శుక్రవారం తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, పర్యావరణ, అటవీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కొండా సురేఖ, ఎంపీ బలరాంనాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. లకు గిరిజన పూజారులు, ఎండోమెంట్ అధికారులు సన్నాయి, డోలువాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు.

