హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ
ముఖ్యఅతిథులు గా హాజరైన ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు
పాలకుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా ఐదు మండల కేంద్రాల్లో హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. కొడకండ్ల దేవరుప్పుల మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు ఎమ్మెల్యే హనుమాండ్ల యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు, పెద్దవంగర తొర్రూరు రాయపర్తి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ ట్రస్ట్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలిచిన వారికి మోమెంటోలు, మొదటి స్థానం వారికి ఐదు వేల రూపాయలు, రెండవ స్థానం వారికి మూడు వేల రూపాయలు, మూడవ స్థానం వారికి రెండు వేల రూపాయల చొప్పున అందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం అన్నారు. మహిళల సృజనాత్మకతను పెంపొందించడం లక్ష్యమని వివరించారు. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడం కోసం కూడా ఈ ఆలోచన చేశామన్నారు. మా చారిటబుల్ ట్రస్టు సమాజ శ్రేయస్సు కోసమే పని చేస్తుందని చెప్పారు. ఈ పోటీలు మహిళ శక్తి, సామర్థ్యాలను వెలికి తీసే ప్రయత్నం మాత్రమేనని, పాలకుర్తి నియోజకవర్గంలో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడానికి రూపకల్పన చేస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమాల్లో తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమండ్ల తిరుపతిరెడ్డి, అన్ని మండలాల మహిళా కాంగ్రెస్ నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు.





