Friday, April 3, 2026
32.2 C
Hyderabad

ఆకాశంలో సగం…!అవకాశాల్లో సమం!!

-అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పథకాల మహోత్సవం

ఆకాశంలో సగం. ఈ భూమి మీద సగం. జనాభాలో సగం. అవకాశాల్లోనూ సమంగా ఉండాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి నేత్రుత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసమే అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. మహిళల సాధికారతే లక్ష్యంగా పని చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలకు పెద్దపీట వేస్తూనే, మిగతా అనేక పథకాలను అమలు చేస్తున్నది. మహిళలే లబ్ధిదారులుగా ఆయా పథకాలను అందిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘అడుగు’ పాఠకుల కోసం ఆయా పథకాల వివరాలు.

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.

మహాలక్ష్మి
రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇప్పటివరకు దాదాపు 148.51 కోట్ల మంది మహిళలు జీరో టికెట్లు తీసుకున్నారు. ప్రయాణ ఛార్జీల భారం తగ్గిపోవటంతో దాదాపు రూ.4970.56 కోట్లు మహిళలకు ఆదా అయింది.

గృహ జ్యోతి
గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడే గృహ వినియోగదారులందరికీ జీరో బిల్లులు జారీ చేసింది. మార్చి నుంచి ఇప్పటివరకు 50 లక్షల కుటుంబాలకు ప్రతి నెలా ఉచితంగా గృహ విద్యుత్తును అందిస్తుంది. ఈ జీరో బిల్లులకు ప్రభుత్వం రూ.1775 కోట్లు సబ్సిడీగా చెల్లించింది.
రూ.500లకే గ్యాస్ సిలిండర్
మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ప్రస్తుతం ఈ పథకం కింద 42.90 లక్షల మందికి లబ్ధిచేకూరుతోంది. సబ్సిడీ కింద లబ్ధిదారులు ఉపయోగించిన 1 కోటి 63 లక్షల 08 వేల 833 సిలిండర్లకు రూ. 433.21 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది.

ఇందిరమ్మ ఇండ్లు
మార్చి 11న రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. రూ.22,500 కోట్లతో 4,50,000 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇందిర‌మ్మ ఇళ్లను మంజూరు చేసింది. రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. గూడు లేని వారికి ప్రభుత్వ స్థలంతో పాటు ఆర్థిక సాయం అందిస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ప్రారంభించింది.

మహిళలకు తగిన గుర్తింపు
ఇవేగాక, ప్రభుత్వం ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ రూ. 2 కోట్ల పారితోషకం అందచేసింది. 2024 ఏడాదిని రైతు మహిళా యువత నామ సంవత్సరంగా సంకల్పించింది.
కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో స్వయం సహాయక మహిళా సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా సమావేశమయ్యారు. మహిళా రక్షణ కోసం టీ సేఫ్ ను సీఎం ప్రారంభించారు. టీ సేఫ్ ద్వారా మహిళల భద్రత కోసం ప్రయాణ పర్యవేక్షణ జరుగుతున్నది. కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టారు. పారా ఒలింపిక్స్ లో క్యాంస పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవంజికీ కోటి రూపాయలు చెక్కు అందజేత. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా స్వయం సహాయక సభ్యుల సంఖ్య 65 లక్షల నుంచి కోటి మందికి పెంపు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి, సమానత్వానికి పోరాడిన సావిత్రిబాయి ఫూలే జయంతి (జనవరి 3)ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిష కు కోటి రూపాయలు, ఇదే టీం మెంబర్ తెలంగాణ కు చెందిన ధృతి కేసరి కి 10 లక్షల రూపాయలు, టీం హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి పది లక్షల చొప్పున ప్రోత్సహకాలు అందచేశారు.

1.బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి ద్యారా రుణ మద్దతు: వచ్చే ఐదేళ్ళలో బ్యాంకు బ్యాంకు లింకేజీ, స్తీ నిధి ద్వారా స్వయం సహాయక సంఘాలు రూ.1 లక్ష కోట్లకు రుణం పొందుతాయి. రూ.20వేల కోట్ల లక్ష్యం కాగా, ఈ ఆర్థిక ఏడాదిలో సంఘాలు మొత్తం రూ. 21,632 కోట్ల బ్యాంకు లింకేజీ లక్ష్యాన్ని సాధించాయి. సూక్ష్మ సంస్థల ఆర్థిక సహాయంలో భాగంగా ఈ ఏడాది 2 లక్షల 25వేల110 సంస్థలు మొత్తం రూ.4,825.54 కోట్ల విలువతో ఏర్పాటయ్యాయి.

2.ఇందిరా మహిళా శక్తి భవనాలు: మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం 22 జిల్లా సమాఖ్యల కోసం రూ.110 కోట్ల వ్యయంతో 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేసింది. 15వేల చ. అ. విస్తీర్ణంలో ఈ భవనం 2 అంతస్తులను కలిగి ఉంటుంది. ఈ భవనాన్ని జిల్లా సమాఖ్య సమావేశాలు, సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్‌, శిక్షణా కేంద్రంగా, ఉమ్మడి పని ప్రదేశంగా, ప్రదర్శనల నిర్వహణ, సరస్‌ మేళాలు, ఇతర జీవనోపాధి/ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగిస్తారు.

