Friday, April 3, 2026
32.2 C
Hyderabad

నేడు PALAKURTHI|పాలకుర్తిలో అఖండ జ్యోతి|AKHANDA JYOTHI

జ్యోతి ప్రజ్వలనం చేయనున్న శ్రీశ్రీశ్రీ రామానంద ప్రభుజీ, ఎమ్మెల్యే యశస్విని|MLA|YASHASWINI

భారీ ఎత్తున తరలిరానున్న భక్తులు

అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

పాలకుర్తి, నవంబర్ 4 (అడుగు న్యూస్):
ఆధ్యాత్మికత, విశ్వాసం, భక్తి పరవశం సమ్మేళనంగా జనగామ జిల్లా, పాలకుర్తి మండలకేంద్రంలో స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అఖండ జ్యోతి మహోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత పదకొండు ఏళ్లుగా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జరిపే ఈ మహోత్సవం ప్రజల్లో ఆధ్యాత్మికంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని, దక్షిణ భారతదేశంలో అఖండజ్యోతి నిర్వహిస్తున్న 3వ దేవస్థానంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సంవత్సరం ఈ మహోత్సవంలో భక్తజనసంద్రం ఈసారి మరింతగా పెరిగే అవకాశముందని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

అఖండ జ్యోతి మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ పరిసరాల్లో దీపాలంకరణలు, పుష్పాలంకరణలు విశేష వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం వున్న పద్ధతి ప్రకారం పీఠాధిపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారుఈ సంవత్సరం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రాజారామ్మోహన్ రెడ్డి దంపతులు, ఆధ్యాత్మిక పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ రామానంద ప్రభుజీ తో కలిసి స్వయంగా అఖండ జ్యోతి ప్రజ్వలనం చేయనున్నారు. ఈ సందర్భంగా వారు భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణ, లక్ష దీపోత్సవం తో పాటు జ్యోతి ప్రజ్వలనంకు ముందు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజలు ధర్మం, సత్సంకల్పం, ఐక్యత అనే సందేశంతో అఖండ జ్యోతి నుంచి వెలువడే ఆధ్యాత్మిక కాంతిని స్వీకరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యంగా ఆలయ పూజారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ అఖండ జ్యోతి సందర్భంగా భక్తుల రాకపోకలు, భద్రతా చర్యలను సిఐ జానకిరామ్ రెడ్డి స్వయంగా ఆలయ పరిసరాలను పరిశీలించారు. పోలీసు సిబ్బంది, వాలంటీర్లను సమన్వయం చేస్తూ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, తాగునీరు, వైద్య సహాయం వంటి అంశాల్లో కూడా పూర్తి ఏర్పాట్లు చేయబడుతున్నాయని తెలిపారు.

మొత్తానికి, ఈసారి పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అఖండ జ్యోతి మహోత్సవం భక్తి, విశ్వాసం, సంస్కృతి, శాంతి విలువలను ప్రతిబింబించే మహోత్సవంగా నిలవబోతోంది. వేలాది మంది భక్తులు పాల్గొని జ్యోతి దర్శనంతో దైవానుగ్రహం పొందేందుకు సిద్ధమవుతున్నారు. దివ్య జ్యోతి వెలుగుతో పాలకుర్తి ప్రాంతం ఆధ్యాత్మిక కాంతితో ప్రకాశించబోతోంది.

అఖండ జ్యోతి అనేది సృష్టి తత్త్వానికి ప్రతీక. దీపం వెలిగించడం అంటే మనలోని చీకట్లు తొలగించి జ్ఞానాన్ని వెలిగించడం. ఈ ఆలయంలో గత 11 ఏళ్లుగా అఖండ జ్యోతి మహోత్సవం జరుపుతున్నాం. కార్తీక మాసం శివకేశవులకు ఇరువురికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం కావున శివకేశవులను దర్శించి పూజించి తరించవలసిందిగా కోరుచున్నాము.

-దేవగిరి లక్ష్మన్న
ఆలయ ప్రధాన అర్చకులు

భక్తి పరవశంతో అఖండ జ్యోతి ముందు ప్రార్థన చేసినవారికి అనుగ్రహం లభిస్తుంది. ఈ సంప్రదాయాన్ని తరతరాలుగా కొనసాగించడం మన సంస్కృతికి గర్వకారణం. శ్రీ సోమేశ్వర స్వామి ఇలవేలుపు భక్తుడికి దశాబ్ద కాలం క్రితం స్వామి వారు స్వప్నం లో సాక్షాత్కరించి అరుణాచలం వలె క్షీరగిరి పైన కూడా అఖండ జ్యోతి వెలిగించమని కోరగా ఆ భక్తుడు గత 11 సంవత్సరాల క్రితం ఆరంభం చేసిన ఈ కార్యక్రమం నేటికి 11 వ వార్షిక ఉత్సవం గా దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం

-దేవగిరి రమేష్ శర్మ
ఆలయ ఉప ప్రధాన అర్చకులు

అఖండ జ్యోతి ప్రజ్వలన సమయంలో వాయు, అగ్ని, ఆకాశం తత్త్వాలు సమతుల్యమవుతాయి. ఆ దివ్య శక్తిని అనుభవించడం భక్తుల పుణ్యం. కార్తీక పౌర్ణమి రోజున దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి, దీపారాధన చేసి, అఖండ జ్యోతి దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం

-దేవగిరి అనిల్ శర్మ
ఆలయ అర్చకులు

అఖండ జ్యోతి కేవలం దీపం కాదు, అది దైవానుగ్రహానికి ప్రతిరూపం. ఇక్కడ పూజించిన ప్రతి ఒక్కరికీ శాంతి, సంపద, ఆరోగ్యం లభిస్తాయి కావున భక్తులు హాజరై పాలకుర్తి స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని తరించండి.

-మత్తగజం నాగరాజు శర్మ
ఆలయ అర్చకులు

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News