద్దెపై BRS పార్టీ ప్రభుత్వ కాలం నాటి పాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ అభ్యంతరం తెలుపుతుండగా, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చాక ఆమోదించిన అధికారిక తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని కాంగ్రెస్ నాయకులు ఇలా రెండు పార్టీలు గొడవ పడుతుండగా కాంగ్రెస్ పార్టీలో వున్న తెలంగాణ ఉద్యమకారులు అక్కడే సెంట్రింగ్ వేసి నిర్మాణం చేపట్టారు. దీనిపై ఆగ్రహించిన బీఆర్ఎస్ నాయకులు మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్ రావు, మండల అధ్యక్షులు పసునూరి నవీన్ ల నేతృత్వంలో కార్యకర్తలు నిన్న ఉదయం నుండి 2 సార్లు ధర్నా చేయగా 3వ సారి స్వయంగా వారే గద్దెపై వేసిన స్లాబును కూల్చివేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ సమయంలో బిఆర్ఎస్ నాయకులు అధికారిక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దు అని కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ ఎంపీపీ గడ్డం యాకసోమయ్య, మొళుగూరి యాకయ్య, గడ్డం బాబు, నారగోని ఎల్లయ్య లపై దాడి చేయగా వారికి గాయాలు అయ్యాయి. పోలీసుల రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడగా నివారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మళ్లీ అడ్డుగా వచ్చి గద్దె స్లాబ్ ను కూల్చి వేయటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

JHANSI REDDY|ఝాన్సీ రెడ్డి పరామర్శ
ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాలకుర్తి ప్రైవేట్ దవాఖానలో దాడిలో గాయపడ్డ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, గద్దె నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాలకుర్తి పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఏసిపి నర్సయ్య ను కలిసి మా కార్యకర్తలను కొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీసులు మరిన్ని ఘటనలు జరగకుండా అర్ధరాత్రి వరకు రాజీవ్ చౌరస్తాలో పోలీసు బలగాలు మోహరించాయి.
విగ్రహ ఏర్పాటు

ఈ ఘటనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పక్కా ప్లాన్ తో తెల్లవారుజామున 12 గంటల వరకు నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు అక్కడే కూర్చొని దగ్గరుండి గద్దె నిర్మాణం చేయించి అధికారిక తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించారు.
రాష్ట్రంలో రెండవ విగ్రహం మనదే – MLA|ఎమ్మెల్యే యశస్విని|YASHASWINI

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక సెక్రటేరియట్ లో మొదటి విగ్రహం ఏర్పాటు చేయగా, రెండవ విగ్రహం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. బి.ఆర్.ఎస్ నాయకులు కావాలనే విగ్రహ ఏర్పాటు విషయంలో చిల్లర చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పినా… కూడా వారు మారలేదన్నారు.
ప్రభుత్వ అనుమతి ఉంది – నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి

పాలకుర్తిలో ఏర్పాటు చేస్తున్న అధికారిక తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రభుత్వ అనుమతి తీసుకున్నట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఎర్రబెల్లి చిల్లర రాజకీయాల రూపమే ఈ విగ్రహ ప్రతిష్ఠ గొడవ అని అన్నారు. అలాగే ఇదే సందర్భంలో మా కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా వదిలేది లేదని, వారి సంగతి తెలుస్తానని చెప్పారు.

