Friday, April 3, 2026
33.2 C
Hyderabad

రచ్చకు ముందే చర్చలు!

అడుగు ఎఫెక్ట్

ఎమ్మెల్యేలతో భేటీలు!!

-తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పరిణామాలపై ఎఐసిసి సీరియస్

-నష్ట నివారణకు నడుం బిగించాలని అధిష్ఠానం ఆదేశం

-స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయానికి దిశానిర్దేశం

-రంగంలోకి దిగిన సీఎం, పిసిసి, ఎఐసిసి పరిశీలకురాలు

-రెబెల్స్ తోపాటు ఎమ్మెల్యేలందరితో నేడు రేవంత్ భేటీ

-నాలుగు గ్రూపులుగా ఎమ్మెల్యేలు

– ముగ్గురు కీలక నేతల చర్చలు

– ఎమ్మెల్యేలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు

– మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య సమన్వయం

– ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి విస్తృత ప్రచారం

– స్థానిక ఫలితాలను బట్టే.. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో నష్ట నివారణకు ఓ ‘అడుగు’ పడింది. ‘అడుగు’లో ఫిబ్రవరి 3న ‘‘తిరుగుబాటా? తిరుగుబావుటా? టార్గెట్ ఎవరు? రేవంతా? పొంగులేటా?’’, ఫిబ్రవరి 4న ‘‘మంత్రివర్గమా? మా గోడు వినుమా..! ఏడాది దాటింది.. ఏమీ చేయలేకపోతున్నామయ్యా!’’ ఇదీ ఎమ్మెల్యేల మనోగతం’’ అనే శీర్షికలతో తెలంగాణలో ప్రస్తుత పరిణామాలు, ఎమ్మెల్యేల సమస్యలు, పరిష్కారాలతో కూడిన సమాచారంతో అడుగు డిజిటల్ మీడియా ఎక్స్లూజివ్ గా అందించిన వరస కథనాలకి అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రభుత్వం స్పందించింది. అంతర్గత సవరింపులకు, సర్దుబాట్లకు సమాలోచన చేస్తున్నది. అధిష్ఠానం దిశా నిర్దేశం మేరకు రెబెల్స్ తో పాటు ఎమ్మెల్యేందరితోనూ గురువారం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలకు నిధులు, విధులు అప్పగిస్తూనే, వచ్చే స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టనున్నారు.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ పరిణామాలపై ఎఐసిసి సీరియస్ అయిందా? ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం-అసంతృప్తి నేపథ్యంలో ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే కస్సుబుస్సులాడారా? ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని రాహుల్ రఫాడించారా? ఈ ఆదేశాలు, దిశానిర్దేశాలు ఎలా ఉన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎఐసిసి నుంచి రాష్ట్ర పరిశీలకురాలు దీపా దాస్ మున్షీలు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా సమావేశమైన ఆ 8 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే మిగతా పార్టీ ఎమెల్యేలందరినీ నాలుగు గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపుతో ముగ్గురు ప్రత్యేక నేతలు భేటీ కానున్నారు. అనంతరం వారితో సీఎం సమావేశమై అందరితోనూ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఎమ్మెల్యేల సమస్యలు తెలుసుకుని అందుకు తగిన విధంగా నిధులు, విధులు, మంత్రులతో సమన్వయం, సీఎంగా తనతో తరచూ కలిసే అవకాశాలపై రేవంత్ చర్చించనున్నారు.

