Friday, April 3, 2026
33.2 C
Hyderabad

ఎప్పటికైనా… తెలంగాణను కాపాడేది మేమే

భద్రాచలంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

భద్రాచలంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ కార్యకర్తలకు ఆత్మీయ భరోసానిచ్చారు. కేసీఆర్ గారికి, పార్టీ కార్యకర్తలకు తాను వారధిగా ఉండి, వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను చేపడతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ చిన్న అవసరమైనా నేరుగా తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడం తాను వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం బీఆర్ఎస్ కార్యకర్తల ప్రథమ కర్తవ్యం అని, కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్‌పైనే ఉందని చెప్పారు.

ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా ఒక్క నిర్ణయం కూడా ప్రయోజనకరం కాలేదని విమర్శించారు. “ఆత్మీయ భరోసా” పేరుతో పేదలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్, డబ్బులు ఇవ్వకుండా ప్రజల నమ్మకాన్ని వంచించిందని అన్నారు. “మన కళ్లముందే తెలంగాణ ఆగిపోతుంటే చూస్తూ ఊరుకోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉంది” అంటూ ఆమె పిలుపునిచ్చారు. అప్పులపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, 2004లో అస్తిత్వమే లేని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ పదేళ్లపాటు తెలంగాణ ప్రజలను ఏడిపించి, చివరకు వందలాది మంది యువకులను కోల్పోయిన తర్వాతే తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. ఈ రోజు లక్షా 60 వేల కోట్ల అప్పు తెచ్చిన కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని, తెచ్చిన అప్పును ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు. రూ. 40 వేల కోట్ల విలువైన భూములను కేవలం రూ. 10 వేల కోట్లకే తాకట్టు పెట్టిన ప్రభుత్వాన్ని నిలదీయాలని, రైతు భరోసా, రుణమాఫీ పేరుతో చేసిన ప్రకటనలు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. 60 శాతం రైతులకు రుణమాఫీ రాకపోగా, 50 శాతం మందికి రైతు భరోసా అందలేదని అన్నారు. మరి ఈ రూ.10 వేల కోట్లు ఎక్కడికి పోయాయో ప్రభుత్వం చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు బయటకు తెలంగాణ వ్యక్తుల్లా కనిపించినా, వారి చర్యలు తెలంగాణ వ్యతిరేకంగానే ఉన్నాయని ఆరోపించారు. 16 నెలలు గడిచినా ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయారని, కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి హామీలే ఇచ్చిందని విమర్శించారు. అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టిన ఘనత పూర్తిగా కేసీఆర్‌దేనని, ఆయన ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా పని చేశారని కొనియాడారు.

సీతారామ ప్రాజెక్టును నిర్మించి 3.5 లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత కూడా కేసీఆర్‌కే చెందుతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి శ్రీరామరక్ష లాంటి బీఆర్ఎస్ పార్టీ అవసరమని, ఈ ఉద్యమం ఖమ్మం జిల్లాలో పుట్టి రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించిందని గుర్తు చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు కాంగ్రెస్ పార్టీలోకి మారిన డబ్బా నాయకుడిగా పేర్కొంటూ, ఉప ఎన్నిక వస్తే గెలుపు బీఆర్ఎస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.

ద్రోహులు, కుట్రలు కనిపించాయి, ఎదురయ్యాయి కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాంగ్రెస్ మోసం చేస్తుందని కేసీఆర్ పదే పదే చెప్పారని, మోసం చేయడం కాంగ్రెస్ స్వభావమని తేల్చిచెప్పారు.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News