Friday, April 3, 2026
33.2 C
Hyderabad

‘అడుగు’ నిలిచింది! ‘బడి’ గెలిచింది!!

అడుగుఎఫెక్ట్!
పాలకుర్తి హై స్కూల్ కి రూ.30 లక్షల ‘అమ్మ’ నిధి
చొరవతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్వినీ సన్నిధి
మంజూరు చేసిన కలెక్టరే విద్యార్థుల పాలిట పెన్నిధి
‘అడుగు’కు వెల్లువెత్తుతున్న అభినందనలు

అవును. పాలకుర్తి హై స్కూల్ పక్షాన ‘అడుగు’ నిలిచింది. ‘బడి’ని ‘బార్’ గా మార్చిన ఆకతాయిలను, అసాంఘిక వ్యక్తులను నిలదీసింది. సమస్యలను ఏలికలు, పాలకుల ద్రుష్టికి తీసుకెళ్ళింది. అడుగు కథనాలకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ లు స్పందించారు. పాఠశాల సమస్యలను, విద్యార్థుల కష్టాలను సానుభూతితో అర్థం చేసుకున్నారు. వెంటనే నిధులు మంజూరు చేసి తమ సహానుభూతిని చాటుకున్నారు. శంకుస్థాపన చేసి సోమవారం పనులను కూడా ప్రారంభించారు. దీంతో ‘అడుగు’ నిలిచింది. 45 రోజుల్లోనే ‘బడి’ గెలిచిందంటూ సర్వత్రా ‘అడుగు’పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

జనగామ జిల్లా పాలకుర్తి హై స్కూల్ దుస్థితిపై ‘అడుగు’ లో వచ్చిన కథనాలకు పాలక, అధికార యంత్రాంగం కదలింది. వెంటనే నిధులు మంజూరు చేసింది. పనులను కూడా ఎమ్మెల్యే శయస్వినీ రెడ్డి సోమవారం ప్రారంభించారు. పాలకుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ పై ‘అడుగు’ లో అనేక వరస కథనాలు వచ్చాయి. ఈ ఏడాది మార్చి 4వ తేదీన ‘‘పగలు ‘సాగు’ బడి!, రాత్రి ‘తాగు’ బడి!!,’’ మార్చి 5వ తేదీన ‘‘ఇదేం ఏలు ‘బడి’! నైట్ వాచ్ మన్ లేరు, స్వీపర్లు ఊడ్చేయరు, పంతుళ్ళు పట్టించుకోరు, రెండేళ్ళ కిందే గేట్లు తీసేశారు. పెట్టిన రెండు నెలలకే డిగ్రీ కాలేజీని ఎత్తేశారు. నాంచారు మడూరుకు మార్చేశారు. ఖాళీగా గ్రౌండ్ లో కట్టిన కొత్త భవనాలు. గ్రౌండ్ లో లేని సిసి కెమెరాలు, ‘బడి’నే ‘బార్’ గా మార్చిన మందు బాబులు. ఆకతాయిలకు అడ్డాగా బడి. అనే శీర్షికలు, ఉప శీర్షికలతో వచ్చిన కథనాలకు జిల్లా అధికారులు స్పందించారు. ఎమ్మెల్యే సైతం వెంటనే స్పదించి కలెక్టర్ తో మాట్లాడారు. ఈ వార్తా కథనాలకు అప్పుడే స్పందించిన జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పదో తరగతి పరీక్షల సన్నాహక సమావేశంలో స్వయంగా కల్పించుకుని, హెడ్ మాస్టర్ తో మాట్లాడి, వెంటనే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పథకం కింద నిధులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అంచనాలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయమై కూడా ‘అడుగు’ మార్చి 6వే తేదీన ‘‘ఏలు ‘బడి’! కథనాలతో కదిలిన అధికార యంత్రాంగం, ఎంఇఓలు, హెచ్ఎంల మీటింగులో అడుగు కథనాలను ప్రస్థావించిన కలెక్టర్. హెచ్ఎంను అడిగి మరీ నిధులుచ్చిన జిల్లా ఉన్నతాధికారి. పాలకుర్తి బడికి టాయిలెట్లు, గేట్లు, ప్రహారీ గోడ సీసీ కెమెరాలు’’ కూడా అంటూ… అలాగే, ఎంఇఓ సందర్శనం, స్కూల్ ఆవరణ పరిశుభ్రం.. హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు. అమ్మ అదర్శ పాఠశాల నిధులతో వెంటనే ఏర్పాటుకు ఆదేశాలు. ‘అడుగు’కు అభినందనల వెల్లువ…’’పై కూడా వార్తా కథనాలను ‘అడుగు’ ప్రచురించింది. అలాగే ‘‘మరి స్వీపర్లు, నైట్ వాచ్ మన్ ల సంగతేంటి?’’ అంటూ ‘అడుగు’ ప్రశ్నించింది. ఈ వరుస కథనాలతో స్పందించిన పాలకుర్తి ఎమ్మెల్యే శయశ్వినీ, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలన్న విషయమై కూడా అడుగు కథనాలను రాసిన విషయాలన్నీ పాఠకులకు విధితమే.