ముందుగా ఆ 8 మందితోనే భేటీ
ముందుగా ప్రత్యేకంగా సమావేశమైన ఆ 8మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పెద్దలు భేటీ కానున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఒక హోటల్ లో 8 మంది ఎమ్మెల్యేలు డిన్నర్ కు కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేలుగా గెలిచి ఏడాది గడిచినప్పటికీ, ఏమీ చేయలేకపోతున్నామని వాపోయారు. సీఎం అపాయింట్ మెంట్ దొరకడం లేదని, మంత్రులు పట్టించుకోవడం లేదని, నియోజకవర్గంలో ప్రజలు తిరుబాటు చేసే పరిస్థితులు వచ్చాయని వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. భేటీ అయిన వారిలో అనిరుధ్ రెడ్డి (జడ్చర్ల), భూపతిరెడ్డి (నిజామాబాద్ రూరల్), యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్ నగర్), మురళీనాయక్ (మహబూబాబాద్), కూచకుళ్ళ దామోదర్ రెడ్డి (నాగర్ కర్నూలు), సంజీవరెడ్డి(నారాయణ్ ఖేడ్), దొంతి మాధవరెడ్డి (నర్సంపేట), బీర్ల అయిలయ్య (ఆలేరు) ఉన్నారు. వారు ప్రత్యేకంగా సమావేశం ఎందుకు కావాల్సి వచ్చింది? మీడియాతో ఎందుకు మాట్లాడారు? వారి సమస్యలు ఏంటి? వారి పరిష్కారాలేంటి? అనే అంశాలపై ఓ క్లారిటీకి రానున్నారు.

ఎమ్మెల్యేలందరితోనూ సమావేశం
అనంతరం మంత్రులను కలుపుకుని, కాంగ్రెస్ పార్టీ మిగతా ఎమ్మెల్యేందరితోనూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎఐసిసి నుంచి రాష్ట్ర పరిశీలకురాలు దీపా దాస్ మున్షీలు సమావేశం కానున్నారు. వేర్వేరుగా ఎమ్మెల్యేల సమస్యలేంటి? ఉమ్మడిగా ఏమేమి ఉన్నాయి? వాటి పరిష్కార మార్గాలేంటి? వంటి అంశాలను చర్చించనున్నారు.

ఎమ్మెల్యేలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు
నియోజకవర్గాల పురోగతికి ప్రత్యేకంగా ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చే విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటించనున్నారు. కనీసం రూ.50 నుంచి రూ.100 కోట్ల చొప్పున ఎమ్మెల్యేకు ఇచ్చే విషయమై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. శాఖల వారీగా వచ్చే నిధులు, రొటీన్ నిధులపై కూడా ఎమ్మెల్యేలకు సరైన అవగాహన కల్పించి, దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు తెలిసింది.

మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య సమన్వయం
ఇదిలావుండగా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సరైన సమన్వయం కుదిర్చే విధంగా ఈ సమావేశం సాగనుంది. మంత్రులు… ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వాలని, వారు తీసుకువచ్చే సమస్యలపై సానుకూలంగా స్పందించాలని, ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే వారికి స్పష్టతనివ్వాలని సూచించనున్నారు. ప్రజా పనులపై వెంటనే స్పందించాలని మంత్రులను ఆదేశించనున్నారు. సమన్వయంతో కలిసికట్టుగా పని చేసే విధంగా విష్పష్టత రానుంది.

ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి విస్త్రుత ప్రచారం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో నేరుగా ప్రజలను కలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించుకుని, ప్రభుత్వ పథకాల అమలును వారికి వివరించాలని చెప్పనున్నారు. అధికారులను, ఎమ్మెల్యేలను మంత్రులు కలుపుకుని పోవాలని ఆదేశించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నదని, మిగతా అన్ని హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని ప్రజలకు వివరించాలని ఆదేశించనున్నారు. రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా నిధులు రైతుల ఖాతాల్లో పడుతున్న విషయాలను కూడా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.

స్థానిక ఫలితాలను బట్టే.. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతలు
రానున్న స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం, పార్టీ అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం చెప్పనున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచే విధంగా సంసిద్ధండా ఉండాలి. ఈసారి స్థానిక ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం లభించనుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలి. ఆ బాధ్యతలు జిల్లాల ఇన్ చార్జీ మంత్రులు, ఎమ్మెల్యేలదేనని, స్థానిక ఫలితాలను బట్టి, ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతులుంటాయని స్పష్టం చేయనున్నారు.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News