Friday, April 3, 2026
32.2 C
Hyderabad

రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి|KTR|REVANTH REDDY

సీఎం ఛార్జ్‌షీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

TELANGANA|తెలంగాణ CM|ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు NATIONAL HERALD|నేషనల్ హెరాల్డ్ చార్జ్‌షీట్‌లో ఉండటం రాష్ట్ర ప్రజలకు అవమానకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నైతికత, నిజాయితీ ఉంటే రేవంత్ స్వయంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ ఆయన్ని పదవి నుంచి తప్పించాల్సిందిగా కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో బాగ్‌మేన్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ రూట్ స్కామ్‌లో కీలకపాత్ర పోషించారని, ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంగా వాడుతున్న దానికి నిదర్శనమని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు ఈడీ చార్జ్‌షీట్‌తో నిజమని రుజువైందని తెలిపారు. ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో, ఏ పదవుల కోసం ఇచ్చారో, ఎన్ని మొత్తాల్లో పంపారో ఈడీ స్పష్టంగా వెల్లడించిందన్నారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

తెలంగాణ సీఎం పదవిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్‌కు ముడుపులు పంపుతున్నారని, 17 నెలల్లో 44 సార్లు ఢిల్లీకి వెళ్లడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పారని ఎద్దేవా చేశారు. అమిత్ షా కాళ్లు పట్టుకుంటూ కేసుల నుంచి తప్పించుకోవాలని వేడుకుంటారని, బయటకి వచ్చాక పెద్ద ఫోజులు కొడతారని విమర్శించారు. లక్షా ఎనభై వేల కోట్ల అప్పు చేసి ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని, ఒక్క హామీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. తెలంగాణ సంపదను దోచుకుని ఢిల్లీకి పంపే రాజకీయ కమిషనర్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశం చుట్టేస్తున్నా, తన పార్టీ సీఎం అవినీతిపై మాట్లాడడం లేదన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు స్పందించగా, రేవంత్ మాత్రం జపాన్ పర్యటన పేరుతో తప్పించుకోవడం అనుమానాస్పదమన్నారు. మౌనం వీడని కారణం తనపేరూ చార్జ్‌షీట్‌లో వచ్చే అవకాశం ఉందన్న భయమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

తెలంగాణ బీజేపీ నేతలు కూడా రేవంత్ అవినీతిపై మౌనంగా ఉండటం, కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న కుమ్మక్కునకు నిదర్శనమన్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్‌పై బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తుంటే, అదే కేసులో ఉన్న రేవంత్‌పై మాత్రం తెలంగాణ బీజేపీ నేతలు మౌనం వహించడం పాక్షికతకు ఉదాహరణగా పేర్కొన్నారు. పోంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు జరిగి ఏడాది అయినా ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా బయటకు రాలేదని, 45 కోట్లు వాల్మీకి స్కామ్ ద్వారా తెలంగాణకు వచ్చాయని రిమాండ్ డైరీలోనే ఈడీ పేర్కొన్నదని గుర్తు చేశారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

సివిల్ సప్లై స్కామ్‌పై తమ వద్ద ఆధారాలతో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. అమృత్ కుంభకోణంలో రేవంత్ బావమరిది శోధా కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అర్హత లేకుండా రూ.1137 కోట్ల టెండర్లు అప్పగించారని పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో కేంద్ర ఎంపవర్ కమిటీ నివేదిక ఇచ్చినా కేంద్రం చర్యలు తీసుకోలేదని, ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య అవినీతి ఒప్పందాలకు ఉదాహరణ అన్నారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఎలాంటి అవినీతి జరగలేదని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం మంత్రులే బహిరంగంగా 30 శాతం కమిషన్ అడుగుతున్నారన్న ఆరోపణలు వెలువడుతున్నాయని, ఇది రేవంత్ ప్రభుత్వానికి గుణపాఠమని అన్నారు. సీఎం‌కు పిల్లనిచ్చిన ఆయన మామే కాళేశ్వరంపై అవినీతి ఆరోపణలు అవాస్తవమని పేర్కొంటున్నారని చెప్పారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

మీడియా కొన్ని పత్రికలు నేషనల్ హెరాల్డ్ చార్జ్‌షీట్‌లో రేవంత్ పేరుని సైతం ప్రచురించలేదని, ఎంత తాపత్రయపడ్డా ప్రజలెప్పుడో నిజాలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీగా బీఆర్‌ఎస్‌లో ఎవరైనా అధ్యక్షుడికి సూచనలు చేయవచ్చని, గతంలోనూ అనేక మంది నేతలు లేఖలు రాశారని చెప్పారు. కోవర్టులు ఎవరో బయటపడతారని వ్యాఖ్యానించారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

కేటీఆర్ చివరగా హెచ్చరిస్తూ, ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలంటూ గవర్నర్‌ను కలవనున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే నెలరోజుల్లో తమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. కేంద్రాన్ని, బీజేపీని ప్రజలముందు ఎండగడతామన్నారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News