పాలకుర్తి హై స్కూల్ కు రూ.30 లక్షలు మంజూరు
అయితే, అటు ఎమ్మెల్యే, ఇటు జిల్లా కలెక్టర్ ఇచ్చిన మాట నిలుపుకుంటూ, పాలకుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ కు నిధులు మంజూరు చేశారు. అంసంపూర్తిగా ఉన్న ప్రహారీ గోడలు, గేట్లు, టాయిలెట్ల మరమ్మతులు, కొత్తగా మరికొన్ని టాయిలెట్లు వగైరాల కోసం మొత్తం రూ.30లక్షలు మంజూరు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వు (ఆర్.సి నెంబర్ 464/B2/SSAAPC/2025) లు జారీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఎఎపిసి) కింద జనగామ జిల్లాలోని 15 స్కూల్స్ కి 78.883 లక్షల రూపాయలు మంజూరు కాగా, అందులో 30.065 లక్షల రూపాయలు పాలకుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ కే కేటాయించడం విశేషం.

పాలకుర్తి హై స్కూల్ కి మైనర్ రిపేర్స్ కింద మూడు యూనిట్లకు రూ.6.70 లక్షలు, ఉపయోగించలేని విధంగా ఉన్న ఒక బాయ్స్, ఒక గాల్స్ టాయిలెట్స్ మరమ్మతుల కోసం ఒక్కో యూనిట్ కు రూ.35వేల చొప్పున మూడు యూనిట్లకు రూ.లక్షా 6వేల 500లు, అలాగే కొత్తగా నిర్మించనున్న 6 కొత్త టాయిలెట్స్ కోసం ఒక్కో యూనిట్ కు రూ.లక్షా 50వేల చొప్పున మొత్తం రూ.22 లక్షల 30వేలను మంజూరు చేశారు. కాగా, ప్రహారీ గోడ, టాయిలెట్స్ కు కలిపి మొత్తం రూ.30లక్షల 6వేల 500 మంజూరయ్యాయి.

పాఠశాల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
ఈ నిధులతో చేపట్టాల్సిన పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. పనులు వెంటనే ప్రారంభించి, సాధ్యమైనంత తొందరలోనే వాటిని పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అడుగు’కు అభినందనల వెల్లువ
దీంతో మరోసారి ‘అడుగు’కు అభినందనలు వెల్లువెత్తాయి. ఒక సామాజిక సమస్యపై అందునా ఎంతో విలువైన విద్యాబోధనకు సంబంధించిన పాఠశాల వసతుల విషయమై సమస్యలను ఎలుగెత్తడమేకాకుండా, వాటి పరిష్కారానికి ధైర్యంగా వరస కథనాలు రాసి, అండగా నిలవడం, అవి పరిష్కారమయ్యే దాకా వెరువక, వెనుదిరగక వెంటపడటాన్ని పలువురు అభినందిస్తున్నారు. అంతేకాదు ఆయా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం, అందుకనుగుణంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ స్పందించడం, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ నిధులు మంజూరు చేయడం, ఆ పనులను వెంటనే ప్రారంభించి, పూర్తి చేసే విధంగా ఎమ్మల్యే శంకుస్థాపన పూర్తి చేయడం వరకు ‘అడుగు’ ఆ పాఠశాల సమస్యల పరిష్కారానికి కట్టుబడి, నిబద్ధతతో నిలబడినందుకు పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రత్యేకించి ఎమ్మెల్యే యశస్వినీ ప్రజల పక్షాన వేస్తున్న ‘అడుగు’ కథనాలను అభినందించారు. అలాగే ‘అడుగు’ కథనాల వల్లే పాఠశాలకు సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికిందని, సదుపాయాలు సమకూరుతున్నాయని పాలకుర్తి హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి క్రుతజ్నతలు, ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, పాలకుర్తి ప్రముఖులు సైతం ‘అడుగు’ను అభినందించారు.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News