Friday, April 3, 2026
35.2 C
Hyderabad

మాటల్లేవ్… తూటాలే!

  • మాట్లాడుకోవడాలు అసలే లేవ్!

  • నిషేధిత సంస్థతో చర్చలు జరిపే ప్రసక్తే రాదు!?

  • తాజా, మాజీ సీఎంలు పోటీపడి ప్రకటనలెందుకు?

  • మావోయిస్టులు నేతలను చంపినప్పుడు ఎక్కడున్నరు?

  • దమ్ముంటే మావోయిస్టులపై నిషేధం ఎత్తేయగలరా!?

  • నక్సలిజాన్ని సామాజిక కోణంలో చూడటం తప్పు

  • మావోయిస్టులు పోలీసులను చంపినప్పుడు ఈ సంఘాలెందుకు స్పందించలేదు?

  • గిరిజనుల సాకుతో చర్చల ప్రస్థావన మంచిది కాదు

  • చర్చలు జరిపే ప్రసక్తే లేదు

  • వాళ్లు తుపాకీ వీడాల్సిందే

  • పోలీసులకు లొంగిపోవాల్సిందే

కేంద్ర ప్రభుత్వం ఇక మావోయిస్టులతో శాంతి చర్చలు జరపబోదని తేలిపోయింది. ఆరు నూరైనా, నూరు ఆరైనా ‘ఆపరేషన్ కగార్’ ఆగదని అర్థమైంది. వామ పక్ష తీవ్రవాదం సామాజిక సమస్య కానేకాదని, ఉగ్రవాదంతో సమానమైన తీవ్రవాదమేనని రాజ్యం తన సహజ ధోరణిలో పునరుద్ఘాటించింది. గిరిజనుల సాకుతో చర్చలను ప్రస్థావించవద్దని, మావోలు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందేనని హెచ్చరించింది. తుపాకులు పట్టుకున్న వారితో చర్చలేంటని ప్రశ్నించింది. నిషేధిత సంస్థతో చర్చలు జరిపే ప్రసక్తే రాదని భవిష్యత్ దర్శనం చేసింది. కర్రె గుట్టల్లో ఎర్రని రక్తం, పచ్చని అడవుల్లో వెచ్చని నెత్తురు పారడం అనివార్యమని, ఆగిపోవడం కల్ల అన్న వాస్తవం మరోసారి ఆవిష్కారమైంది. పాకిస్తాన్ తో యుద్ధం మొదలైనా సరే, మావోయిస్టులతో అంతర యుద్ధం కొనసాగుతుందని అర్థం చేసుకోవాల్సి ఉంది.

హైదరాబాద్, మే 5 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
‘ఇక తూటాలే! మాటల్లేవ్! మాట్లాడుకోవడాలు లేనే లేవ్’ అని తేల్చేశారు ఈ దేశ హోంశాఖ సహాయ మంత్రి బండి సజయ్. ‘ఆపరేషన్ కగార్’ తీవ్రతలో చేపట్టిన ‘శాంతి చర్చల’ ప్రస్థావన, ‘సేవ్ కర్రె గుట్టలు’ లేదా ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ చేపట్టిన కొద్ది రోజుల్లోనే ‘క్లోజ్’ అయినట్లేనా? కనీసం ‘చూద్దాం. ఆలోచిద్దాం.’ అన్న ధోరణిలో కాకుండా, ‘చర్చల ప్రసక్తే లేద’ని కరాఖండిగా తేల్చేశారాయన. పైగా ‘నిషేధిత సంస్థతో చర్చలు జరిపే ప్రసక్తే రాదం’టూ చర్చల నిగ్గు తేల్చారు. పోటీపడి ప్రకటనలిస్తున్న తాజా, మాజీ సీఎంలను నిలదీస్తూ, ‘దమ్ముంటే మావోయిస్టులపై నిషేధం ఎత్తేయగలరా!?’ అంటూ ప్రశ్నించి, వారిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. ‘సామాజిక సమస్యగా నక్సలిజాన్ని చూడకూడద’ని, అది ‘ముమ్మాటికీ శాంతి భద్రతల సమస్యే’నని చెప్పారు. గిరిజనులపై హింస కోణాన్ని సైతం ఎండగట్టారు. ‘చర్చలు జరిపే ప్రసక్తే లేదు. వాళ్లు తుపాకీ వీడాల్సిందే’నని హెచ్చరించారు. ‘పోలీసులకు లొంగి పోవాల్సిందే’నని సూచించారు. మొత్తానికి శాంతి చర్చల ఆలోచనేదీ కేంద్రానికి లేదని తేలిపోయింది. ఇక నరమేథమే మిగిలింది.

కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీడియాతో అన్న మాటలు ఆయన వ్యక్తిగతమైనా సరే, కచ్చితంగా ప్రభుత్వ అభిప్రాయంగా తీసుకోవాల్సిందే. అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో అత్యంత పెద్ద సమస్యగా పరిణమించిన అంతర్గత వామపక్ష తీవ్రవాదాన్ని సామరస్యంగా పరిష్కరించడం కాకుండా, కనీసం సామాజిక సమస్యగా చూసే సానుభూతి కూడా లేకపోగా, దాన్ని శాంతి భద్రతల సమస్యగానే చూడటం ప్రభుత్వాలకు అలవాటైంది. అంతేకాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సామాజిక సమస్య అని, అధికారంలోకి రాగానే శాంతిభద్రతల సమస్య అని చూడటం వల్ల వామపక్ష తీవ్రవాదంపై ఓ ద్రుక్పథమే లేకుండా పోతోంది. ‘ఆపరేషన్ కగార్’, ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ కొనసాగుతున్న నేపథ్యంలో, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

‘ఆపరేషన్ కగార విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు చూసిన మావోయిస్టుల చేతుల్లో తుపాకులుంటాయి. అయినా దాన్ని సామాజిక కోణంలో చూస్తున్నమంటున్నరు. ఇదెక్కడి పద్ధతి? వాళ్లు మందుపాతరలు పెట్టి పోలీసులను చంపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది. ఇవేవీ పట్టించుకోకుండా, నక్సలిజాన్ని సామాజిక కోణంలో చూస్తమని సీఎం చెప్పడం, మంత్రులు ఖండించడం. ఇది మంచి పద్ధతి కాదు. మావోయిస్టులపై నిషేధం తొలగించే దమ్ము మీకుందా మరి? ప్రజలు తిరగబడ్తరు. గిరిజనుల పేరుతోని నక్సలిజాన్ని చూడడం కరెక్ట్ కాదు. గిరిజనులెవరూ తుపాకులు పట్టరు. మందుపాతరలు పేల్చరు. పోలీసులను చంపరు. నక్సల్స్ హింసపై సంఘాలెప్పుడూ మాట్లాడవు. ఇయ్యాల చర్చలు జరపాలంటే ఎట్లా? ఆయుధాలు ధరించి, నిషేధానికి గురైన సంస్థలతో ప్రభుత్వం ఏవిధంగా చర్చలు జరపాలె? సీఎం, మాజీ సీఎంలు పోటీపడి మావోయిస్టులను సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహాముత్తారం మండలంలో ఒక ఎస్ఐని బ్లాస్టింగ్ తో చంపేసిండ్లు. ఆరోజు ఆ ఎస్ఐ భార్య సీమంతం. ఓ కానిస్టేబుల్ ని చంపేసిండ్లు ఆరోజే.. ఆ కానిస్టేబుల్ కొడుకు బర్త్ డే.. మరి ఆరోజు ఈ కేసీఆర్ ఏమైండు? రేవంత్ రెడ్డి ఏడ బోయిండు? కవరేజ్ కోసం వెళ్ళిన ఓ రిపోర్టర్ ని చంపేసిండ్లు. మరి ఆరోజు కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలేదు? వరంగల్ లో సామా జగన్మోహన్ రెడ్డి అనే మా కార్యకర్తను చంపేసిండ్రు.. అప్పుడెండుకు మాట్లాడలేదు వీళ్లు? రామన్న, గోపన్నను చంపేసిండ్లు.. అప్పుడెందుకు మాట్లాడలేదు వీళ్లు? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేసిండ్లు. అజాత శత్రవు శ్రీపాదరావును చంపేస్తే, కేసీఆర్ టీడీపీలో ఉన్నపుడు టీడీపీ నాయకులను చంపేసిండ్రూ. అప్పుడెందుకు మాట్లాడలే? ఇయ్యాల పోటీబడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బలగాలను మైన్స్ బెట్టి ఇదే ములుగు ఫారెస్టులో చంపడాన్ని వీళ్లు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తే లేదు..వాళ్లు తుపాకీ వీడాల్సిందే. పోలీసులకు లొంగిపోవలసిందే. నిషేధిత సంస్థతో చర్చలు జరిపే సందర్భమే రాదు.’ అని బండి సంజయ్ తేల్చేశారు.

అంతేకాదు. ‘వచ్చే మార్చి నెలాఖరులోగా నక్సల్స్ రహిత దేశంగా మార్చడం ఖాయమని’ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో పదే పదే చెబుతూ వస్తున్నారు.

‘మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని బస్తర్ వాసులే కోరుకోవడంలేదు. చర్చలు జరపాలని కోరడానికి వీళ్ళెవరు?’ అంటూ తెలంగాణా వ్యాప్తంగా పెరుగుతున్న శాంతి చర్చల గళాలను ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హోం మంత్రి విజయ్ శర్మలు నిలదీశారు.

శాంతి చర్చల ఊసు ఊపందుకున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మసర్థిస్తే, ఆ ఇద్దరికీ సమర్థనగా చత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హోం మంత్రి విజయ్ శర్మల వ్యాఖ్యలున్నాయి. ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయడమేగాక, దాన్ని సమర్థించుకుంటున్నదన్నమాట. ఇక పాకిస్తాన్ తో యుద్ధం మొదలైనా సరే, మావోయిస్టులతో అంతర్యుద్ధం ఆగదన్న విషయం అవగతమైతే అందరికీ మంచిదన్న హెచ్చరికలు కూడా అందులో కనిపిస్తున్నాయి.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News