తెలంగాణలో IAS అధికారుల బదిలీలు
సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా పలువురు IAS అధికారులను బదిలీలు చేసింది. బదిలీలు ఇలా ఉన్నాయి.
- డాక్టర్ శశాంక్ గోయెల్ (IAS, 1990 బ్యాచ్) ను డిటి.ఎంసిఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ పదవి నుంచి బదిలీ చేసి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అలాగే, ఆయన్ను EPTRI డైరెక్టర్ జనరల్ అదనపు బాధ్యతల్లో ఉంచారు.
- జయేశ్ రంజన్ (IAS, 1992) ను ఐటీ, ఈసీ, క్రీడా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బదిలీ చేసి, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇండస్ట్రీ & ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓగా మరియు SPEED ప్రాజెక్టు బాధ్యతలతో కూడిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అదనంగా యాటీ అండ్ సి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మరియు పురావస్తు శాఖ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
- సంజయ్ కుమార్ (IAS, 1995) LET&F శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను బదిలీ చేసి, పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, క్రీడా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
- ఎం.దాన కిషోర్ (IAS, 1996) మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బదిలీ చేసి, ఇప్పుడు కార్మిక శాఖ LET&F ప్రధాన కార్యదర్శిగా మారారు. అదనంగా లేబర్ కమిషనర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్, మరియు ఉపాధి శిక్షణ డైరెక్టర్ బాధ్యతలను కూడా అప్పగించారు. ఇక గవర్నర్ కార్యాలయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవిలో కూడా కొనసాగుతారు.
- స్మిత సబర్వాల్ (IAS, 2001) ని ట్రాన్స్ఫర్ చేసి, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించారు.
- డాక్టర్ టీకే శ్రీదేవి (IAS, 2004) మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ మరియు డైరెక్టర్ పదవి నుంచి బదిలీై, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శిగా నియమించబడ్డారు. బయట HMDA పరిధిలో మున్సిపాలిటీలకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించారు.
- ఇలంబరిథి (IAS, 2005) జిహెచ్ఎంసీ కమిషనర్ పదవి నుంచి బదిలీై, మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ (హెచ్ఎండిఎ పరిధి) కార్యదర్శిగా నియమితులయ్యారు.
- ఆయన స్థానంలో ఆర్వీ కర్ణన్ (IAS, 2012) డైరెక్టర్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి బదిలీై, జిహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు.
- కె.శశాంక (IAS, 2013) స్టేట్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ కమిషనర్గా ఉన్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా నియమితులయ్యారు. మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ పదవిలో అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు.
- ఎస్.హరీష్ (IAS, 2015) సమాచార పౌర సంబంధాల ప్రత్యేక కమిషనర్ గా ఉండగా, ఇప్పుడు తెలంగాణ జెన్కో CMDగా నియమించబడ్డారు. ఇదే సమయంలో I&PR శాఖ ప్రత్యేక కార్యదర్శి అదనపు బాధ్యతలు కూడా కొనసాగిస్తారు.
- కె.నిఖిల (IAS, 2015) TGIRD CEOగా ఉండి, ఇప్పుడు తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యదర్శి మరియు CEOగా అదనపు బాధ్యతలు చేపట్టారు.
- ఎస్.సంగీత సత్యనారాయణ (IAS, 2015) సీఎం కార్యాలయం జాయింట్ సెక్రటరీగా ఉన్న ఆమెను హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ గా నియమించారు. అదనంగా ఆరోగ్యశ్రీ CEO బాధ్యతను కూడా చేపట్టారు.
- ఎస్.వెంకట రావు (IAS, 2015) ప్రోటోకాల్ డైరెక్టర్ పదవి నుంచి బదిలీై, దేవాదాయ శాఖ డైరెక్టర్గా నియమితులయ్యారు. యాదాద్రి దేవస్థానం EO బాధ్యతలు కూడా చేపట్టారు.
- పి.కాత్యాయని దేవి (IAS, 2017) స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి బదిలీై, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) అదనపు CEOగా నియమితులయ్యారు.
- ఈవీ నర్సింహారెడ్డి (IAS, 2017) స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పదవి నుంచి బదిలీై, ఇండస్ట్రీ & ఇన్వెస్ట్మెంట్ సెల్ (SPEED) అదనపు CEOగా నియమితులయ్యారు. ముసీ నది అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యత కూడా చేపట్టారు.
- భోర్ఖాడే హేమంత్ సహదేవరావు (IAS, 2018) TGMSIDC మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి బదిలీై, GHMC జోనల్ కమిషనర్గా నియమితులయ్యారు.
- జి.ఫణీంద్ర రెడ్డి (IAS, 2018) చీఫ్ రేషన్ ఆఫీసర్ హైదరాబాదు నుంచి బదిలీై, TGMSIDC మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు.
- పి.కధిరవన్ (IAS, 2020) హైదరాబాదు అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) నుంచి బదిలీై, గ్రామీణాభివృద్ధి శాఖలో జాయింట్ కమిషనర్గా నియమితులయ్యారు.
- కె.విద్యాసాగర్ (నాన్-కేడర్), ప్రధాన కార్యదర్శి కార్యాలయం OSDగా ఉన్న ఆయనను అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) హైదరాబాదు గా నియమించారు. చీఫ్ రేషన్ ఆఫీసర్ హైదరాబాదు బాధ్యతలు కూడా చేపట్టారు.
- రూపేందర్ రెడ్డి (నాన్-కేడర్) ను హెచ్ఎండిఎ కార్యదర్శిగా నియమించారు.
ఈ ఉత్తర్వులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ద్వారా జీఓ (గెజిట్) విడుదల చేశారు.