3.ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు: స్వయం సహాయక సంఘాల మహిళలను శక్తివంతం చేయడానికి కమ్యూనిటీ ఆధారిత క్యాంటీన్లను ప్రారంభించింది. ఈ క్యాంటీన్లు పూర్తిగా మహిళల యాజమాన్యం, నిర్వహణలో ఉంటాయి, ఇవి సచివాలయం, కలెక్టరేట్లు, రిజిస్ట్రేషన్‌, మున్సిపల్‌ కార్యాలయాలు, కోర్టులు, కళాశాలలు, దవాఖానాలు, దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, పారిశ్రామిక పార్కులు మొదలైన వివిధ సంస్థలను సందర్శించే పౌరులకు నాణ్యమైన, శుచి, రుచి, శుభ్రమైన ఇంటి శైలి భోజనం అందించబడుతుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 214 క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి.

4.ఇందిరా మహిళా శక్తి బజార్‌: గ్రామీణ కళాకారులను ప్రపంచ మార్కెట్‌ తో అనుసంధానింస్తూ, సంఘాల సాధికారత కోసం ప్రభుత్వం శిల్పారామంలోని 106 దుకాణాల సముదాయాన్ని కేటాయించింది. ఈ సముదాయంలో ఫుడ్‌ కోర్ట్‌, స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, యాంఫిథియేటర్‌, ఆహార ఉత్సవాలు ఉంటాయి.

5.విద్యార్థులకు యూనిఫాంలు కుట్టడం: పాఠశాలల యూనిఫాం కుట్టే పనిని మహిళా సంఘాలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుట్టు ఛార్జీలను రూ.50 నుండి రూ.75కి పెంచింది. 2024-25లో 2,259 మహిళా శక్తి కుట్టు కేంద్రాలు 29,680 స్వయం సహాయక సంఘాల మహిళా దర్జీలను నియమించాయి. 37,58,988 యూనిఫాంలను కుట్టడం ద్వారా మొత్తం రూ.728.09 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి.

6.అమ్మ ఆదర్శ పాఠశాల: ప్రతి పాఠశాలలో ఏర్పడిన ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల” ద్వారా రూ. 634 కోట్ల విలువైన 23,701 పనులు అమలు చేయబడ్డాయి. ఈ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలు మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, తరగతి గదులను పునరుద్ధరించదానికి వీలు కల్పిస్తుంది.

7.ప్రమాద, రుణ బీమా: సంఘాల మహిళలకు ఆర్థిక భద్రతను కల్పించడానికి, సమ్మిళిత బీమా పథకం అమలు చేస్తున్నారు. రూ. 2 లక్షల రుణ బీమా ఉంది. ఇప్పటివరకు 3,066 క్లెయిమ్‌లు నమోదయ్యాయి. రూ.10 లక్షల ప్రమాద బీమా వథకం సభ్యులందరికీ అందుబాటులో ఉంది.

8.మొబైల్ ఫిష్‌ రిటైల్ అవుట్‌లెట్లు: మహిళల జీవనోపాధిని మెరుగుపరచడానికి, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద మత్స్య శాఖ, సెర్ప్ ఆర్థిక సహాయంతో మొబైల్‌ ఫిష్‌ రిటైల్‌
అవుట్‌లెట్‌లను (MFROలు) మంజూరు చేసింది. మొదటి దశలో, 60% సబ్సిడీతో ఒక్కొక్కటి
రూ.10 లక్షలతో 32 యూనిట్లు ఒక్కో జిల్లాకు ఒకటి చొప్పున మంజూరయ్యాయి. రెండవ దశలో అదనంగా 64 యూనిట్లు మొదలవుతాయి.

9.సోలార్‌ పవర్‌ ప్లాంట్లు: ఇందిరా మహిళా శక్తి పథకం కింద SHGen లేదా వాటి సమాఖ్యల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి 19 నవంబర్‌ 2024న SERP, TGREDCO, TGSPDCL, TGNPDCL మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా, తెలంగాణ 1000 MW సోలార్‌ పవర్‌ను ఉత్పత్తి చేయాలని, జీవనోపాధిని మెరుగుపరచాలని, 2030 నాటికి దేశంలోని ఖనిజ, ఇంధనేతర లక్ష్యాలకు సహకరించాలని భావిస్తోంది.

10.స్వయం సహాయక సంఘాల మహిళల కోసం ఆర్టీసి బస్తులు: మహిళా సంఘాలకు ఆర్థిక స్వావలంబన కల్పించే వినూత్న నిర్ణయం. ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపుతో మహిళలు అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు పడింది. మొదటి విడత 150 మండల సమాఖ్యలకు 150 బస్సులు, త్వరలో మిగిలిన 450 బస్సులు అంద చేస్తారు. ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ అందించి మద్దతునిస్తుంది.

11.జిల్లా సమాఖ్యలకు పెట్రోల్‌ బంకులు: మహిళా శక్తి విధానం కింద, ముఖ్యమంత్రి నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్యల ద్వారా నిర్వహిస్తున్న మొట్ట మొదటి పెట్రోల్‌ బంకును రూ.1.23 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. త్వరలో అన్ని నియోజకవర్గాలలో విస్తరించడానికి నిర్ణయించారు.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News