Friday, April 3, 2026
32.2 C
Hyderabad

అచ్చంపేటను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం

మాచారంలో భావోద్వేగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం

నాగర్‌కర్నూల్ జిల్లా మాచారంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్రజలను ఉద్దేశించి భావోద్వేగంతో మాట్లాడారు. “నల్లమల బిడ్డగా ఈ గడ్డపై నిలబడి మాట్లాడటం నాకు గర్వకారణం” అంటూ తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అచ్చంపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు విశేష ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే అధికారులకు తగిన సూచనలు చేశామని, రైతుల పక్షాన పోరాడే ప్రభుత్వంగా నిలుస్తామని స్పష్టం చేశారు.

పోడు భూముల విషయంలో గత ప్రభుత్వాల తీరుపై విమర్శలు చేస్తూ, పోరాడిన వారిని జైలుకు పంపిన చరిత్ర వారి దెబ్బతిన్న పాలనకు నిదర్శనమని అన్నారు. ఇక తమ ప్రభుత్వ హయాంలో పోడు భూముల్లో వ్యవసాయం చేయేందుకు సోలార్ పంపుసెట్లు అందించడం ద్వారా రైతులకు బలాన్నిచ్చామని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రతి రైతుకూ సోలార్ పంపుసెట్ అందించేలా చర్యలు చేపట్టామని, రాబోయే వంద రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం రూ.60 వేల కోట్లను ఖర్చు చేసిందని సీఎం గుర్తు చేశారు. ముఖ్యంగా సన్నాలు పండించే రైతులకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వడం, పేదలందరికీ సన్న బియ్యం సరఫరా చేయడం వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్న బియ్యం, 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.

మహిళల కోసం ఉచిత ఆర్టీసీ ప్రయాణం అందిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు అవకాశాలిచ్చామని, ఆడబిడ్డలను RTC బస్సులకు యజమానులుగా చేస్తూ వారి ఆధిక్యాన్ని చాటామన్నారు. వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి స్వయం సహాయక సంఘాల మహిళలకు బాధ్యత అప్పగించిన ఘనత తమదేనన్నారు. ఆదానీ, అంబానీలకు పోటీగా మహిళలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణను దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని, 60 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలుపెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు. కేంద్రం సైతం నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో ఉంచిన రాష్ట్రంగా తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపిందని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలోనూ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు.

చివరిగా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని పట్టించుకోనని, పథకాలను అనుభవించే ప్రజలే తమకి న్యాయమైన సమాధానమని స్పష్టం చేశారు. రుణమాఫీ, ఉచిత బస్సులు, విద్యుత్ వంటి పథకాలు ప్రజలకు గుర్తుండిపోతాయని, తప్పుడు ప్రచారాలు ప్రజలను మోసగించలేవని అన్నారు. “ఇందిరమ్మలా, నేను కూడా ప్రజల గుండెల్లో నిలవాలన్నదే నా లక్ష్యం” అంటూ ప్రసంగాన్ని ముగించారు.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News